☰
బుధవారం, ఏప్రిల్ 21, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 24/11/2020 21:02 IST
నివర్ అలెర్ట్‌: 30 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధం!

దిల్లీ: ‘నివర్‌’ అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్‌ అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 22 బృందాలను సిద్ధంగా ఉంచింది. ఈ మేరకు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌, వాతావరణ శాఖ డీజీ మృత్యుంజయ మహాపాత్ర సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. తుపాను గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డీజీ వెల్లడించారు. దీని ప్రభావం ఉండే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. భారత వాతావరణ శాఖ సూచనలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అవసరాలను బట్టి మొత్తం 22 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. వీటిలో 12 బృందాలు తమిళనాడు, మూడు బృందాలు పుదుచ్చేరి, ఏడు బృందాలను ఏపీలో ఇప్పటికే మోహరించామన్నారు. అదనపు అవసరాల కోసం మరో 8 బృందాలను అప్రమత్తం చేసినట్టు తెలిపారు. మొత్తంగా 30 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేశామన్నారు. ఈ‌ బృందాల వద్ద సహాయక చర్యలకు అవసరమైన పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా నేపథ్యంలో పీపీఈ కిట్లు కూడా ఉన్నట్టు చెప్పారు. 

జనానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ భరోసా

తుపాను ప్రభావం ఉంటుందని భావిస్తున్న అన్ని జిల్లాలు, స్థానిక అధికారులతో ఎన్డీఆర్‌ఎఫ్‌ చాలా దగ్గరగా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తోందని సంబంధిత‌ డీజీ ఎస్‌ఎన్‌ ప్రధాని వెల్లడించారు. తుపానులకు సంబంధించిన సమాచారంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. కరోనా నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్నీ వివరిస్తున్నామన్నారు. అలాగే, ఆయా ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు స్థానిక అధికారులకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహకరిస్తున్నారన్నారు. సమాజంలో భద్రతాభావాన్ని వ్యాప్తి చేస్తోందని, పరిస్థితులు సాధారణ స్థితికి చేరేదాకా ఈ బృందాలు తమకు అందుబాటులో ఉంటాయన్న భరోసాను కల్పిస్తున్నాయన్నారు. 

తమిళనాడులో రేపు సెలవు: సీఎం పళని

నివర్‌ తుపాను ప్రభావంతో చెన్నైలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపు తీరం దాటనున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ డీజీ డాక్టర్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఈ తీవ్రత మరీ అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న నివర్‌ తుపాను ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయం దిశగా 380 కి.మీలు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 480 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వివరించారు. మరో 12గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు చెప్పారు. బుధవారం సాయంత్రం పుదుచ్చేరి సమీపంలోని కరైకల్‌ - మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్నారు. తీవ్ర తుపాను నివర్‌ తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 120 కి.మీల వేగంతో ప్రచండగాలులు వీచే అవకాశం ఉన్నట్టు ఆయన హెచ్చరించారు. బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో తమిళనాడు సీఎం పళనిస్వామి రేపు రాష్ట్ర వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. 

ఇదీ చదవండి..

లైవ్‌.. నివర్‌ తుపాను ఎటు వెళ్తోంది?

Tags: NIVAR CycloneNDRFTamilnaduPuducherryAP

రాజకీయం

  • రాత్రి కర్ఫ్యూ కంటితుడుపు చర్య: భట్టి[01:43]
  • ఒకే దేశం.. ఒకటే ధర: కాంగ్రెస్‌[01:41]
  • ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదేం?[01:40]
  • దేవినేని ఇంటికి సీఐడీ అధికారులు[01:45]

జనరల్‌

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం[01:46]
  • టీకా తీసుకుంటే టమోటాలు ఫ్రీ..[01:42]
  • కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టమే..[01:41]
  • కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరు వేసుకోకూడదు?[01:39]
  • అగ్నిపర్వతం విస్ఫోటనం.. ప్రజలు విలవిల[00:23]
  • సాహో శిల్పా సాహు.. [01:44]

సినిమా

  • భారతీయులకు ప్రియాంక చోప్రా అభ్యర్థన[01:44]
  • పునర్నవి యోగా.. రకుల్‌ ట్రెక్కింగ్‌ కథలు[01:42]
  • ‘వకీల్‌సాబ్‌’పై జస్టిస్‌ గోపాలగౌడ ప్రశంసలు[01:41]
  • చిత్రసీమ ఎక్కడైనా ఒక్కటే: రష్మిక[01:39]
  • వారి మృతి నా హృదయాన్ని కలచివేసింది: చిరంజీవి[01:14]
  • సూరిబాబుగా సుధీర్‌[01:11]
  • ‘విక్రమ్‌’లో సేతుపతి?[01:12]
  • ఆ కోణంలో చూశారంటే...[01:13]
  • హాళ్లపై కరోనా హాలాహలం[01:17]

క్రైమ్

  • ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...[02:09]
  • Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌[01:39]
  • దంతెవాడ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం[01:41]

స్పోర్ట్స్

  • ధోనీ వారసుడిగా జడేజా..[01:42]
  • అజాగ్రత్త వద్దు మిత్రమా.. కరోనా కోరలు చాచింది  [01:40]
  • షాప్‌కీపర్ అవతారమెత్తిన సానియా కొడుకు[01:38]
  • MS Dhoni: ఎనిమిదేళ్ల నాటి ట్వీట్‌ వైరల్‌[01:43]

బిజినెస్

  • కొత్త రుణగ్రహీతలకూ క్రెడిట్‌ స్కోరు[01:56]
  • ఉత్పత్తి తాత్కాలికంగా నిలిపివేత: హీరో మోటో[01:55]
  • +529 నుంచి -244కు[01:53]
  • సాంకేతికతతో రోజుకు కోటి మందికి టీకా[01:49]
  • స్పుత్నిక్‌ వి ధర రూ.750?[01:43]
  • ఐఎస్‌బీ దేశంలోనే నెం.1[01:32]
  • కొవాగ్జిన్‌ ఉత్పత్తి పెంచుతాం[01:28]
  • కొవిడ్‌ ప్రభావిత రాష్ట్రాలకు రోజుకు 700 టన్నుల ఆక్సిజన్‌[01:16]
  • మున్ముందూ ఆన్‌లైన్‌ ఆర్డర్లలో వృద్ధి[01:09]
  • మధ్యవర్తిత్వం కోసం భారత కంపెనీలు బయటకెళ్లొచ్చు[01:05]
  • అత్యవసర నిధి ఎంతుండాలి?[00:57]
  • ఫండ్ల సంఖ్యను తగ్గించుకోవాలంటే..[00:55]
  • వార్షిక ఆదాయమే..కీల‌కం[12:42]
  • రుణ దర‌ఖాస్తు రిజ‌క్ట్ కాకుడ‌దంటే..  [15:36]

జాతీయ-అంతర్జాతీయ

  • భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం[01:42]
  • అమెరికాలో 16దాటిన వారికి టీకా..![01:40]
  • Walk test.. ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండి![01:37]
  • మహారాష్ట్రలో ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌?[01:43]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరు వేసుకోకూడదు?
  • భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం
  • Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌
  • సాహో శిల్పా సాహు.. 
  • Curfew: తెలంగాణలో రోడ్లు నిర్మానుష్యం
  • Walk test.. ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండి!
  • పునర్నవి యోగా.. రకుల్‌ ట్రెక్కింగ్‌ కథలు
  • Lockdown ఆఖరి అస్త్రం కావాలి: మోదీ 
  • మహారాష్ట్రలో ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌?
  • కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టమే..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.