లారీ బోల్తా.. 26 మూగజీవాల మృతి

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం వద్ద ఆదివారం వేకువ జామున ఆవులు రవాణా చేస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 26 మూగజీవాలు చనిపోయాయి.

Published : 03 Oct 2022 03:10 IST

బొబ్బిలి, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం గొర్లె సీతారాంపురం వద్ద ఆదివారం వేకువ జామున ఆవులు రవాణా చేస్తున్న లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 26 మూగజీవాలు చనిపోయాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లా గుమడ నుంచి హైదరాబాద్‌కు లారీలో సుమారు 47 ఆవులను తరలిస్తున్నారు. గొర్లె సీతారాంపురం వద్ద రహదారి గోతులమయంగా ఉండడంతో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. పోలీసులు కేసు నమోదుచేశారు. వేకువజామున వాహనం బోల్తాపడగా ఉదయం 7గంటల వరకు అధికారులెవరూ చేరుకోలేదని స్థానికులు మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని