☰
బుధవారం, ఏప్రిల్ 14, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 25/02/2021 11:42 IST
ప్రియురాలు.. ప్రియుడు.. ఓ బాధితుడు

మాయ మాటలతో వ్యాపారికి రూ.11 కోట్ల టోకరా

ఈనాడు, హైదరాబాద్‌/న్యూస్‌టుడే, నిజాంపేట: ఎన్నెన్నో మాయమాటలు.. రూ.11 కోట్ల మోసం.. ఇలాంటి సంఘటనలను సినిమాల్లోనే చూస్తుంటాం. అయ్యో.. ఇలా కూడా మోసపోయే వాళ్లుంటారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటాం. ఐపీఎస్‌కు ఎంపికయ్యానంటూ అతడు.. అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఛైర్‌పర్సన్‌ను అంటూ ఆమె అధికార దర్పంతో అందంగా అబద్ధమాడి ఓ వ్యాపారికి కుచ్చు టోపీ పెట్టారు. చేబదులంటూ కోట్లు కాజేశారు. ఖరీదైన కార్లలో షికారు చేశారు. విలువైన స్థలాలు కొనుగోలు చేసి.. విలాసాలతో తులతూగారు. చివరకు.. మోసం బయటపడటంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీసులు చాకచాక్యంగా వ్యవహరించి ప్రియురాలు సహా మరో నలుగురు కేటుగాళ్ల ఆట కట్టించారు. ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను బుధవారం మాదాపూర్‌ ఇన్‌ఛార్జి డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు మీడియాకు వెల్లడించారు.

శిరీష చదివింది పదోతరగతి..
కడప పట్టణానికి చెందిన ఉద్దానం శిరీష(39) పదో తరగతి చదివింది. బాల్య వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. పదేళ్ల కిందట ఆయనతో విడిపోయింది. సినిమాల్లో నటించాలనే ఆసక్తితో నగరానికొచ్చింది. స్మృతి సింహగా పేరు మార్చుకొని నటనలో శిక్షణ తీసుకొంది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో బోరబండలో సింహ సూపర్‌ మార్కెట్‌ను ప్రారంభించింది. వ్యాపార లావాదేవీల్లో సాఫ్ట్‌వేర్‌ నిపుణుడు, అవివాహితుడైన అంకిరెడ్డి విజయ్‌కుమార్‌రెడ్డి(41) పరిచయమయ్యాడు. ఇద్దరూ సహజీవనం చేశారు. వ్యాపారంలో నష్టాలు రావడంతో 2017 డిసెంబరులో బాచుపల్లిలోని ప్రణవ్‌ అంటిల్లాలోని విల్లాకు మకాం మార్చారు. పక్క విల్లాలో ఉండే క్రషర్‌ యజమాని పి.వీరారెడ్డి పరిచయం అయ్యాడు. డెహ్రాడూన్‌లో ఐపీఎస్‌ శిక్షణ పొందుతున్నానని, శిక్షణలో ఏర్పడిన గాయాల కారణంగా తాత్కాలికంగా ఇక్కడికి వచ్చానంటూ విజయ్‌కుమార్‌రెడ్డి పరిచయం చేసుకున్నాడు. 72 ట్రావెల్స్‌ బస్సులకు యజమానినని నమ్మించాడు. తన భార్య అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌ అని చెప్పాడు. సైరన్‌తో ఖరీదైన కార్లలో తిరుగుతుండటంతో బాధితుడు నిజమేనని భావించి వారితో మరింత సన్నిహితంగా మెలిగాడు.

