☰
సోమవారం, మార్చి 01, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 22/01/2021 04:14 IST
రైతుల ఆందోళన..రూ.50వేల కోట్ల నష్టం!

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దాదాపు రెండు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ ఆందోళనలతో దాదాపు రూ. 50వేల కోట్ల విలువైన వాణిజ్య నష్టం వాటిల్లినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ (సీఏఐటీ) అంచనా వేసింది. అయితే, కొంతకాలం పాటు చట్టాల అమలును నిలిపివేస్తామని తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన ప్రయోజనకరంగానే ఉందని పేర్కొంది.

నూతన వ్యవసాయ చట్టాలను ఒకటిన్నరేళ్లపాటు నిలుపుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదన న్యాయబద్ధమైనదని సీఏఐటీ సెక్రటరీ జనరల్‌ ప్రవీన్‌ ఖండేల్‌వాల్‌ పేర్కొన్నారు. ఇది సాగు చట్టాల విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఈ పరిష్కార మార్గం సమంజసమైందేనని వెల్లడించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రైతు సంఘాలు ఈ ప్రతిపాదనకు అంగీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ రైతు సంఘాలు వీటికి అంగీకరించకపోతే, సమస్య పరిష్కారానికి రైతు సంఘాలు ఆసక్తి చూపడం లేదనే వాదనతో పాటు విభజన శక్తులు మరిన్ని సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిపాదించిన కమిటీలో వ్యాపార సంఘాలకు కూడా స్థానం కల్పించాలని సీఏఐటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఇదిలాఉంటే, సాగు చట్టాలను కొంతకాలం పాటు నిలుపుదల చేస్తామని కేంద్రం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చిన నేపథ్యంలో దీనిపై రైతు సంఘాలు తమ అభిప్రాయాలను రేపు జరగబోయే భేటీలో తెలిపే అవకాశం ఉంది. ఇదే సమయంలో దేశ రాజధానిలో రైతులు తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీపై పోలీసులు కూడా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రైతు సంఘాలతో దిల్లీ, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులు ఇప్పటికే పలుసార్లు సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
సంప్రదింపులు ప్రారంభించిన సుప్రీం నిపుణుల కమిటీ!
సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తాం

Tags: CAITవ్యాపార సంఘాలుFarm Lawsవ్యవసాయ చట్టాలుDelhiదిల్లీAgri bodies రైతు సంఘాలు

మరిన్ని

  • నిర్లక్ష్యం చేస్తే.. మూడో ముప్పు తప్పదు![01:27]
  • వాట్సాప్‌ గ్రూప్‌లకు దూరంగా సుప్రీంకోర్టు![01:18]
  • ​​​​​రైతు చట్టాలు కావవి.. డెత్‌ వారెంట్లు: కేజ్రీవాల్‌[01:08]
  • మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్‌[01:29]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!
  • బన్నీ సినిమాలో స్టార్‌ హీరో కుమార్తె..?
  • సమ్మర్‌ మూడ్‌లో కీర్తి.. బికినీలో బిపాస..
  • తల్లికాబోతున్న హీరోయిన్‌ రిచా
  • రాళ్లు రువ్వి.. వెంబడించి
  • వాహ్‌! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
  • రేపటి సిరులు
  • తెలంగాణలో ఏ ఆసుపత్రుల్లో టీకా వేస్తున్నారంటే..
  • మోదీ గర్వించదగిన వ్యక్తి: గులాం నబీ ఆజాద్‌
  • కొండంత లక్ష్యం పిండి చేసి.. 
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.