☰
గురువారం, ఏప్రిల్ 22, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 03/03/2021 05:00 IST
పళ్లు ఊడగొట్టిన వైకాపా కార్యకర్తలు

అభ్యర్థిని ప్రతిపాదించానని దాడి

న్యూస్‌టుడే, తిరుపతి (నేరవిభాగం): తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్‌ వేసిన వ్యక్తికి ప్రతిపాదించానన్న అక్కసుతో తనపై వైకాపా కార్యకర్తలు దాడి చేసి.. పళ్లు ఊడగొట్టారని తిరుపతికి చెందిన తెదేపా కార్యకర్త గోళ్ల లోకేష్‌నాయుడు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి కార్పొరేషన్‌లోని ఆరు డివిజన్లలో నామినేషన్లను స్వీకరించాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఇందులో భాగంగా తిరుపతిలోని 45వ డివిజన్‌ నుంచి చంద్రమోహన్‌ అనే వ్యక్తి తెదేపా తరఫున నామినేషన్‌ దాఖలు చేయగా, ఆయన అభ్యర్థిత్వాన్ని లోకేష్‌నాయుడు ప్రతిపాదించారు. ఉదయం వార్డు కార్యాలయానికి వచ్చినప్పటి నుంచే అక్కడే ఉన్న 47వ వార్డు టౌన్‌ప్లానింగ్‌ కార్యదర్శి సురేంద్ర.. తనపై ఒత్తిడి తెచ్చినట్లు లోకేష్‌నాయుడు చెబుతున్నారు. అయినా చంద్రమోహన్‌ నామినేషన్‌ దాఖలు చేయగా తాను ప్రతిపాదిస్తూ సంతకం చేశానన్నారు. సాయంత్రం చంద్రమోహన్‌ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. రాత్రి 10 గంటల సమయంలో ప్రకాశం పార్కు పక్కనే ఉన్న తన దుకాణాన్ని వైకాపా కార్యకర్తలు ధ్వంసం చేశారని, తాను పారిపోయేందుకు ప్రయత్నించినా వదల్లేదని లోకేష్‌నాయుడు విలేకర్లకు చెప్పారు. తనపై దాడి చేయడంతో రెండు పళ్లు ఊడిపోయాయని చూపించారు. భయంతో పరుగున అలిపిరి పోలీసుస్టేషన్‌కు వెళ్లగా ఆయన ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. దాడి ఘటన తెలుసుకున్న తెదేపా నాయకులు పోలీసుస్టేషన్‌కు వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కాగా 47వ వార్డు టౌన్‌ ప్లానింగ్‌ కార్యదర్శి సురేంద్ర తప్పిపోయినట్లు ఆయన కుటుంబసభ్యులు అలిపిరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Tags:

మరిన్ని

  • 30 వేల కట్నం కోసం.. ముగ్గురి ప్రాణాలు బలి ఓ కుటుంబంలో కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు, మరో ఇంట్లో మనస్పర్థలు.. ఈ కారణాలతో ఇద్దరు తల్లులు, ముగ్గురు బోసినవ్వుల చిన్నారుల ప్రాణాలు గంగలో కలిసిపోయాయి. ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా.. మరో మహిళ తన రెండేళ్ల కుమార్తెతో సహా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో దూకి ప్రాణాలు విడిచింది. శ్రీరామనవమి పండుగ రోజు ఈ ఘటనలు ఆయా గ్రామాల్లో తీరని విషాదం నింపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
  • బొల్లినేని శ్రీనివాసగాంధీకి రిమాండ్‌ హైదరాబాద్‌ జీఎస్టీ పూర్వ సూపరింటెండెంట్‌ బొల్లినేని శ్రీనివాసగాంధీకి సీబీఐ న్యాయస్థానం వచ్చే నెల 7వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది.
  • మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావుపై సీబీఐ కేసు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)ను మోసగించారనే ఫిర్యాదుపై గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకటరావు,....
  • నకిలీ పాస్‌పుస్తకాలతో రుణాలు ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ అధికారులతో కొందరు కుమ్మక్కై నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది జిల్లా సహకార సంఘాల ద్వారా....
  • రూ.వెయ్యి కోట్ల కొకైన్‌ స్వాధీనం తమిళనాడు తూత్తుకుడి పోర్టుకు వచ్చిన ఓ నౌకలోని కంటైనర్‌లో 400 కిలోల కొకైన్‌ ఉండటాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ).....
  • వివాహానికి తీసుకెళ్లలేదని? మెదక్‌ జిల్లా పాపన్నపేట్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన పావని(28)కి నిర్మల్‌ జిల్లా సోన్‌ మండలం లెఫ్ట్‌ పోచంపాడ్‌కు చెందిన సిద్దురాములుకు....

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ‘వీరూ భాయ్‌.. నా జీతం పెంచండి’
  • ‘మా అమ్మను కౌగిలించుకోవాలని ఉంది’
  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు: సుప్రీం
  • కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతి
  • Corona: ఆక్సిజన్‌ అందక భార్య ఒడిలోనే..
  • 18 ఏళ్లు పైబడినవారికి.. 28 నుంచి రిజిస్ట్రేషన్‌
  • ఒంటిని పట్టి... మనసును మెలిపెట్టి!
  • ఆ నిర్ణయం బాధాకరం: ఈటల
  • పెళ్లి చూపులకు వెళ్లొస్తూ పరలోకాలకు..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.