☰
శనివారం, ఏప్రిల్ 10, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 08/04/2021 02:37 IST
1,15,736.. 24 గంటల్లో ఇదీ బాధితుల సంఖ్య

నూతన గరిష్ఠానికి కరోనా కొత్త కేసులు
  630 మంది మృతి

ఈనాడు, దిల్లీ: దేశంలో కరోనా కేసుల కొండ రోజురోజుకు మరింతగా పెరిగిపోతోంది. కొత్త కేసుల సంఖ్యలో తాజాగా నూతన గరిష్ఠం నమోదైంది. గతంలో ఎన్నడూ లేనంతగా.. గంటకు 4,822 చొప్పున ఒక్క రోజులో 1,15,736 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌లలోనూ గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. 18 రాష్ట్రాల్లో గత రెండు వారాలను మించి వచ్చాయి. తాజాగా ఒక్క రోజు వ్యవధిలో 630 మంది కొవిడ్‌-19 కారణంగా మరణించారు. నవంబర్‌ 6 తర్వాత ఇంత భారీ సంఖ్యలో బాధితులు చనిపోవడం ఇదే ప్రథమం. నాలుగు రోజులుగా ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కొత్త కేసులు భారత్‌లో నమోదవుతున్నాయి. మొత్తంగా 12 రాష్ట్రాల్లో కేసులు పురోగమనంలో సాగుతున్నాయి. 80%కిపైగా కొత్త కేసులు 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 55,469 (47.92%) కేసులు రాగా, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కేరళల్లో 32.68%మేర నమోదయ్యాయి. నెల రోజుల క్రితం 2.29%మేర ఉన్న రోజువారీ పాజిటివిటీ రేటు ఇప్పుడు 8.40%కి పెరిగింది. క్రియాశీల కేసుల సంఖ్య 8,43,473కు చేరింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 6.59%.
* గత 24 గంటల్లో 55,250 మేర పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. ఇందులో 74.5% మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనే ఉన్నాయి. అందులోనూ ఒక్క మహారాష్ట్ర వాటా 56.17%మేర ఉంది.
* తాజాగా నమోదైన 630 మరణాల్లో 297 (47.14%) మహారాష్ట్ర నుంచే వచ్చాయి. పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్‌లలోనూ గతంతో పోల్చితే మరణాలు పెరిగాయి. తాజా లెక్కల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య 1,66,177కు చేరగా, మరణాల రేటు 1.30%కి చేరింది.
* ఈ నెల 6వ తేదీ వరకు 25,14,39,598 నమూనాలను పరీక్షించామని, ఒక్క మంగళవారమే 12,08,339 పరీక్షలు చేశామని భారత వైద్య పరిశోధన మండలి బుధవారం ప్రకటించింది.

