☰
శనివారం, ఫిబ్రవరి 27, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

Updated : 14/01/2021 05:47 IST
మళ్లీ మూలాల్లోకి!

 గానుగ నూనె.. దంపుడు బియ్యం.. మట్టి ముంతలు 

 ఇళ్లలో రాగి, ఇత్తడి పాత్రల వాడకం
భోజనాల్లోకి కొర్రన్నం.. జొన్నలు.. రాగి సంకటి
 నాటి జీవన సంస్కృతికి పెరుగుతున్న ఆదరణ

ఈనాడు - హైదరాబాద్‌, అమరావతి

గాడిపొయ్యి మీద ఇత్తడి కళాయి పెట్టి, అందులో దంపుడు బియ్యంతో అన్నం వండి వడ్డిస్తే... గానుగ నూనెలో వేయించిన గారెలు తింటే... మట్టి ముంతల్లో పాలు కాచి తాగుతుంటే..

ఆహా... అద్భుతః

ఎప్పుడో 40-50 ఏళ్ల నాటి ఈ సంప్రదాయాలన్నీ ఇప్పుడు మళ్లీ మన మనసులను దోచుకుంటున్నాయి. ఇదంతా పాత మీద మోజు కాదు. పల్లెల్లో, పట్టణాల్లో కూడా ఇప్పుడు.. పాత అలవాట్లలోని మంచిని ఎంచుకుని, ఆధునిక జీవనశైలిగా మార్చుకునే ధోరణి పెరుగుతుండటం విశేషం. మన అలవాట్లు స్వచ్ఛంగా, ఆహార పదార్థాలు నాణ్యంగా ఉంటేనే చక్కటి ఆరోగ్యం సొంతమవుతుందనే భావన పెరగడంతో గానుగ నూనెలకు, మట్టి ముంతలకు, రాగి, ఇత్తడి పాత్రలకు, పప్పు విసురుకునే తిరగళ్లకు గిరాకీ ఎక్కువైంది. మారుతున్న ప్రజల జీవన సరళికి ఇది అద్దం పడుతోంది.

పల్లెలు.. పట్టణాలు.. నగరాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలకు ఆరోగ్యంపై జాగ్రత్త పెరుగుతోంది. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిని మార్చుకుంటున్నారు. రోజూ వాడే బియ్యం నుంచి వడ్డించుకునే కంచాల వరకూ.. అన్నింట్లోనూ పద్ధతులు పాటిస్తున్నారు. బియ్యం వాడకంలోనూ మార్పులొచ్చాయి. ఆరోగ్యస్పృహ పెరుగుతున్నకొద్దీ ముడి బియ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నవార, బహురూపి, నారాయణ కామిని, రత్నచోడి, గని, పులాసర్‌.. తదితర రకాలను వాడుతున్నారు. వీటిలో కొన్ని ముడి బియ్యంగా.. మరికొన్ని సింగిల్‌ పాలిష్‌గా వినియోగిస్తున్నారు. బియ్యం ఆడేందుకు చిన్న యంత్రాలూ వస్తున్నాయి. వీటిని ఇళ్ల వద్దకే తెచ్చి ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఇస్తున్నారు. కాళ్లతో తొక్కితే.. దంపుడు బియ్యం వచ్చే పరికరాలూ ఉన్నాయి.

 

నాటు కోడికి గిరాకీ

గతంలో ఇంటింటా నాటుకోళ్లు ఉండేవి. పండగొచ్చినా, చుట్టాలొచ్చినా.. ఆ రోజు వాటిలో ఒకటి కూరగా మారేది. ఇప్పుడు మళ్లీ కోడికూతలు వినిపిస్తున్నాయి. నాటుకోళ్ల పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. రుచి కారణంగా వీటి మాంసం కిలో రూ.450-500 వరకూ పలుకుతోంది. గుడ్డు రూ.10పైనే అమ్ముతున్నారు.


గానుగ నూనెకు డిమాండ్‌

మార్కెట్లో దొరికే రిఫైన్డ్‌ నూనెల వినియోగంపై నెలకొన్న రకరకాల వాదనల నేపథ్యంలో క్రమేపీ అందరి దృష్టీ గానుగ నూనెల వాడకంపైకి మళ్లుతోంది. మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ కొత్త గానుగలు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటికి సగటున యూనిట్‌ వ్యయం రూ.10లక్షల నుంచి రూ.25 లక్షల వరకు అవుతోంది. గానుగల వద్ద పల్లీ నూనెతోపాటు కొబ్బరి, పొద్దుతిరుగుడు, ఆవ, నువ్వులు, నువ్వుపప్పు నూనెలు తీస్తున్నారు. ఇంట్లో నూనె తయారీకి గ్రైండర్‌ పరిమాణంలో ఉండే యంత్రాలు (కోల్డ్‌ ప్రెస్‌ ఆయిల్‌ ఎక్స్‌ట్రాక్టర్‌) వచ్చాయి. వీటి ధర రూ.16వేల నుంచి రూ.25వేల మధ్య ఉంటోంది. గంటకు 4-8 కిలోల గింజలు ఆడతాయి.


  కొర్రన్నం.. రాగి సంకటి..

జొన్నన్నం, రాగి సంకటి, కొర్రన్నం.. 50ఏళ్ల కిందట ప్రధాన ఆహారం ఇదే. తెల్ల బియ్యం రాకతో కనుమరుగైన ఈ చిరు ధాన్యాలు ఇప్పుడు మళ్లీ విరివిగా వినియోగంలోకి వస్తున్నాయి. బియ్యం బదులు ఒక పూట చిరుధాన్యాల భోజనంపై ఆసక్తి కనబరుస్తున్నారు. జొన్న, సజ్జ, రాగి తదితర చిరుధాన్యాల అటుకులకూ, వీటితో చేసే చిరుతిండ్లకూ డిమాండు పెరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో వీటి సాగు విస్తీర్ణం పెరుగుతోంది.


  మిద్దె పంటలు

కూరగాయలు పండించేటప్పుడు వాటిపై రకరకాల పురుగుమందులు చల్లడం, త్వరగా పెరిగేందుకు కృత్రిమ రసాయనాల వాడకం గురించి రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో సొంతంగా పంటలు పండించుకుని వాడుకోవాలన్న ఆలోచన నుంచి మొదలైనవే మిద్దె పంటలు. ఎవరింట్లో వారే కూరగాయలు పండించటానికి ఆసక్తి కనబురుస్తున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పాదులు.. ఇలా అన్నింటినీ మిద్దెమీదే సాగు చేస్తున్నారు. నాలుగైదు అడుగుల ఎత్తులోనే పండ్లనిచ్చే మామిడి, బత్తాయి, నిమ్మ తదితర రకాలూ వచ్చాయి.


  దేశవాళీ ఆవు పాలు లీటరు రూ.100

దేశవాళీ ఆవు నెయ్యి కిలో రూ.4,800 వరకు పలుకుతోంది. వీటిలో ఒంగోలు, గిర్‌ ఆవుల నెయ్యి వినియోగం ఎక్కువగా ఉంది. కిలో నెయ్యి తయారీకి 30 లీటర్ల వరకు పాలు అవసరమని రైతులు వివరిస్తున్నారు. ఆయుర్వేద ఉత్పత్తుల తయారీలోనూ ఈ రకం నెయ్యినే వాడుతున్నారు.విజయవాడలోని ఒక సేంద్రియ ఉత్పత్తుల దుకాణంలో.. కాచిన ఆవు పాలు గ్లాసు రూ.20. వీటిని తాగేవారిలో యువతే ఎక్కువ. పల్లెల్లోనూ లీటరు రూ.100 వరకు పలుకుతున్నాయి.  


స్టీలు ప్లేట్లు, గ్లాసులతో బంతి భోజనాలు

బంతి భోజనాల్లో కొంతకాలంగా ప్లాస్టిక్‌ స్థానంలో పేపర్‌ వినియోగిస్తున్నారు. కానీ ఏవైనా ఒకసారి వాడి పారేసే వాటివల్ల కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోతోంది. దీంతో.. ఇటీవలి కాలంలో చాలామంది మళ్లీ స్టీలు కంచాలు, గ్లాసుల వాడకంవైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న ఫంక్షన్ల నుంచి పెళ్లిళ్ల వరకూ అన్నిచోట్లా స్టీలు కంచాల్లో వడ్డించడం మొదలవుతోంది. పెరుగుతున్న పర్యావరణ స్పృహే దీనికి కారణం. ఖర్చు కాస్త ఎక్కువైనా అతిథులకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఇలా చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. బంతి భోజనం అంటే ఒకప్పుడు పులిహోర తప్పనిసరి. తర్వాత ఆ స్థానాన్ని వెజ్‌ బిర్యానీ ఆక్రమించింది. సగ్గుబియ్యం పాయసం, పులిహోర మళ్లీ నోరూరిస్తున్నాయి. కొందరు కొర్ర, అంటుకొర్ర అన్నం, పాయసం చేసి మరీ వడ్డిస్తున్నారు.


  ఇసుర్రాయి మళ్లీ వచ్చింది

పల్లెల్లోనే కాదు.. మహానగర లోగిళ్లలోకీ మళ్లీ ఇసుర్రాళ్లు అడుగు పెడుతున్నాయి. బయట కొంటున్న పప్పుల్లో వేర్వేరు పదార్థాలు కలుస్తున్నాయని, అందువల్ల గింజలు కొనుక్కుని తామే ఇంట్లో విసురుకుంటే నాణ్యమైన పప్పులు వస్తాయని గృహిణులు నమ్ముతున్నారు. అందుకే ఇసుర్రాళ్లు తెచ్చుకుంటున్నారు. సెనగలు, మినుములు, పెసలను విసురుకోవడం మళ్లీ ఓ ట్రెండులా మారుతోంది.
* గతంలో కందులు నానబెట్టి, పూర్తిగా ఎండిన తర్వాత మంగళం (రంధ్రంతో కూడిన కుండ)లో వేయించి ఇసుర్రాయిపై పప్పు విసిరేవారు. వీటికి మంచి రుచి, వాసన ఉంటాయి. రాను రాను మిల్లుల్లో తయారైన కందిపప్పు వినియోగం పెరిగింది. రైతులూ కందుల్ని మిల్లులో ఇచ్చి పప్పు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ తిరగళ్లలో పప్పు విసురుకునే విధానం మొదలైంది. రోట్లో రుబ్బిన పిండి బాగా ఒదుగు అవ్వడంతో పాటు.. ఆహార పదార్థాలు మెత్తగా, రుచిగా ఉంటున్నాయని మహిళలూ వీటిపై ఆసక్తి కనబరుస్తున్నారు.


   సమస్తం.. సేంద్రియం

రసాయన మందులు వాడకుండా పండించే కూరగాయలు, ఆకుకూరలు, ఆహార ధాన్యాల వాడకమూ పెరిగింది. జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్య ఆధారిత ఉత్పత్తులనే పంటలకు పిచికారీ చేస్తున్నారు. వినియోగదారులు పొలాల వద్దకే వెళ్లి సాగు విధానం చూసి కొంటున్నారు. సాధారణ ఉత్పత్తులతో పోలిస్తే వీటి ధరలు 30-50% వరకు అదనం. సేంద్రియ పదార్థాలకు ఆదరణను దృష్టిలో ఉంచుకుని ప్రధాన నగరాల్లో పేరున్న సంస్థలూ ఈ తరహా ఉత్పత్తుల తయారీలోకి అడుగు పెడుతున్నాయి.


రాగి చెంబులు, ఇత్తడి పాత్రలు.. మట్టి పిడతలు

నిజానికి అల్యూమినియం పాత్రల కంటే.. మట్టి పిడతల ధరలు ఎక్కువ. అయినా వాటిని అమెజాన్‌లోనూ ఆర్డర్‌ పెట్టి ఆన్‌లైన్లో తెప్పించుకుంటున్నారు. ఇవి రూ. 50-500 వరకు ఉంటున్నాయి. కొన్ని రకాల పాత్రలైతే రూ.1,500 వరకు ఉన్నాయి. అన్నం వండటానికి, పాలు కాచేందుకు మట్టిపాత్రలు వాడుతున్నారు. హోటళ్లలో మంచినీళ్లకూ ఎర్రమట్టి గ్లాసుల్నే వినియోగిస్తున్నారు. మట్టి పాత్రలతో కళాయిలూ అందుబాటులోకి వచ్చాయి. రోజువారీ వినియోగానికి ఉపయోగపడే పాత్రలన్నీ కలిపితే రూ.2వేల వరకు అవుతాయని అంచనా.
* రాగి పాత్రల్లో నిల్వ చేసిన నీటిని తాగడం ఆరోగ్యకరమని పరిశోధనల్లోనూ రుజువు కావడంతో.. వీటినే ఉపయోగిస్తున్నారు. రాగి బాటిల్‌్్స, రాగి కూజాలూ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. శుభకార్యాల్లోనూ రాగి గ్లాసులను బహుమతులుగా అందిస్తున్నారు.
* ఒకప్పుడు వంటకు ఇత్తడి పాత్రలనే ఉపయోగించేవారు. ధర తక్కువ కావడం, బరువు లేకపోవడంతో తర్వాత అల్యూమినియం పాత్రల వాడకం పెరిగింది. అయితే వీటిలో వంట చేయడం వల్ల ఆల్జిమర్స్‌ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని పరుశోధనలు చెబుతుండటంతో.. కొన్ని కుటుంబాలు మళ్లీ ఇత్తడి పాత్రల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. అన్నం, పాలు, ఇతర ఆహార పదార్థాలకు కావల్సిన పాత్రలకు రూ.3వేలకు పైగానే అవుతుంది. చెక్క గరిటెల వినియోగమూ పెరిగింది.


గానుగ నూనెలు ఉత్తమం

మార్కెట్‌లో దొరికే వివిధ రకాల రిఫైన్డ్‌ వంట నూనెల్లో బీటీ పత్తి గింజల నూనె, పెట్రోలియం జెల్లీతో పాటు వేర్వేరు ఉత్పత్తులు కలుపుతున్నారు. పలు రకాల అనారోగ్యాలకు ఇవి కారణమవుతున్నాయి. ప్రజల్లో అవగాహన పెరగడంతో గానుగ నూనెలపై దృష్టి పెడుతున్నారు. మేం పదేళ్ల కిందటే కృష్ణాజిల్లా తరకటూరులో ఎద్దుల గానుగ ఏర్పాటుచేశాం. కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నూనె తయారీ యంత్రాన్ని అందుబాటులోకి తెస్తున్నాం. లీటరు రూ.250 చొప్పున వస్తుంది. గానుగ నూనె ఎంతో శ్రేష్ఠమైంది. పప్పు (పొట్టు తీసిన నువ్వులతో) నూనె, కొబ్బరి, కుసుమ నూనె కూడా మంచివే.

విజయ్‌రామ్‌, ప్రకృతి వ్యవసాయ నిపుణులు


గానుగ నూనెల వాడకం పెరిగింది

తాడేపల్లి మండలం పెనుమాకలో మేం యూనిట్‌ పెట్టి ఏడాదిన్నర అవుతోంది. గతంతో పోలిస్తే గానుగ నూనెల వాడకం పెరిగింది. కల్తీ లేకుండా స్వచ్ఛమైన నూనె పట్టించుకోవచ్చనే అవగాహన ఏర్పడింది. కొంతమంది దగ్గరుండి నూనె తీయించుకుంటున్నారు. ఎక్కువ మంది వేరుసెనగ నూనెకు ప్రాధాన్యం ఇస్తున్నారు. తర్వాత పప్పునూనె, కొబ్బరినూనె అడుగుతుంటారు.

వీరారెడ్డి, నవీన్‌రెడ్డి, గానుగ నిర్వాహకులు


పిండి వంటలకూ ఇదే

మొన్నీ మధ్యే మా అన్నయ్య వాళ్లు గానుగ నూనె తెచ్చారు. బాగుందని చెప్పడంతో మేమూ కొంటున్నాం. మంచి వాసన, వంటలు రుచిగా ఉంటున్నాయి. అరిసెలు వండటానికి ఇదే తీసుకెళ్దామని వచ్చా.

సవరం వీరయ్య, ఐనవోలు, గుంటూరు జిల్లా


 

Tags:

మరిన్ని

  • 5 అసెంబ్లీల ఎన్నికలు గెలుపు గుర్రాలేవో! [27-02-2021] సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. పేరుకు నాలుగు రాష్ట్రాలు...
  • డబ్బుకొద్దీ గౌరవం [27-02-2021] హైదరాబాద్‌లో డబ్బులు తీసుకుని సన్మానాలు చేసే సంస్థలు కొన్ని ఉండేవి. ఈ వ్యవహారంపై ఎన్నో జోకులు, కార్టూన్లు.. కథలు. ఇప్పుడు మరికొన్ని సంస్థలు ఒక అడుగు ముందుకేసి నకిలీ డాక్టరేట్లు, అంతర్జాతీయ రికార్డుల్ని కూడా అమ్మకానికి పెట్టాయి. వీరు డబ్బులిస్తే చాలు.. ఏదో ఒక రికార్డు పేరుతో సర్టిఫికేట్‌ చేతిలో పెడతారు
  • అజాగ్రత్తే కొంప ముంచుతోంది! [25-02-2021] తగ్గినట్లే తగ్గిన కొవిడ్‌ మళ్లీ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
  • ఎయిడెడ్‌! [24-02-2021] రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థల వ్యవస్థ కనుమరుగు కానుంది. ప్రస్తుతం ఎయిడెడ్‌లో కొనసాగుతున్న వాటిని ప్రైవేటుగా నిర్వహించుకోవడం..
  • ఇక నాది అంగారకుడి టైమ్‌! [20-02-2021] అంతరిక్షంలో కోట్లాది కిలోమీటర్ల అవతల.. మానవాళి చూడలేని కొత్త ప్రపంచం.. ఎత్తుపల్లాలు, రాళ్లురప్పలు, ఇసుక దిబ్బలు.. ఎక్కడ ఏమున్నాయో తెలియదు. అడుగడుగునా సవాళ్లు.. ఏ మాత్రం తేడా వచ్చినా మొరాయించే పరికరాలు.. సమాచార ప్రసారంలో జాప్యాలు.. ఇలాంటి ప్రతికూల పరిస్థితులన్నింటినీ అలవోకగా చెక్కుచెదరని
  • భారత్‌ తయారీ టీకాలపై అపోహలొద్దు [19-02-2021] ‘‘ఏ దేశంలో తయారైన టీకాకైనా కొన్ని పరిమితులుంటాయి. కేవలం భారత్‌ ఉత్పత్తులకు మాత్రమే అది పరిమితమన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. భారత్‌లో తయారైనంతమాత్రాన ఇక్కడి టీకాల సమర్థతను తక్కువగా చూడడం, అనవసర అపోహలు పెంచుకోవడం అవివేకమే.
  • కాల్వల్లో కన్నీటి వరద.. [17-02-2021] నిజామాబాద్‌-జగిత్యాల జాతీయ రహదారిపై తాటిపల్లి వద్ద కాకతీయ కాల్వ వంతెన తీరు ఇది. రక్షణ గోడలు శిథిలమయ్యాయి. నామమాత్రంగా సిమెంటు ఇటుకలతో మరమ్మతులు చేసి చేతులు
  • వ్యవసాయానికి ఐటీ [16-02-2021] ‘ఆధునిక పరిజ్ఞానాన్ని రైతులకు, పొలానికి చేర్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘అగ్రి హబ్‌’ ఏర్పాటుచేశాం. కొత్త ఆలోచనలతో
  • అనితర సేద్యులు! [15-02-2021] ఉన్నదే ఒకట్రెండు ఎకరాలు. అందులో సేద్యం చేసి బతికేదెలా? అందుకే పొలాన్ని  కౌలుకిచ్చా. చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నగరాల్లో సెక్యూరిటీ గార్డులు, సేల్స్‌మెన్‌, వాచ్‌మెన్‌గా పనిచేస్తూ ఉపాధి పొందుతున్న
  • నెత్తురోడ్డుతోంది   [14-02-2021] హైదరాబాద్‌ నుంచి కర్ణాటకలోని గుల్బర్గా, బీజాపూర్‌తోపాటు తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాకు వెళ్లేందుకు 163 నంబరు జాతీయ రహదారి కీలకం. చిలుకూరు బాలాజీ ఆలయం, అనంతగిరి వంటి పర్యాటక ప్రాంతాలకూ అనుసంధానమిదే. ఇదే మార్గంలో ఇంజినీరింగ్‌,
  • హక్కు వదలని విక్రమార్కులు [13-02-2021] హైదరాబాద్‌కు చెందిన కొల్లా కోటేశ్వరరావు తన ప్యాంటు, అతని భార్య చీరను లాండ్రీస్పాలో డ్రైక్లీనింగ్‌కు ఇచ్చారు. మూడు రోజుల్లో ఉతికి ఇస్తామని చెప్పిన సిబ్బంది ఆ వ్యవధిని పొడిగిస్తూ వచ్చారు. కొన్ని రోజుల తరవాత దుస్తులు సిద్ధమయ్యాయని చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అక్కడ రంగు వెలిసిన చీరను చూసి షాక్‌కు గురైన
  • వ్యవసాయంతో నష్టమే! [12-02-2021] సాగువ్యయం ఆకాశాన్నంటుతోంది. రోజురోజుకు పెట్టుబడి ఖర్చు పెరుగుతూపోతోంది. ఈ పరిస్థితుల్లో రైతులకు గిట్టుబాటు దక్కడం అటుంచి, నష్టాలే మిగులుతున్నాయని వ్యవసాయశాఖ లెక్కలే
  • ఆలీబాబా.. 5,000 మంది దొంగలు! [08-02-2021] రాజస్థాన్‌ రాష్ట్రంలోని భరత్‌పూర్‌ జిల్లాలో 100కుపైగా గ్రామాలు, హరియాణా సరిహద్దులోని అల్వార్‌, మేవాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధుర జిల్లాలోని పలు గ్రామాల్లో దొంగలు నివాసముంటున్నారు. మేవాత్‌ తెగకు చెందిన వీరంతా
  • పంటల బోర్డులు రద్దేనా? [06-02-2021] తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఉన్నత స్థాయిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న పలు రకాల పంటల బోర్డులను
  • ఉద్యమాల ఉక్కుకు... ఇప్పుడెవరయ్యా దిక్కు? [05-02-2021] విశాఖ ఉక్కు... ఆంధ్రుల హక్కు... అంటూ నలుదిక్కులూ పిక్కటిల్లేలా ఒక్కపెట్టున సాగిన ఉద్యమం... పోరుబాట పరిణామాల్లో ఏకంగా 32 మంది చేసిన ప్రాణత్యాగాలు... విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని తెలుగు నేలకు అందించాయి. ఇప్పుడు 18 వేల మంది శాశ్వత ఉద్యోగులు,
  • కట్టేది ఎక్కువ.. కట్టేవారు తక్కువ.. [30-01-2021] బడ్జెట్‌ అంటే- ప్రభుత్వ వార్షిక జమాఖర్చుల పత్రమే! కానీ...బడ్జెట్‌ వస్తోందనగానే వేతన జీవులు, వ్యాపారుల్లో ఒకింత ఉత్కంఠ, ఉద్వేగం!
  • ఆలోచన.. అంకురం.. ఆదాయం [30-01-2021] ఈశాన్య భారతదేశంలోని అడవుల్లో వెదురు చెట్లు పుష్కలం. వాటి నుంచి తీసే ద్రవంతో సువాసనలు...
  • అనగనగా ఒక ఆర్థిక సింహం [29-01-2021] ఆ దేశంలో నేసిన వస్త్రాలు.. తయారైన లోహ పరికరాలు... సుగంధ ద్రవ్యాలు.. జిగేల్‌మనే వజ్రాలు... అక్కడ అందంగా మలచిన అలంకార వస్తువులు... మట్టి పాత్రలు ప్రపంచాన్ని వెర్రెత్తించాయి. ఆ దేశ నౌకలు సముద్రాలను శాసించాయి. ప్రపంచ ఆర్థిక రంగాన్ని శతాబ్దాలపాటు తమ వెంట తిరిగేలా చేశాయి.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
  • ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది! 
  • అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
  • గ్లామర్‌ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
  • వనస్థలిపురంలో కారు బీభత్సం
  • థ్యాంక్స్‌ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
  • తరగతి గదిలో ఉపాధ్యాయురాలిపై చాకుతో భర్త దాడి
  • దిగ్గజ పథంలో..
  • టీమ్‌ఇండియా ఇలా చేయదు కదా..! 
  • ‘మొతేరా’ విజయ రహస్యం చెప్పిన అజ్జూభాయ్‌!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.