☰
గురువారం, మార్చి 04, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 16/01/2021 15:03 IST
అతిపెద్ద వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభం

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి నిరోధానికి అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం 10.30 గంటలకు బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశ శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. వ్యాక్సిన్లతో భారత్‌ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు. 

‘కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశమంతా ఎదురుచూసింది. టీకా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ అడిగారు. ఆ రోజు వచ్చేసింది. ఈ సందర్భంగా టీకా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నా. వ్యాక్సిన్‌ రూపకల్పనకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడ్డారు. వ్యాక్సిన్ల తయారీ కోసం ఎందరో అవిశ్రాంతంగా పనిచేశారు. సాధారణంగా టీకాల తయారీకి ఏళ్లు పడుతుంది. కానీ మన శాస్త్రవేత్తలు అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశారు. వారి కృషి ఫలితంగా నేడు ఒకటి కాదు రెండు స్వదేశీ టీకాలు అందుబాటులోకి వచ్చాయి. దేశీయ టీకా తయారీతో భారత్‌ సత్తా మరోసారి ప్రపంచానికి తెలిసింది’ అని మోదీ ప్రశంసించారు. 

రెండో డోసును మర్చిపోవద్దు..

‘టీకా తీసుకోవడంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులే తొలి హక్కుదారులు. కరోనాను ఎదుర్కొనేందుకు రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలి. రెండు డోసులకు మధ్య నెల రోజుల వ్యవధి ఉండాలని నిపుణులు సూచించారు. అందువల్ల రెండో డోసును మర్చిపోవద్దు. అంతేగాక, తొలి డోసు వేసుకున్నాక కూడా మాస్క్‌లు,భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే రెండో డోసు వేసుకున్న తర్వాతే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది’ అని మోదీ వివరించారు. 

ధైర్యంగా ఉండాలి..

కరోనాను ఎదుర్కొనేప్పుడు ఎలాంటి ధైర్యం ప్రదర్శించారో ఇప్పుడు కూడా అంతే ధైర్యాన్ని చూపాలని మోదీ అన్నారు. కరోనా మహమ్మారిపై యుద్ధం సమయంలో యావత్‌ భారతావని కుటుంబంలా మారిందని, సమైక్యతతోనే వైరస్‌ను ఎదుర్కోగలిగామని తెలిపారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టగలిగామన్నారు. 

ప్రధాని నోట.. తెలుగు పలుకులు

ప్రసంగంలో భాగంగా మోదీ తెలుగులో మాట్లాడారు. ‘‘సొంతలాభం కొంత మానుకో. పొరుగువాడికి తోడుపడవోయ్‌. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్‌’’ అంటూ తెలుగు మహాకవి గురజాడ అప్పారావు రాసిన దేశభక్తి గీతాన్ని వినిపించారు. గురజాడ మాటలను ఆచరిస్తూ కరోనా పోరులో దేశ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చారని కొనియాడారు. 

దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో 100 మందికి చొప్పున నేటి నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమైంది. తొలి రోజు 3 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు టీకా ఇవ్వనున్నారు. తొలి విడతలో 3 కోట్ల మందికి, రెండో విడతలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్లు మోదీ తెలిపారు. తొలుత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, ఆరోగ్య సిబ్బందికి ప్రాధాన్యమివ్వనున్నారు. ఆ తర్వాత 50ఏళ్ల పైబడిన, ఇతర అనారోగ్య సమస్యలున్న 50ఏళ్లలోపు వారికి టీకా అందిస్తారు. 

ఇవీ చదవండి..

భారత్‌: 96.56శాతానికి పెరిగిన రికవరీ..

