☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 08/04/2021 10:38 IST
భారత ప్రయాణికులకు న్యూజిలాండ్‌ ‘నో ఎంట్రీ’  

వెల్లింగ్టన్‌: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో న్యూజిలాండ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు (ఆ దేశ పౌరులతో సహా) తమ దేశంలోకి ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్‌ 11 నుంచి రెండు వారాల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుందని న్యూజిలాండ్‌ ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ మీడియా సమావేశంలో వెల్లడించారు. 

‘‘భారత్‌ నుంచి ప్రయాణికులెవరూ న్యూజిలాండ్‌లోకి రాకుండా ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం. ఏప్రిల్‌ 11 సాయంత్రం 4 గంటల నుంచి ఏప్రిల్‌ 28 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ప్రయాణికుల రాకపై తాత్కాలిక నిషేధం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను మేం అర్థం చేసుకోగలం. కానీ, వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని జెసిండా వివరించారు. అవసరమైతే నిషేధాన్ని మరింత కాలం పొడగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

న్యూజిలాండ్‌ సరిహద్దుల్లో పనిచేసే సిబ్బందిలో ఓ వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అంతేగాక, ఇటీవల విదేశాల నుంచి న్యూజిలాండ్‌కు వచ్చిన ప్రయాణికులకు సరిహద్దుల్లో పరీక్షలు నిర్వహించగా.. అందులో 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. కాగా.. వీరిలో 17 మంది భారత్‌ నుంచి వచ్చినవారే కావడంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా సరిహద్దుల్లోనే వైరస్‌ను అడ్డుకునేలా న్యూజిలాండ్‌ కఠిన చర్యలు చేపడుతోంది. గత 40 రోజులుగా అక్కడ ఎలాంటి సామాజిక వ్యాప్తి కేసులు నమోదు కాలేదు. ఇదిలా ఉండగా.. భారత్‌లో గత కొద్ది రోజులుగా కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. రోజువారీ కొత్త కేసుల్లో గణనీయ వృద్ధి ఆందోళన కలిగిస్తోంది. 

ఇవీ చదవండి

  • ఆగని ఉద్ధృతి: 1,26,789 కరోనా కొత్త కేసులు

  • కరోనా తెచ్చిన ‘కాష్ఠ’మిది

Tags: National Newsజాతీయ వార్తలుNew Zealandన్యూజిలాండ్‌Jacinda Ardernజెసిండా ఆర్డెర్న్‌Indiaభారత్‌Corona Virusకరోనా వైరస్‌Covid 19కొవిడ్‌ 19

మరిన్ని

  • పోలింగ్‌ రక్తసిక్తం.. బెంగాల్‌లో 76.16% ఓటింగ్‌‌!  [20:29]
  • కరోనాకు కేంద్ర విధానాలే కారణం: రాహుల్ గాంధీ[19:04]
  • కరోనా కట్టడికి డబ్ల్యుహెచ్‌ఓ సూచనలు[18:22]
  • దీదీ..ఇది 2021: మోదీ[18:12]
  • లాక్‌డౌన్ ఉండదు కానీ..: కేజ్రీవాల్[18:02]
  • 150మంది మాపై దాడి చేయడంతోనే..  [17:26]
  • ఆ 10 జిల్లాల్లోనే 45% యాక్టివ్‌ కేసులు!  [16:56]
  • అంతర్గత వ్యవహారాల్లో  బయటివారి సలహాలు అక్కరలేదు![16:21]
  • కరోనా సెకండ్‌ వేవ్‌: చిన్నారులపైనా ప్రభావం[16:10]
  • అక్కడ.. అదను చూసి కరోనా బుసలు[15:24]
  • మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర?[13:14]
  • దండకారణ్యంలో దడ[12:40]
  • ఒక్కరోజే 1.45లక్షల మందికి కరోనా[09:53]
  • అంటార్కిటికాలోహిమఫలకానికి ముప్పు[08:00]
  • ఉద్యమ రైతుల్లో కరోనా లేదు![01:19]
  • కరోనా వచ్చింది అతడికి.. నాకు కాదు[01:17]
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు![01:14]
  • ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా[13:22]
  • ఆందోళన కల్గిస్తోన్న టీకా కొరత[08:26]
  • రక్తం గడ్డకట్టిన దాఖలాలు ఉన్నాయా..![01:12]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.