చెల్లెలితో పెళ్లి చేయిస్తానంటూ...
విజయ్‌కుమార్‌రెడ్డి.. తండ్రి రాఘవరెడ్డిని సెంట్రల్‌ జోన్‌ డీసీపీగా వీరారెడ్డికి పరిచయం చేశాడు. విజయ్‌కుమార్‌ సమీప బంధువులు రణధీర్‌రెడ్డి, అభిలాష్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి కూడా జత కలిశారు. వీరంతా ముఠాగా ఏర్పడి వివిధ కారణాలు చెప్పి చేబదులుగా వీరారెడ్డి నుంచి రూ.11 కోట్లు తీసుకున్నారు. బాధితుడి సోదరుడికి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకొని స్మృతి సింహ మరో అడుగు ముందుకేసింది. తన సోదరినిచ్చి వివాహం చేస్తానంటూ నమ్మించింది. వేరే యువతి ఫొటోలను పంపించి, గొంతు మార్చి తానే బాధితుడి సోదరుడితో తరచూ మాట్లాడేది. వీరారెడ్డి తిరిగి డబ్బులివ్వమని అడిగితే కాబోయే బంధువులమే కదా అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఆయనకు అనుమానమొచ్చి ఆరా తీయగా ఈ కేటుగాళ్ల మోసం బయటపడింది. అప్పటి నుంచి డబ్బు చెల్లించాలంటూ విజయ్‌కుమార్‌పై ఒత్తిడి తెచ్చాడు. బండారం బయటపడటంతో ఆందోళనకు గురైన విజయ్‌ కుమార్‌ ఈ నెల 5న ప్రగతినగర్‌లోని ఇంట్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకొనే ముందు వీరారెడ్డిని మోసం చేసినట్లు సెల్ఫీ వీడియో తీసుకొని అందరికీ పంపించాడు. ఈ ఘటనతో అసలు విషయం వెలుగు చూసింది. ఆ మరుసటి రోజే వీరారెడ్డి ఫిర్యాదు చేయడంతో బాచుపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఖరీదైన 5 కార్లు(3 బీఎండబ్ల్యూ, 2 ఫోర్డు), రూ.50 లక్షల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలు, రూ.2 లక్షల నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 46 క్రెడిట్‌ కార్డులు, 7 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అభిలాష్‌రెడ్డి పరారీలో ఉన్నాడు.


