☰
బుధవారం, ఏప్రిల్ 14, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 09/03/2021 09:33 IST
క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన ‘వీఐటీ’

ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో దేశంలోనే 12వ స్థానం

ఈనాడు డిజిటల్‌, చెన్నై: వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ(వీఐటీ) ఈ ఏడాది క్యూఎస్‌ సబ్జెక్ట్‌ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిందని, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీలో దేశంలో 12వ స్థానంలో నిలిచిందని వీఐటీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతోపాటు ప్రపంచంలోని టాప్‌ 450 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా తమ సంస్థ నిలిచిందని వివరించారు. ‘క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్‌ సబ్జెక్ట్‌-2021’ మొత్తం 51 విభాగాలను కవర్‌ చేస్తుందని వెల్లడించారు. ఏటా ఒక నిర్దిష్ట సబ్జెక్టులో ప్రముఖ విశ్వవిద్యాలయాన్ని గుర్తించడానికి విద్యార్థులకు ఇది ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం క్యూఎస్‌ ప్రచురించిన జాబితాలో వీఐటీలోని ఏడు సబ్జెక్టులు చోటు సాధించాయన్నారు. వాటిలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ), మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీలు గత సంవత్సరంతో పోలిస్తే 50 స్థానాలు మెరుగుపడినట్లు వివరించారు. వీటిలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, ఈఈఈ దేశంలోనే టాప్‌-10లో ఉన్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోనే ఈఈఈ టాప్‌-300లో ఉన్నట్లు... కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లు టాప్‌-400లో ఉన్నాయని తెలిపారు. వీఐటీకి చెందిన గణితం, జీవశాస్త్రాలు తొలిసారిగా క్యూఎస్‌ సబ్జెక్ట్‌ ర్యాంకింగ్‌లో ప్రవేశించాయని... వాటికి ప్రపంచంలో టాప్‌ 500, 600 స్థానాలు దక్కాయని పేర్కొన్నారు.

Tags:

మరిన్ని

  • ఎవర్‌ గివెన్‌ నౌకకు 100 కోట్ల డాలర్ల జరిమానా సూయజ్‌ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయి నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన కంటెయినర్‌ రవాణా నౌక ‘ఎవర్‌ గివెన్‌’కు...
  • గామా కిరణాలను వెదజల్లుతున్న సుదూర గెలాక్సీ గామా కిరణాలను వెదజల్లుతున్న అత్యంత సుదూర గెలాక్సీని భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ క్రియాశీల నక్షత్ర మండలం...
  • లైంగిక హింసకు పాల్పడుతున్న సైనిక, అతివాద గ్రూపులు కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది పలు దేశాల్లో లైంగిక హింస పెచ్చరిల్లిందని; సైనికులు, అతివాదులు యుద్ధ తంత్రంలో ...
  • వేగంగా సోకుతున్న బ్రిటన్‌ వైరస్‌! బ్రిటన్‌లో గుర్తించిన బి.1.1.7. రకం కరోనా వైరస్‌... అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోందని, అయితే దీని కారణంగా...
  • టీకాలు కొవిడ్‌ ఉద్ధృతిని తగ్గిస్తాయి.. కొవిడ్‌-19 టీకాలు.. ఇన్‌ఫెక్షన్‌ తీవ్రం కాకుండా, మరణాల ముప్పు పెరగకుండా అడ్డుకుంటాయని భారత వైద్య పరిశోధన మండలి ...
  • కరోనా కథ ఇంకా ముగియలేదు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కథ ఇంకా ముగియలేదని, వైరస్‌ను అడ్డుకోవడానికి టీకా ఒక్కటే మార్గం...
  • ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా పేలుడు పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ జరుగుతుండగా శక్తిమంతమైన పేలుడు సంభవించిందని, ఈ ...
  • రంజాన్‌ ఉపవాసంతోనూ కరోనా టీకా తీసుకోవచ్చు కరోనా టీకా తీసుకోవడం వల్ల రంజాన్‌ నెలలో ఉపవాసాలకు ఎలాంటి ఇబ్బంది లేదని ముస్లిం మతపెద్దలు మంగళవారం...
  • ఇంటి నుంచే విచారణ చేపట్టిన సుప్రీం న్యాయమూర్తులు కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మంగళవారం ఇంటి నుంచే కార్యకలాపాలు...
  • ఆక్సిజన్‌పై ఉన్నవారికే రెమ్‌డెసివిర్‌ రెమ్‌డెసివిర్‌ను వైద్యులు హేతుబద్ధంగా ఉపయోగించాలని, దాన్ని నేషనల్‌ ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ఉపయోగించడం అనైతికమని ...
  • వ్యాక్సిన్‌ కొరత లేదు దేశంలో కరోనా టీకాలకు కొరత లేదని, సరైనా ప్రణాళిక లేకపోవడమే అసలు సమస్య అని కేంద్రం మంగళవారం స్పష్టంచేసింది. ..
  • ప్రాథమిక దశలోనే జోక్యం వద్దు ఒక కేసు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు దానిలో జోక్యం చేసుకునే విషయంలో హైకోర్టులు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది....
  • మహారాష్ట్రలో జనతా కర్ఫ్యూ కరోనా కేసులు ఉద్ధృతమవుతుండటంతో... మహారాష్ట్రలో 15 రోజుల పాటు లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు విధిస్తున్నట్టు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వెల్లడించారు....
  • న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపిస్తాం అసెంబ్లీ ఎన్నికలను శాంతియుతంగా, న్యాయబద్ధంగా నిర్వహిస్తామని భారత 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ)గా మంగళవారం బాధ్యతలు చేపట్టిన సుశీల్‌ చంద్ర తెలిపారు. సునీల్‌ అరోడా స్థానంలో సుశీల్‌ చంద్రను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ...

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • బుల్లితెర జలపాతంలో సుధీర్‌, రష్మి
  • మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం
  • ‘ప్రియుడి ఒత్తిడితోనే కుమార్తె ఆత్మహత్య’
  • ఇజ్రాయెల్..‌ అందుకో టీకా ఫలం‌!
  • మార్కెట్లలో జోష్‌ నింపిన కేంద్రం నిర్ణయం
  • పదేళ్లకే నాకు పెళ్లి చేశారు: నటి కృష్ణవేణి
  • సెకండ్‌ వేవ్‌.. చిత్రసీమపై కరోనా ప్రతాపం
  • ఐపీఎల్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌
  • రోహిత్‌ నమ్మాడు.. రాహులే వికెట్లు తీశాడు
  • ఈ ఏడాది ఇంక్రిమెంట్ల జోరు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.