☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 03/03/2021 16:44 IST
రాహుల్ మాటలకు నవ్వొస్తోంది: జావడేకర్

దిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో విధించిన అత్యయిక పరిస్థితి గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భాజపా స్పందించింది. ఆ సమయంలో రాజ్యాంగ వ్యవస్థలు బలహీనం కాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు నవ్వుతెప్పిస్తున్నాయని ఎద్దేవా చేసింది. ‘అత్యయిక పరిస్థితి విధించిన సమయంలో దేశంలో వ్యవస్థలు బలహీనం కాలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఆయన వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తున్నాయి. అప్పటి ప్రభుత్వం అన్ని వ్యవస్థలనూ అణచివేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలను అరెస్టు చేసింది. దాదాపు అన్ని పార్టీలపై నిషేధం విధించింది. వార్తా పత్రికలను కట్టడి చేసింది’ అని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ ఆనాటి పరిస్థితులను వివరించారు. 

అలాగే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)ను ఉద్దేశించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి స్పందించారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి అర్థం చేసుకోవాలంటే, రాహుల్‌కి చాలా సమయం కావాలి. ప్రపంచంలోనే దేశభక్తిని గురించి బోధించే అతిపెద్ద సంస్థ అది’ అంటూ ఆయనపై విమర్శలు చేశారు. దేశ మాజీ ఆర్థిక సలహాదారు, కార్నెల్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ కౌశిక్ బసుతో మంగళవారం జరిపిన ఓ చర్చా కార్యక్రమంలో రాహుల్ మాట్లాడారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో అత్యయిక పరిస్థితి విధింపు కచ్చితంగా పొరపాటేనని, ఆమె కూడా ఆ విషయాన్ని అంగీకరించారని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేస్తూ.. ఆ సంస్థ దేశంలోని అన్ని రాజ్యాంగ సంస్థలను తన మనుషులతో నింపివేస్తోందని ఆరోపించారు.

ఇవీ చదవండి

  • కాంగ్రెస్‌లో చల్లారని లుకలుకలు

  • ఎమర్జెన్సీ విధింపు పొరపాటే

Tags: national newsజాతీయవార్తలు rahul gandhiరాహుల్ గాంధీ Prakash Javadekarప్రకాశ్‌ జావడేకర్

మరిన్ని

  • మంచి మాటలంటే కేంద్రానికి అలర్జీ: రాహుల్ గాంధీ[19:04]
  • కరోనా కట్టడికి డబ్ల్యుహెచ్‌ఓ సూచనలు[18:22]
  • దీదీ..ఇది 2021: మోదీ[18:12]
  • లాక్‌డౌన్ ఉండదు కానీ..: కేజ్రీవాల్[18:02]
  • 150మంది మాపై దాడి చేయడంతోనే..  [17:26]
  • ఆ 10 జిల్లాల్లోనే 45% యాక్టివ్‌ కేసులు!  [16:56]
  • అంతర్గత వ్యవహారాల్లో  బయటివారి సలహాలు అక్కరలేదు![16:21]
  • కరోనా సెకండ్‌ వేవ్‌: చిన్నారులపైనా ప్రభావం[16:10]
  • అక్కడ.. అదను చూసి కరోనా బుసలు[15:24]
  • మరిన్ని ఆంక్షల దిశగా మహారాష్ట్ర?[13:14]
  • దండకారణ్యంలో దడ[12:40]
  • ఒక్కరోజే 1.45లక్షల మందికి కరోనా[09:53]
  • అంటార్కిటికాలోహిమఫలకానికి ముప్పు[08:00]
  • ఉద్యమ రైతుల్లో కరోనా లేదు![01:19]
  • కరోనా వచ్చింది అతడికి.. నాకు కాదు[01:17]
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు![01:14]
  • ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌కు కరోనా[13:22]
  • ఆందోళన కల్గిస్తోన్న టీకా కొరత[08:26]
  • రక్తం గడ్డకట్టిన దాఖలాలు ఉన్నాయా..![01:12]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.