దెందులూరు: అంతుచిక్కని వ్యాధి పశ్చిమగోదావరి జిల్లాను వెంటాడుతోంది. దెందులూరు మండలం కొత్తగూడెం శివారు కొమరేపల్లి గ్రామంలో అంతుచిక్కని కారణాలతో 21మంది అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి పలువురు మూర్చ, కళ్లు తిరిగి పడిపోతున్నారు. శుక్రవారం ఉదయం పెద్ద సంఖ్యలో పడిపోవడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి సునంద, ఇతర అధికారులు హుటాహుటిన గ్రామానికి తరలివచ్చారు. బాధితులను 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారుల ఆదేశాల మేరకు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ తిరిగి సర్వే చేపట్టారు.
ఇవీ చదవండి..
శివమొగ్గలో భారీ పేలుడు.. 8 మంది మృతి