☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 08/04/2021 10:51 IST
ఆగని ఉద్ధృతి: 1,26,789 కరోనా కొత్త కేసులు

రెండోరోజు 600దాటిన మరణాలు

తొమ్మిది లక్షలు దాటేసిన క్రియాశీల కేసులు

దిల్లీ: దేశంలో కరోనా కోరలు చాస్తోంది. మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెలువరించిన గణాంకాలు ఇంతకు ముందెన్నడూ లేని తీవ్రతను కళ్లకుగడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 12,37,781 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,26,789 కొత్త కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,29,28,574కి చేరింది. మరోవైపు, క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం 9,10,319 మంది వైరస్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 6.59 శాతానికి చేరింది. 

వరసగా రెండో రోజు కరోనాతో 600మందికి పైగా మృత్యుఒడికి చేరుకున్నారు. నిన్న 685 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 1,66,862 మంది బలయ్యారు. ఇంత ఉద్ధృతిలోనూ రికవరీలు కాస్త ఊరటనిస్తున్నాయి. నిన్న 59,258 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 1.18కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 92.11శాతానికి పడిపోయింది. 

మహారాష్ట్రలో రికార్డు స్థాయి కేసులు..

మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న 59,907 మందికి కరోనా సోకగా.. 322 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. దాదాపు సగం కేసులు, మరణాలు ఈ ఒక్క రాష్ట్రంలోనే నమోదవుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా 31,73,261 మందికి వైరస్ సోకగా.. 26,13,627 మంది కోలుకున్నారు. క్రియాశీల కేసులు ఐదు లక్షల మార్కును దాటేశాయి.

తొమ్మిది కోట్ల డోసుల టీకా పంపిణీ ..

దేశవ్యాప్తంగా కరోనా టీకా కార్యక్రమం కింద కేంద్రం ఇప్పటి వరకు 9,01,98,673 డోసులను పంపిణీ చేసింది. నిన్న 29,79,292 మంది టీకా తీసుకొన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వారు పనిచేసే చోటే టీకా అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించిన సంగతి తెలిసిందే. 


ఇవీ చదవండి

  • కొవిడ్ బాధితుల్లో మానసిక సమస్యలు

  • కరోనా తెచ్చిన ‘కాష్ఠ’మిది

Tags: జాతీయ వార్తలుnational newsకరోనావైరస్ coronavirusభారత్India

మరిన్ని

  • పోలింగ్‌ రక్తసిక్తం.. బెంగాల్‌లో 76.16% ఓటింగ్‌‌!  [20:29]
  • కరోనాకు కేంద్ర విధానాలే కారణం: రాహుల్ గాంధీ[19:04]
  • కరోనా కట్టడికి డబ్ల్యుహెచ్‌ఓ సూచనలు[18:22]
  • దీదీ..ఇది 2021: మోదీ[18:12]
  • లాక్‌డౌన్ ఉండదు కానీ..: కేజ్రీవాల్[18:02]
  • 150మంది మాపై దాడి చేయడంతోనే..  [17:26]
  • ఆ 10 జిల్లాల్లోనే 45% యాక్టివ్‌ కేసులు!  [16:56]
  • అంతర్గత వ్యవహారాల్లో  బయటివారి సలహాలు అక్కరలేదు![16:21]
  • కరోనా సెకండ్‌ వేవ్‌: చిన్నారులపైనా ప్రభావం[16:10]
  • అక్కడ.. అదను చూసి కరోనా బుసలు[15:24]
  • మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర?[13:14]
  • దండకారణ్యంలో దడ[12:40]
  • ఒక్కరోజే 1.45లక్షల మందికి కరోనా[09:53]
  • అంటార్కిటికాలోహిమఫలకానికి ముప్పు[08:00]
  • ఉద్యమ రైతుల్లో కరోనా లేదు![01:19]
  • కరోనా వచ్చింది అతడికి.. నాకు కాదు[01:17]
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు![01:14]
  • ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా[13:22]
  • ఆందోళన కల్గిస్తోన్న టీకా కొరత[08:26]
  • రక్తం గడ్డకట్టిన దాఖలాలు ఉన్నాయా..![01:12]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.