☰
బుధవారం, ఏప్రిల్ 14, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 07/03/2021 13:01 IST
తెదేపా కార్యకర్త అరెస్టు

సీఎంకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారన్న ఫిర్యాదుపై చర్య

చిలకలూరిపేట పట్టణం, గ్రామీణ, న్యూస్‌టుడే: సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే తెదేపా కార్యకర్త పిల్లి కోటిని శుక్రవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలోని పరిణామాల నేపథ్యంలో.. ప్రతిపక్ష నేతను అడ్డుకున్న పులివెందుల ఎలుక పిల్ల జగన్‌రెడ్డి అంటూ ఫేస్‌బుక్‌లో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన పిల్లి కోటి ఇటీవల పోస్టు చేశారు. దీనిపై చిలకలూరిపేట వైకాపా సోషల్‌మీడియా ప్రతినిధి దొడ్డా రాకేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అర్బన్‌ సీఐ బిలాలుద్దీన్‌, పట్టణ ఎస్సై షఫీల ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు కోటి ఇంటికెళ్లి ఆయన్ను స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి తెదేపా అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, యువత నాయకుడు వంశీకృష్ణ, లీగల్‌సెల్‌ న్యాయవాది హరిబాబు బృందం, కార్యకర్తలు చిలకలూరిపేట అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. పోలీసు చర్యలకు నిరసనగా తెదేపా కార్యకర్తలు స్టేషన్‌ మెట్లపై కూర్చున్నారు. సమాచారం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో వెంటనే పిల్లి కోటికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. అనంతరం పిల్లి కోటి విలేకరులతో మాట్లాడారు. తన భార్య నిండు గర్భిణి అని ప్రాధేయపడినా స్థానిక ఎమ్మెల్యే సూచనల మేరకు అర్ధరాత్రి తనను పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చి మానసికంగా వేధించారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరవయిందని విమర్శించారు. రాజకీయాలు ఎందుకంటూ సీఐ హెచ్చరించారని, తన ప్రాణానికి హాని కలిగితే సీఐ, ఎస్సైలే కారణమని అన్నారు.


Tags:

మరిన్ని

  • అప్పుడు.. ఇప్పుడు.. దక్కని కడసారి చూపు కరోనా మహమ్మారి అయినవారి మధ్య కడసారి చూపునూ దూరంచేస్తోంది. ఇంజినీర్‌గా సౌదీఅరేబియాలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తల్లి ఏడాది క్రితం మరణించగా అంత్యక్రియలకు ఆయన స్వదేశానికి రాలేకపోయారు. ఇప్పుడు సౌదీలో
  • రూ.3.31 కోట్ల ఖరీదైన గంజాయి పట్టివేత చింతూరు అటవీప్రాంతం నుంచి హైదరాబాదుకు భారీస్థాయిలో తరలిస్తున్న గంజాయిని చుంచుపల్లి పోలీసులు పట్టుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ చుంచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు.
  • మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం మూఢవిశ్వాసంతో మిత్రురాలిని పెళ్లాడిన ఓ వివాహిత... ఆమెతో కలిసి తన ఇద్దరు కుమారులను చిత్రహింసలకు గురిచేసింది. పిల్లలకు నిత్యం నరకం చూపింది. భర్త సాయంతో వారిని అత్యంత పాశవికంగా బలిచ్చేందుకు యత్నించింది.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • బుల్లితెర జలపాతంలో సుధీర్‌, రష్మి
  • మూఢ విశ్వాసంతో కన్నబిడ్డలనే కడతేర్చే యత్నం
  • ‘ప్రియుడి ఒత్తిడితోనే కుమార్తె ఆత్మహత్య’
  • ఇజ్రాయెల్..‌ అందుకో టీకా ఫలం‌!
  • మార్కెట్లలో జోష్‌ నింపిన కేంద్రం నిర్ణయం
  • పదేళ్లకే నాకు పెళ్లి చేశారు: నటి కృష్ణవేణి
  • సెకండ్‌ వేవ్‌.. చిత్రసీమపై కరోనా ప్రతాపం
  • గుట్టలుగా మృతదేహాలు.. ఖాళీలేని శ్మశానాలు!
  • ఐపీఎల్‌ నుంచి స్టోక్స్‌ ఔట్‌
  • రోహిత్‌ నమ్మాడు.. రాహులే వికెట్లు తీశాడు
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.