☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 19/01/2021 20:02 IST
ఆసీస్‌ మాజీలూ.. ఇప్పుడేమంటారు?

ఇంటర్నెట్‌ డెస్క్: బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని భారత్‌ 2-1 తేడాతో సాధించింది. గబ్బా టెస్టులో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను మట్టికరిపించి చారిత్రక విజయం అందుకుంది. అయితే తొలి టెస్టులో ఓటమిపాలైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే కుప్పకూలి జీర్ణించుకోలేని రికార్డును నమోదు చేసింది. దానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వ సెలవులపై స్వదేశానికి వెళ్లాడు. దీంతో ఆసీస్‌ మాజీ క్రికెటర్లు సిరీస్‌లో భారత్‌ ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని మొదటి టెస్టు అనంతరం జోస్యం చెప్పారు.

‘విరాట్‌ కోహ్లీ లేకపోతే భారత్‌కు కష్టమే. 4-0తో ఆస్ట్రేలియాదే సిరీస్’ అని రికీ పాంటింగ్‌, మార్క్‌ వా, బ్రాడ్‌ హాడిన్‌ పేర్కొన్నారు. మైకేల్ క్లార్క్‌ ఇంకాస్త తొందరపడి.. ‘కోహ్లీ లేకుండా టీమిండియా కంగారూల గడ్డపై గెలిస్తే ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చు’ అని మితిమీరిన వ్యాఖ్యలు చేశాడు. వాళ్లకు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ కూడా వంతపాడాడు. కానీ అడిలైడ్‌ టెస్టు తర్వాత భారత్ దెబ్బతిన్న సింహంలా గర్జించింది. మెల్‌బోర్న్‌లో గెలిచించి.. అద్భుత పోరాటంతో సిడ్నీ టెస్టును డ్రాగా ముగించింది. ఇక నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో పూర్తి ఆధిపత్యం చెలాయించి సిరీస్ కైవసం చేసుకుంది.

అయితే భారత్‌ను తక్కువగా అంచనా వేసిన ఆసీస్ మాజీలపై ప్రస్తుతం నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లపై మీమ్స్‌ పోటెత్తున్నాయి. వాళ్లు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేయడంతో పాటు చురకలంటించేలా చేసిన పోస్ట్‌లు‌ నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. ఆసీస్‌ మాజీలకు టీమిండియా తగిన గుణపాఠం చెప్పిందని పలువురు పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌, సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా ఆసీస్‌ను ట్రోల్‌ చేస్తూ పోస్ట్‌లు పెట్టారు. మాజీ క్రికెటర్లు చేసిన కామెంట్లు ఇప్పుడు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉందని శశిథరూర్‌ అన్నారు. క్లార్క్‌ చెప్పిన్నట్లు ఈ విజయాన్ని ఏడాది పాటు సంబరాలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు.

ఇవీ చదవండి

గబ్బా కోటకు టీమ్‌ఇండియా బీటలు

మాటల్లో చెప్పలేను: రహానె

ఆసీస్‌ పొగరుకు, గర్వానికి ఓటమిది

ధోనీని అధిగమించి పంత్ కొత్త రికార్డు.. 

భారత్‌ vs ఆస్ట్రేలియా: కొత్త రికార్డులు




Tags: sports newsShashi TharoorMichael ClarkeRicky PontingMark WaughMichael ClarkecricketRavichandran AshwinINDvAUSశశిథరూర్‌మైకేల్ క్లార్రికీ పాంటింగ్మార్క్‌ వారవిచంద్రన్‌ అశ్వి్‌న్‌క్రికెట్‌

మరిన్ని

  • హైదరాబాద్‌కు ఐపీఎల్‌ నిర్వహించే సత్తా ఉంది  [13:08]
  • సవాళ్లకు పంచ్‌[07:50]
  • అశ్విన్‌.. ఇంగ్లాండ్‌ను ఎక్కడా వదలట్లేదు  [01:25]
  • మొతేరా పిచ్‌పై ఎందుకలా ఏడుస్తున్నారు?[01:18]
  • భయపడతారని భారత్‌ ముందే ఊహించింది[01:08]
  • నాలుగో టెస్టుకు పిచ్‌ ఎలా ఉండనుందో..[11:02]
  • వారి స్పిన్‌కు మావద్ద సమాధానం కరవు..![09:41]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • నటి హిమజకు పవన్‌ లేఖ
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • అంబానీ ఇంటి వద్ద వాహనం మా పనే
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత
  • గాలికొడుతుండగా పేలిన టైరు: ఇద్దరు మృతి 
  • విద్యార్థిని అత్యాచారం డ్రామా!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.