☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 20/01/2021 12:42 IST
అమిత్‌ షాతో కీలక అంశాలు చర్చించిన జగన్‌

దిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ ముగిసింది. సుమారు తొంభై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై అమిత్‌ షాతో జగన్‌ చర్చించారు. పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ (ఆర్‌సీసీ) సిఫార్సు మేరకు ప్రాజెక్టు వ్యయాన్ని రూ.55,656.87 కోట్లుగా ఆమోదించాలని సీఎం జగన్‌ కోరారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ నోటిఫికేషన్‌ జారీచేయాలని అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని 2019 ఎన్నికల్లో భాజపా తన మేనిఫెస్టోలో ఉంచిందని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. విజయనగరం జిల్లా సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తగిన చర్యలు చేపట్టేలా సంబంధిత శాఖను ఆదేశించాలని కోరారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక హోదాతో కేంద్రం నుంచి నిధులు లభిస్తాయి. దీనివల్ల ఆర్థిక భారం క్రమంగా తగ్గుతుంది. కొత్త పరిశ్రమలు వస్తాయి. మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 332 కేంద్రాల్లో  కొవిడ్‌ వాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైందని రాబోయే 10 రోజుల్లో ఆరోగ్య సిబ్బంది అందరికీ వాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు చేపట్టిన చర్యలను అమిత్‌ షాకు వివరించారు. ప్రజారోగ్య రంగాన్ని పటిష్టం చేసేందుకు నాణ్యమైన వైద్య సేవల కోసం వైద్యులు, నర్సుల సిబ్బంది సంఖ్యను పెంచాల్సి ఉంది. దీనిలో భాగంగా నూతనంగా 13 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ఇప్పటికే మూడు కళాశాలలకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, మిగిలిన 10 కళాశాలలతో పాటు వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కళాశాలలను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దిశ బిల్లుకు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు బిల్లుకు కేంద్రం ఆమోదం తెలిపేలా తగిన చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ కోరారు.

ఇవీ చదవండి..
ఉమాపై కొడాలి నాని మరోసారి తీవ్ర విమర్శలు
తప్పుడు కేసులకు భయపడం: దేవినేని ఉమ


Tags: Andhrapradesh Newsఆంధ్రప్రదేశ్‌ న్యూస్‌AP Newsఏపీ న్యూస్‌Jaganజగన్‌AP CMఏపీ సీఎంamit shahఅమిత్‌ షాDelhi Tourదిల్లీ టూర్‌

మరిన్ని

  • కేటీఆర్‌ ఎక్కడా..? ఎన్డీఏ అంటే ఇదే![14:06]
  • ఎస్‌ఈసీ దారుణంగా వ్యవహరిస్తున్నారు: వర్ల రామయ్య[13:28]
  • చంద్రబాబును హైదరాబాద్‌ పంపించేందుకు యత్నం[12:56]
  • ప్రతిపక్ష నేతకి రాష్ట్రంలో పర్యటించే హక్కులేదా?[12:38]
  • మా గొంతు నొక్కలేరు : చంద్రబాబు[12:17]
  • చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం [08:04]
  • ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్‌ ప్రచారకర్తలు వీళ్లే[01:19]
  • ITIRకు ప్రత్యామ్నాయం చూపించండి: కేటీఆర్‌[01:12]
  • యానాం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ సీఎం[01:04]
  • దీదీతో ఆర్జేడీ దోస్తీ.!  [12:30]
  • రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత[10:20]
  • హంగ్‌ ఏర్పడితే భాజపాతో మమత దోస్తీ[01:27]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం
  • నటి హిమజకు పవన్‌ లేఖ
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • భార్య, బిడ్డ బతికితే చాలనుకున్నా!
  • అంబానీ ఇంటి వద్ద వాహనం మా పనే
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఉద్రిక్తత
  • గాలికొడుతుండగా పేలిన టైరు: ఇద్దరు మృతి 
  • అలా చేశాక జుట్టు ఊడుతుంది?
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.