☰
శుక్రవారం, జనవరి 22, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 26/11/2020 01:39 IST
నివర్‌ ఎఫెక్ట్‌.. లక్ష మందికి పైగా తరలింపు!

ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ వెల్లడి

దిల్లీ: నివర్‌ తుపాను తమిళనాడు, పుదుచ్చేరిలను వణికిస్తోంది. ఈ తుపాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో లక్ష మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్ఎన్‌ ప్రధాన్‌ వెల్లడించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కేటాయించినట్టు చెప్పారు. వీటిలో 30 బృందాలను తమిళనాడు, ఏపీతో పాటు పుదుచ్చేరిలో మోహరించామన్నారు. 

పరిస్థితులను బట్టి అవసరమైతే రంగంలోకి దించేందుకు మరో 20 బృందాలను విజయవాడ, కటక్‌, త్రిస్సూర్‌లలో సిద్ధంగా ఉంచినట్టు ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ తెలిపారు. ‘నివర్‌’తో ఎదురయ్యే ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లూ చేసినట్టు చెప్పారు. ఇప్పటివరకు తమకు అందిన సమాచారం ప్రకారం గురువారం తెల్లవారు జామున 2 -3గంటల మధ్య నివర్‌ తుపాను కరైకల్‌- మామల్లాపురం మధ్య తీరం దాటనుందని స్పష్టంచేశారు. ఆ సమయంలో గంటకు 130 నుంచి 145 కి.మీల మేర గాలులు వీస్తాయని హెచ్చరించారు. ఇప్పటివరకు తమిళనాడు వ్యాప్తంగా లక్ష మందికి పైగా జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. పుదుచ్చేరిలో వెయ్యి నుంచి 2వేల మందిని స్థానిక అధికారులతో కలిసి ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తరలించారని తెలిపారు.

Tags: Nivar cycloneTamilnaduPuducherryevacuatedNDRF teams

మరిన్ని

  • టీమ్‌ఇండియా నుంచి స్ఫూర్తి పొందండి: మోదీ[13:49]
  • రైతుల ఆందోళన: 11వ విడత చర్చలు ప్రారంభం[13:35]
  • మరింత దృఢంగా.. భారత్‌-అమెరికా బంధాలు[13:18]
  • భారత్‌కు ముందు ముందు మరిన్ని సవాళ్లు..[12:04]
  • క్షీణించిన శశికళ ఆరోగ్యం[11:02]
  • టీకా అనుభవాలు తెలుసుకోనున్న మోదీ[10:30]
  • కరోనాపై యుద్ధంలో బైడెన్‌ అస్త్రాలివే..![10:00]
  • ట్రంప్‌కు టిమ్‌ కుక్‌ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా..?[01:54]
  • కొవిడ్ దెబ్బకు..ప్రధాని పదవికి రాజీనామా[01:51]
  • ట్రంప్‌ వీడ్కోలు: చాలా అందంగా ఉంది[01:42]
  • కేంబ్రిడ్జి అనలిటికాపై సీబీఐ కేసు[12:24]
  • కరోనా: 2శాతానికి దిగువనే క్రియాశీల రేటు[10:08]
  • వారానికి మూడు రోజులు సెలవులివ్వండి![09:45]
  • రైతుల ఆందోళన..రూ.50వేల కోట్ల నష్టం![01:48]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి 
  • స్వాగతం అదిరేలా..
  • రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్‌ బయటపెట్టేస్తుంది..!
  • ట్రంప్‌ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
  • క్షీణించిన శశికళ ఆరోగ్యం
  • సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్‌ సందేశం పంపించారు
  • ట్రంప్‌కు టిమ్‌ కుక్‌ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా..?
  • ఇండియా అంటే ఇది: సెహ్వాగ్‌ 
  • రూ.50 అప్పు... ప్రాణం తీసింది
  • ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.