మరిన్ని

  • ఐక్యంగా విజయం సాధిద్దాంకరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి మానవాళి సురక్షితంగా బయటపడాలంటే ప్రపంచ దేశాలన్నీ ఐక్యంగా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందని ప్రధాని మోదీ తెలిపారు. కలసికట్టుగా చర్యలు చేపట్టకపోతే
  • రికార్డుస్థాయికి విద్యుత్‌ వినియోగందేశవ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో విద్యుత్‌ వినియోగం రికార్డుస్థాయికి చేరింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 47% అధికంగా నమోదైంది. గత ఏడాది ఏప్రిల్‌ మొదటి వారంలో 19.33 బిలియన్‌ యూనిట్లు నమోదు కాగా..
  • భారీగా తగ్గిన వాహన విక్రయాలుకరోనాతో రాష్ట్రంలో వాహన రంగమూ డీలా పడింది. ఈ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాలూ కలిపి 7.78 లక్షల వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. రాష్ట్రంలో ఏటా వాహన విక్రయాలు 9 నుంచి 12 శాతం వరకు పెరుగుతుంటాయి.
  • ఆలయ భూములను కాపాడుకుంటాం‘దేవాదాయ శాఖ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. భూములు ఆక్రమణకు గురైన విషయం వాస్తవమే. ఆక్రమణలు ఇప్పటివి కాదు. కొన్నేళ్లుగా అన్యాక్రాంతం అయ్యాయి. ప్రస్తుతం వాటిని గుర్తించే పనిలో ఉన్నాం.
  • పునరుద్ధరించరు.. జీతాలివ్వరుతెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ) పరిధిలో ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేస్తున్న సుమారు 2,335 మంది వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది కొనసాగింపుపై నెలకొన్న సందిగ్ధం కొనసాగుతోంది.
  • రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు వస్తాంరాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలనపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాల మధ్య లేఖల యుద్ధం జరుగుతోంది. ఈ ఎత్తిపోతల పథకం పరిశీలనకు వస్తామని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఏపీ జలవనరుల శాఖకు
  • సమర్థ పాలన.. సమృద్ధిగా వర్షాలురాష్ట్రమంతటా ప్లవ నామ సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని, ధనధాన్యాలు, శుభ ఫలితాలు కలుగుతాయని, సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని సమర్థంగా పాలిస్తారని పంచాంగకర్త బాచంపల్లి సంతోష్‌ కుమార్‌ శాస్త్రి పేర్కొన్నారు.
  • పరీక్షలు, కేసుల్లో తగ్గుదలదేశంలో కరోనా కేసులు కాస్త నెమ్మదించాయి. ఆదివారం పరీక్షల సంఖ్య సాధారణ రోజులతో పోలిస్తే 16%మేర తగ్గడంతో ఆ తేడా మంగళవారం విడుదల చేసిన కేసుల్లోనూ కనిపించింది. ఆదివారం నాటి పరీక్షల ఫలితాలను
  • పీఆర్‌సీ అమలు కసరత్తు వేగవంతంరాష్ట్రంలో వేతన సవరణ ఒప్పందం అమలు మార్గదర్శకాలు తుదిరూపు దిద్దుకుంటున్నాయి. నాలుగైదు రోజుల్లో ఆర్థికశాఖ ఉత్తర్వులను జారీ చేయనుంది. సి.ఆర్‌.బిశ్వాల్‌ నేతృత్వంలోని వేతన సవరణ సంఘం సిఫారసుల
  • సరిహద్దు జిల్లాల్లో కరోనా పంజా!మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాల్లో కరోనా విజృంభిస్తోంది. ఆ రాష్ట్రాల నుంచి ప్రజల రాకపోకల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. గత ఏడు రోజుల్లో (6-12 వరకు) రాష్ట్రవ్యాప్తంగా 17,846 కొవిడ్‌ కేసులు నిర్ధారణ కాగా..
  • ఈ ఏడాది వర్షాలు బాగుఈ ఏడాది నైరుతి రుతు పవనాలపై ప్రముఖ ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ ‘స్కైమెట్‌’ శుభవార్త చెప్పింది. దేశంలో సాధారణ వర్షపాతం ఉంటుందని తెలిపింది. రుతుపవన కాలమైన జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య దీర్ఘకాలిక సగటు
  • జూన్‌లోగా దక్షిణ భాగానికి అనుమతి!తెలంగాణ రాష్ట్రానికి మణిహారం కానున్న ప్రాంతీయ రింగ్‌రోడ్డు దస్త్రం చకచకా కదులుతోంది. జూన్‌లోగా దక్షిణ భాగానికి కూడా భూసేకరణకు అనుమతి లభించనుంది. ఉత్తర భాగానికి చెందిన పూర్తిస్థాయి సవివర నివేదిక (డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు)
  • తాగితే ఒక ధర.. తూగితే ఒక ధరగ్లాసుల గలగలలు.. విదేశీ యువతుల నృత్యాలు.. ఏది కావాలంటే అది క్షణాల్లో సమకూర్చే వెసులుబాటు.. ఇవీ బెంగళూరులోని ‘మత్తు’ పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణ! అత్యంత విలాసవంతంగా సాగే ఈ పార్టీల కోసం తెలంగాణ నుంచి కొందరు ప్రముఖులు పరుగులు పెట్టేవారు.
  • జైల్లో తల్లులు.. పంజరంలో పిల్లలునేరస్థులైనా వారిదీ అమ్మమనసే. ఆవేశంలోనో.. తెలిసీ, తెలియకో చేసిన తప్పుల కారణంగా జైలు గూటికి చేరుతున్న ఎంతోమంది మహిళలు తమ బిడ్డలకు తల్లి ప్రేమను పంచలేకపోతున్నారు. ఇలాంటి తల్లుల వెంట ఉండే చిన్నారుల పరిస్థితి ఏమిటి?
  • పాత ముఖం.. కొత్త మకాంక్రికెట్‌ బెట్టింగ్‌ దందా రూపు మార్చుకుంటోంది. పందెపు రాయుళ్లు పోలీసులను ఏమార్చేందుకు కొత్త దారులు వెతుకుతున్నారు. నిఘా పెరగడంతో బెట్టింగ్‌ ముఠాలు కొత్త స్థావరాలను ఎంచుకుంటున్నాయి.
  • విదేశీ టీకాలకు పచ్చజెండాఒకవైపు కరోనా విజృంభణ.. మరోవైపు వ్యాక్సిన్లకు కొరత ఉన్న నేపథ్యంలో విదేశాల్లో అత్యవసర అనుమతులు పొందిన పలు టీకాలకు దేశంలో అత్యవసర వినియోగానికి అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • బుల్లితెర జలపాతంలో సుధీర్‌, రష్మి
  • మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం
  • ‘ప్రియుడి ఒత్తిడితోనే కుమార్తె ఆత్మహత్య’
  • ఇజ్రాయెల్..‌ అందుకో టీకా ఫలం‌!
  • మార్కెట్లలో జోష్‌ నింపిన కేంద్రం నిర్ణయం
  • పదేళ్లకే నాకు పెళ్లి చేశారు: నటి కృష్ణవేణి
  • సెకండ్‌ వేవ్‌.. చిత్రసీమపై కరోనా ప్రతాపం
  • గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!
  • ఐపీఎల్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌
  • రోహిత్‌ నమ్మాడు.. రాహులే వికెట్లు తీశాడు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.