20లక్షలు దాటిన కరోనా మరణాలు




Tags: National Newsజాతీయ వార్తలుCorona Vaccineకరోనా వ్యాక్సిన్‌Covaxinకొవాగ్జిన్‌Covisheildకొవిషీల్డ్‌

మరిన్ని

  • సైనిక మరణాలపై సందేహం.. బ్లాగర్‌పై చైనా వేటు![01:35]
  • భారత్‌పై సైబర్‌ దాడి.. స్పందించిన చైనా![01:33]
  • ఇకపై అక్కడ మాస్క్‌ తప్పనిసరికాదు!  [01:22]
  • చంద్రుడిపైకి ఫ్రీ ట్రిప్‌.. జపాన్‌ సంపన్నుడి ఆఫర్‌![01:16]
  • ‘కొవాగ్జిన్’‌ క్లినికల్‌ సామర్థ్యం 81%[17:40]
  • గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం![17:12]
  • రాహుల్ మాటలకు నవ్వొస్తోంది: జావడేకర్[16:44]
  • పాక్‌ ఉగ్రవాదాన్ని ఎండగట్టిన భారత్‌[15:38]
  • 24×7.. ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చు[14:40]
  • బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని రేపిస్టును అడగడమా![14:22]
  • ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే.. దేశద్రోహం  అనలేం[12:53]
  • టీకా ఉత్పత్తి పెంచాలి: బైడెన్‌[12:12]
  • ఆ గ్రామంలో తొలిసారి వెలిగిన విద్యుత్‌ దీపాలు![12:03]
  • మహిళా నేతలు.. ఇచ్చిన మాట తప్పరు![10:11]
  • బైడెన్‌ సహాయకుడిగా భారతీయుడు[09:23]
  • టీకా ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయికి భారత్‌​​​​​​​[08:52]
  • విలయ వి‘చిత్రం’![07:31]
  • కన్నడనాట మంత్రి రాసలీలల సీడీ ప్రకంపన![06:49]
  • ఆ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్‌ ధర ₹50  [01:33]
  • అంతరిక్షంలో అత్యాధునిక హోటల్‌![01:28]
  • పబ్జీ గేమ్ ఆ కోవకు చెందినదే: జావడేకర్[01:24]
  • బైడెన్..భారత్‌కు అండగా ఉండండి[01:23]
  • ప్రైవేట్‌ ఉద్యోగాల్లో 75% కోటాకు హరియాణా గవర్నర్ ఓకే![01:22]
  • హెచ్‌-1బి వీసాలపై తేలని స్పష్టత[01:16]
  • ఇంటి దగ్గర టీకా తీసుకున్న కర్ణాటక మంత్రి[00:05]
  • ప్రతిభావంతులకు మెండుగా అవకాశాలు: మోదీ[19:00]
  • మయన్మార్‌: సైన్యం కాల్పుల్లో 9మంది మృతి[18:40]
  • కొవిడ్‌ టీకా వేయించుకున్న రాష్ట్రపతి[14:07]
  • తాప్సీ, అనురాగ్‌ కశ్యప్‌ నివాసాల్లో ఐటీ సోదాలు[13:22]
  • ఆ దేశంలో ఒకే రోజు 1,641 మంది మృతి[12:37]
  • నీరా టాండన్ నియామకంపై  బైడెన్‌ వెనక్కి[11:33]
  • భాజపా ఎంపీ కుమారుడి కాల్పుల నాటకం..![10:40]
  • సీరం నుంచి బ్రిటన్‌కు కోటి డోసులు![01:13]
  • రెండోరోజు వందలోపు మరణాలు[10:31]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • నమ్మించి మోసం చేశారు: జయలలిత
  • శశికళ సంచలన నిర్ణయం
  • డ్యాన్స్‌తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వీ..!
  • రాశీఖన్నా వింతకోరిక.. సారా డైలీడోస్‌
  • గంటా స్పందనపై విజయసాయిరెడ్డి కౌంటర్‌
  • నెట్‌ఫ్లిక్స్‌లో ఈ ఏడాది రాబోయే సినిమాలివే..
  • ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేయనున్న ప్రభాస్‌..!
  • హీరోయిన్స్‌ కాదు కానీ.. నెట్టింట్లో స్టార్సే
  • గత్యంతరం లేకే కాల్పుల విరమణకు అంగీకారం!
  • ఇంట్లో తెలిసిపోతుందనే డిగ్రీ విద్యార్థిని ‘కట్టు’కథ
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.