☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 08/04/2021 01:08 IST
ధోని.. ‘కెప్టెన్‌ 7’

ముంబయి: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మరో కొత్త అవతారం ఎత్తాడు. ‘కెప్టెన్‌ 7’ పేరుతో తెరకెక్కనున్న యానిమేటెడ్‌ సిరీస్‌తో నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నాడు. గూఢచర్యం నేపథ్యంలో నిర్మించనున్న ఈ సిరీస్‌లో తొలి సీజన్‌ ధోని మీదే  నడుస్తుందట. ఇప్పటికే అది ప్రి ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. 7 అనేది ధోని జెర్సీ నంబర్‌ అనే సంగతి తెలిసిందే. మహి భార్య సాక్షికి చెందిన ధోని ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి బ్లాక్‌ వైట్‌ ఆరెంజ్‌ బ్రాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (బీడబ్ల్యూఓ) ఈ సిరీస్‌ను రూపొందించనుంది. దేశంలోనే గూఢచర్యం నేపథ్యంలో రానున్న తొలి యానిమేటెడ్‌ సిరీస్‌ ఇదే అని నిర్మాతలు తెలిపారు. తొలి సీజన్‌ను 2022లో విడుదల చేయనున్నారు. ‘‘కథ, కథనం గొప్పగా ఉన్నాయి. క్రికెట్‌తో పాటు నా ఇతర అభిరుచులకు ఇది జీవం పోస్తుంది’’ అని ధోని చెప్పాడు. ఈ సిరీస్‌ పూర్తిగా సాహసోపేతంగా ఉంటుందని సాక్షి పేర్కొంది. ‘‘క్రీడలెప్పుడూ మా హృదయాలకు దగ్గరగా ఉంటాయి. మేం ధోనీకి గొప్ప అభిమానులం. ‘కెప్టెన్‌ 7’ను సృష్టించడానికి ఇంతకంటే కావాల్సిందేం ఉంటుంది? ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో జతకట్టడం కలలా ఉంది. ఈ సిరీస్‌ను అభిమానులకు వీలైనంత త్వరగా చూపించాలనే ఆత్రుతతో ఉన్నాం’’ అని బీడబ్ల్యూఓ వ్యవస్థాపకుడు, సీఈవో భావిక్‌ వోరా చెప్పాడు.

Tags:

మరిన్ని

  • స్టైలిష్‌ లుక్‌లో కోహ్లీ.. తగ్గేదే లేదంటున్న పుజారా..  ఈ రోజు ఐపీఎల్‌ హంగామా అంతటా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం..
  • బెంగళూరు భలే బోణీ ముంబయి ఇండియన్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మ్యాచ్‌ అంటే.. లీగ్‌లో అయిదు టైటిళ్లు గెలిచిన రోహిత్‌ సేననే ఫేవరెట్‌గా పేర్కొంటారు ఎవరైనా. కానీ ఐపీఎల్‌ 14వ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో బెంగళూరుదే పైచేయి అయింది...
  • సింగిల్స్‌కు రోజులు దగ్గర పడ్డాయ్‌ మ్యాచ్‌ల్లో క్రికెటర్లు సింగిల్స్‌ను తిరస్కరించే రోజులు ఎంతో దూరంలో లేవని, ఇప్పుడంతా బౌండరీలదే పెత్తనమని టీమ్‌ఇండియా దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. ‘‘సమాచారం, విశ్లేషణ క్రికెట్లో విప్లవాత్మక మార్పులకు ఎలా కారణమవుతున్నాయి’’
  • ఇక్కడ శిక్షణ..అక్కడ ఆట ఇంగ్లాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌తో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్‌తో తలపడే మ్యాచ్‌కూ కలిపి మొత్తం 20 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను న్యూజిలాండ్‌ ప్రకటించింది. అందులో 21 ఏళ్ల
  • భారత్‌ హాకీ జట్టు ఏడాది తర్వాత.. ఏడాది విరామం తర్వాత భారత హాకీ జట్టు తొలి అగ్రశ్రేణి అంతర్జాతీయ టోర్నీ బరిలో దిగబోతోంది. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఒలింపిక్‌ ఛాంపియన్‌ అర్జెంటీనాతో మన్‌ప్రీత్‌సింగ్‌ సారథ్యంలోని భారత్‌ రెండు
  • ఇంద్రానగర్‌ గూండా ఇక్కడ.. ద్రవిడ్‌ అదుర్స్‌!‌‌ ప్రశాంతతకు మారు పేరైన భారత క్రికెటర్లలో రాహుల్‌ ద్రవిడ్‌ ముందువరుసలో ఉంటారు. అలాంటి ద్రవిడ్‌ ఓ నగరం నడి బొడ్డున....

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.