☰
శనివారం, జనవరి 16, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 23/11/2020 12:42 IST
ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆదాయం ఎంతో తెలుసా?

స్పష్టం చేసిన కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ఐపీఎల్‌ లాంటి మెగా టీ20 క్రికెట్‌ లీగ్‌ నిర్వహించి అందరి చేతా శెభాష్‌ అనిపించుకుంది బీసీసీఐ. ఏటా వేసవి కాలంలో భారత్‌లో నిర్వహించే ఈ లీగ్‌.. కరోనా పరిస్థితుల ప్రభావంతో ఈసారి యూఏఈకి తరలివెళ్లింది. సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు 50 రోజులకి పైగా క్రికెట్‌ ప్రేమికుల్ని అలరించింది. అయితే, ఎప్పుడూ అభిమానుల కేరింతలతో ఉత్సాహభరితంగా కనిపించే మైదానాలు ఈసారి ఎవరూ లేక వెలవెలబోయాయి. అయినా ఆ లోటు కనిపించకుండా నిర్వాహకులు వర్చువల్‌ పద్ధతిలో ఉత్సాహపరిచారు. ఇలాంటి‌ పరిస్థితుల్లో ఇంత పెద్ద టోర్నీ నిర్వహించడం సాధ్యమేనా అనుకునే తరుణంలో బీసీసీఐ దిగ్విజయంగా పూర్తి చేయడమే కాకుండా మంచి ఆదాయాన్ని ఆర్జించిందని కోశాధికారి అరుణ్‌ ధుమాల్‌ పేర్కొన్నారు.

తాజాగా ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడిన ఆయన.. టోర్నీ నిర్వహణ, దాని ఆదాయంపై స్పందించాడు. ఈ 13వ సీజన్‌ నిర్వహించడంపై తొలుత అందరూ అనుమానాలు వ్యక్తం చేశారని, కానీ ప్రధాన కార్యదర్శి జైషా ధైర్యం చేసి ముందడుగు వేశారని చెప్పారు. ఇక చెన్నై జట్టులో కరోనా కేసులు తేలడంతో అప్పుడు కాస్త ఆలోచించామన్నారు. వారికి లక్షణాలు లేకపోవడంతో ఐసోలేషన్‌లో ఉంచామని, తర్వాత ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనించామని చెప్పారు. ప్రత్యేక వైద్య బృందాలతో పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్లంతా కోలుకున్నాక టోర్నీని దిగ్విజయంగా కొనసాగించినట్లు వివరించారు. అయితే, ఈ సీజన్‌ నిర్వహణ మొత్తంలో 35 శాతం ఖర్చులు తగ్గించుకున్నట్లు తెలిపారు. బీసీసీఐ సుమారు 4 వేల కోట్ల ఆదాయం పొందిందని, అలాగే గతేడాదితో పోలిస్తే ఈసారి టీవీ, డిజిటల్‌ మాధ్యమాల వీక్షకుల సంఖ్య 25 శాతం పెరిగిందని వివరించారు. టోర్నీ జరిగినన్ని రోజులు అన్ని ఫ్రాంఛైజీల వారికి మొత్తం 30 వేల ఆర్టీ-పీసీఆర్‌ కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు అరుణ్‌ వెల్లడించారు.

Tags: Arun DhumalBCCIT20 CricketSourav GangulyJaishahఅరుణ్‌ ధుమాల్‌బీసీసీఐటీ20 క్రికెట్‌సౌరభ్‌ గంగూలీజైషా

మరిన్ని

  • యాష్‌ లేకున్నా సుందర్‌ నష్టం చేశాడు: ఆసీస్‌[18:22]
  • పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్‌[16:24]
  • ఆర్పీసింగ్‌ తర్వాత నటరాజన్‌[14:44]
  • రోహిత్‌ శర్మ ఆరోసారి[13:39]
  • పాండ్య సోదరులకు పితృ వియోగం..[10:57]
  • గబ్బా టెస్టు: వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం[10:21]
  • రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే[09:42]
  • గబ్బా టెస్టు: తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌[08:51]
  • గబ్బా టెస్టు: బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌[08:38]
  • గబ్బా టెస్టు: ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌ 369   [07:43]
  • 112 ఓవర్లకు ఆస్ట్రేలియా 357/9[06:46]
  • తొలి రోజు ఆస్ట్రేలియా 274/5  [00:42]
  • టీమ్‌ఇండియాలో మరో ఆటగాడికి గాయం[00:32]
  • అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా‌‌![00:27]
  • పాండ్య బ్రదర్స్‌.. ధైర్యంగా ఉండండి[19:30]
  • గబ్బా టెస్టు: రెండో రోజు ఆట రెండు సెషన్లే[12:49]
  • అర్ధ శతకానికి ముందు రోహిత్‌ ఔట్‌[09:45]
  • అభిమానుల దుశ్చర్య:సిరాజ్‌పై వ్యాఖ్యలు[00:48]
  • శతకం చేశాక సెలబ్రేట్‌ చేసుకోను: లబుషేన్‌[00:22]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
  • ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
  • క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
  • రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే
  • కన్నీటి పర్యంతమైన మోదీ
  • సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 
  • చరిత్ర సృష్టించిన నయా యార్కర్‌ కింగ్‌
  • పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్‌
  • కంగారూను పట్టలేక..
  • ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.