మరిన్ని

  • ‘ఎక్స్‌ప్రెస్‌ వే’గంతో కదిలిందిహైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల నిర్మించతలపెట్టిన ప్రాంతీయ రింగు రోడ్డు పనుల దస్త్రం వేగంగా ముందుకు కదిలింది. భూసేకరణకు ముందు సవివర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)
  • నిబంధనల అమలుతోనే నిధులురాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు 15వ ఆర్థిక సంఘం నిధులు అందుకోవడానికి ప్రత్యేక కసరత్తును ప్రారంభించాయి. మే 15లోపు కనీసం 25 శాతం గ్రామీణ, పట్టణ స్థానిక
  • ఆర్టీసీ ఉద్యోగులకు టీకా: మంత్రి పువ్వాడఆర్టీసీలో 45 సంవత్సరాలు దాటిన అందరికీ కరోనా వ్యాక్సిన్‌ వేసేందుకు కార్యాచరణను అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.
  • ప్రైవేటు పాఠశాలల నిర్వాకంతో సాయానికి లక్ష మంది దూరం?రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అందరికీ బడులు తెరిచే వరకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కనీసం లక్ష మంది
  • కరోనా.. గట్టెక్కిస్తుందని!వారంతా ఏళ్ల తరబడి పాస్‌ కాలేక పరీక్షలు రాస్తూనే ఉన్న పట్టువదలని విక్రమార్కులు. అవకాశం ఉంటే మళ్లీ రాద్దామని రుసుములు చెల్లించారు. కరోనా కారణంగా ఎస్‌ఎస్‌సీ బోర్డుతో పాటు
  • ఆ కుటుంబం కన్నీళ్లు చూసే కదిలాంజవాన్‌ రాకేశ్వర్‌సింగ్‌ మన్హాస్‌ భార్య, కుమార్తె కన్నీళ్లు చూసే మావోయిస్టుల వద్దకు వెళ్లామని ‘పద్మశ్రీ’ ధర్మపాల్‌ సైనీ బృందంలో ముఖ్య పాత్ర పోషించిన తెలం బోరయ్య శుక్రవారం ‘ఈటీవీ
  • 13 నెలల్లో 10 లక్షల కిలోలుకరోనా సోకిన వారికి పరీక్షల సందర్భంగా, చికిత్స సమయంలో ఉత్పత్తి అయ్యే కొవిడ్‌ వ్యర్థాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గతేడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు
  • ఆర్టీసీ నెత్తిన భారీ నష్టం!తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయిలో నష్టాలను మూటగట్టుకుంది. ఫిబ్రవరి చివరి నాటికి రూ.2,272.59 కోట్లు నష్టం వచ్చింది. మార్చి నెలలో మరో రూ.200 నుంచి రూ.230 కోట్ల వరకు
  • పసిగట్టి.. ప్రాణాలు కాపాడతాయిఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌-సుకుమా జిల్లాల మధ్య తాజాగా జరిగిన మారణకాండలో 22 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం.. అత్యాధునిక సాంకేతికతో కూడిన మానవ రహిత గగన వాహనాల
  • పట్ట పగ్గాలు లేని కరోనాదేశంలో కరోనా మహమ్మారి పగ్గాల్లేకుండా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 1,31,968 మంది కరోనా బారిన పడ్డారు. 780 మంది ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌,
  • కొంటారా? కొనరా?మొక్కజొన్న(మక్క) సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మద్దతు ధరకు కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకూ అనుమతి ఇవ్వలేదు. మద్దతు ధరకు కొంటామని
  • చల్లుతున్నారా... కుమ్మరిస్తున్నారా?తెలంగాణ పంటభూముల్లో భాస్వరం పేరుకుపోతోంది. ఏ స్థాయిలో అంటే.. దేశంలోని ఏ రాష్ట్రంలో లేనంతగా పదకొండు జిల్లాల్లో అత్యధిక స్థాయిలో నిల్వ చేరింది. ప్రతి రెండేళ్లకోసారి
  • ప్రైవేటు టీచర్లకు సన్నబియ్యంకొలువులు పోయి రోడ్డున పడ్డ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఆర్థిక సాయం అందజేసేందుకు గత ఏడాది(2020) మార్చి వరకు పనిచేస్తూ ఉన్నవారిని ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకోనుంది. కరోనా కారణంగా
  • ప్రభుత్వ కొలువుల్లో పదిశాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ల అమలు ప్రక్రియ ప్రారంభమైంది. టీఎస్‌పీఎస్సీ ఇటీవల జారీ చేసిన వ్యవసాయ, వెటర్నరీ
  • పాత ధరలకే ఎరువులుఇప్పటి వరకు ఉన్న పాత ధరలకే రైతులకు ఎరువులు అందించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి మన్‌సుఖ్‌ ఎల్‌.మాండవ్య తెలిపారు. రైతుల
  • విదేశాలకు సిరిసిల్ల దుస్తులువస్త్ర రంగంలో పేరొందిన సిరిసిల్ల రెడీమేడ్‌ దుస్తుల తయారీ కేంద్రంగా మారనుంది. ప్రముఖ జౌళి సంస్థ గోకల్‌దాస్‌ ఇమేజెస్‌ సిరిసిల్ల జిల్లా పెద్దూరులో రెడీమేడ్‌ దుస్తుల తయారీ
  • లక్ష టీకాలు.. లక్ష పరీక్షలురాష్ట్రంలో ఒక్కరోజులోనే లక్షకు పైగా టీకాలు పంపిణీ జరగ్గా.. లక్షకు పైగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ రెండు అంశాల్లోనూ ఇంత భారీగా నిర్వహించడం ఇదే ప్రథమమని ప్రజారోగ్య
  • ఎవరేమన్నా.. ఈ గడ్డ బిడ్డనేసింహం ఒంటరిగానే వస్తుంది. మేం తెరాస చెబితే, భాజపా అడిగితే, కాంగ్రెస్‌ పంపితే రాలేదు. ఆ మూడు పార్టీలకు గురిపెట్టిన ప్రజాబాణమై వస్తున్నా. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నా.
  • ఎక్కడికక్కడే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలుకొవిడ్‌ నిర్ధారణలో ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో.. ఆ మేరకు వైద్యఆరోగ్యశాఖ ప్రణాళికలు రూపొందించింది. మారుమూల
  • కట్టలేనంత కష్టంసామాన్యులు, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను భవన నిర్మాణ సామగ్రి ధరలు చిదిమేస్తున్నాయి. ప్రతి రూపాయి కూడబెట్టి ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే ఖర్చు తడిసిమోపెడై పనులు మధ్యలో నిలిచిపోతున్నాయి. స్థానిక బిల్డర్లు ప్రారంభించిన

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఒక్కటే మాట.. బ్లాక్‌బస్టర్‌
  • రివ్యూ: వకీల్‌ సాబ్‌
  • అలీబాబా.. అరడజను కష్టాలు
  • మూడేళ్ల తర్వాత కూడా అదే పవర్‌ : చిరు
  • ఉద్వేగానికి లోనైన వేణు శ్రీరామ్‌
  • డెత్‌ స్పెషలిస్టు అతడే.. 20 పరుగుల లోటు
  • పవన్‌ అభిమాని తీరుపై అనసూయ అసంతృప్తి
  • దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి
  • పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు
  • విడాకులు తీసుకుంటే OCI హోదా ఉండదు!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.