☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 27/02/2021 19:44 IST
మహారాష్ట్ర: 28 జిల్లాల్లో కరోనా విజృంభణ

ముంబయి: గత రెండు వారాలుగా మహారాష్ట్రలోని 28 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. విదర్భ, అమరావతి, అకోలా, యావత్మాల్‌ జిల్లాల్లో హాట్‌స్పాట్లను గుర్తించినట్లు వారు తెలిపారు. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇందులో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల కేసులే ఎక్కువ శాతం ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫిబ్రవరిలో పెరిగిన కేసులు ముఖ్యంగా విదర్భ, నాగ్‌పూర్‌, పుణె, ముంబయి, థానే, అమరావతి ప్రాంతాల్లోనే నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఐదు జిల్లాలు రాష్ట్రంలోని మొత్తం కేసుల్లో 65శాతం ఉన్నట్లు వారు వెల్లడించారు. అత్యధికంగా అమరావతిలో పాజిటివిటీ రేటు 41.5 శాతంగా ఉందని పేర్కొన్నారు. ఆయా జిల్లాల్లో రోజుకు సుమారు 500 నుంచి వెయ్యి కేసులు నమోదవుతున్నట్లు వారు వెల్లడించారు. ఈ మేరకు బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ గణాంకాలు విడుదల చేసింది. మారత్వాడ, ఔరంగాబాద్‌ ప్రాంతాలకు చెందిన జిల్లాల్లో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్య భారీగా పెంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

కాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 16,488 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు ఎక్కువగా పెరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర (8,333) మొదటిస్థానంలో ఉండగా, కేరళ (3,671) రెండో స్థానంలో ఉంది. గత రెండు వారాలుగా కేసుల పెరుగుదలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుతున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా మహారాష్ట్రలో కొవిడ్‌ నిబంధనలు కఠినం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన మూడు ఫంక్షన్‌ హాళ్లపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చదవండి

  • కరోనా కలవరం.. కారణమేంటి?

  • ఇంటికెళ్లే జవాన్లకు హెలికాఫ్టర్‌

Tags: జాతీయవార్తలుNational newsకరోనాcoronaమహారాష్ట్రmaharashtraముంబయిmumbaiకేరళkeralaజిల్లాలుdistrictsIndia 

మరిన్ని

  • హ్యూందాయ్‌ కార్లపై భారీ రాయితీలు[14:55]
  • ఆ ఆరు రాష్ట్రాలు సున్నితమైనవి![14:34]
  • కొవిడ్‌ విలయం: ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష[13:10]
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..[12:08]
  • భారత విమాన రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం[10:59]
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు[09:43]
  • రెమ్‌డెసివిర్‌పై ‘మహా’ జగడం[07:53]
  • టెక్సాస్‌లో కాల్పులు: ముగ్గురి మృతి[02:10]
  • కొవిడ్‌ కట్టడికి మిలటరీ కావాలి: సోరెన్‌[01:21]
  • టీకా పంపిణీకి ఆంక్షలు ఆటంకం కావద్దు![01:19]
  • ఆసక్తి రేకెత్తించిన కేంద్ర మంత్రి ట్వీట్‌[00:06]
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..![12:04]
  • ఇక oxygen express[08:38]
  • ఈజిప్ట్‌లో ఘోర ప్రమాదం: 11 మంది మృతి [06:32]
  • కొవిడ్‌ ఆంక్షలు: రోజుకు రూ.315కోట్ల నష్టం![01:17]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..!
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.