☰
బుధవారం, ఏప్రిల్ 21, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 07/03/2021 08:21 IST
నిర్బంధం.. ఆపై అత్యాచారం

15 రోజులుగా పనిమనిషిపై యజమాని పైశాచికం

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌: ఇంట్లో పనులు చేసేందుకు వచ్చిన ఓ మహిళను నిర్బంధించడమే కాకుండా ఆమెపై ఇంటి యజమాని అత్యాచారం చేశాడు. పదిహేనురోజుల తర్వాత బాధిత మహిళ కుమార్తె సమాచారంతో బందీగా ఉన్న ఆమెను బంజారాహిల్స్‌ పోలీసులు రక్షించారు. పరారీలో ఉన్న దుర్మార్గుడి కోసం గాలిస్తున్నామని ఎస్సై వాసవి శనివారం తెలిపారు.

రాజమహేంద్రవరం ప్రాంత మహిళ(45)కు 2002లో వివాహం జరిగింది. పెళ్లైన ఏడాదికే భర్త వదిలిపెట్టడంతో విడిగా ఉంటోంది. ప్రస్తుతం ఆమె కుమార్తె హైదరాబాద్‌లో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు తీరకపోవడంతో ఇళ్లల్లో పనులు చేస్తానంటూ ఆమె స్నేహితురాలు ధనలక్ష్మికి చెప్పింది. ధనలక్ష్మి రవీందర్‌ అనే వ్యక్తిని పరిచయం చేసింది. సరేనన్న రవీందర్‌.. హైదరాబాద్‌లో వంటపని, ఇంటిపని కోసం పిలిచారని, మంచి జీతం ఇస్తారని వివరించారు. ఆమె అంగీకరించడంతో ఫిబ్రవరి 17న రాజమహేంద్రవరం నుంచి రైలులో హైదరాబాద్‌కు బయలు దేరింది. అదేరోజు ఫిలింనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని 19వ అంతస్తులోని ఫ్లాట్‌ నంబరు 1905లో ఉదయభాను నివాసానికి చేరుకుంది.

రెండోరోజే బలాత్కారం..: తొలుత సాదరంగా ఆహ్వానించిన ఉదయభాను తనకు చిత్రపరిశ్రమకు చెందిన వారితో సంబంధాలున్నాయని, గుత్తేదారుగా పనిచేస్తున్నానని చెప్పాడు. తన ఇంట్లోనే ఒక చిన్న గదిని ఆమెకు కేటాయించాడు. ఇక రెండోరోజే ఉదయభాను ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. కొట్టాడు. రాత్రి ఆమెపై లైంగికదాడి చేశాడు. ఈవిషయం ఎవరికీ చెప్పకుండా ఆమె వద్ద ఉన్న చరవాణిని లాక్కున్నాడు. ఇంట్లో పనులు చేయించుకుని బయటకు వెళ్లేప్పుడు ఆమెను గదిలో నిర్బంధించేవాడు. ఇలా రోజూ విపరీతంగా కొట్టి అత్యాచారం చేసేవాడు. ఎలాగైనా చెర నుంచి తప్పించుకోవాలనుకున్న ఆమె ఉదయభానుకు తెలియకుండా శుక్రవారం రాత్రి తన చరవాణిని తీసుకుంది. శనివారం ఉదయం పదిగంటలైనా ఉదయభాను రాకపోవడంతో వెంటనే తన కుమార్తెకు ఫోన్‌ చేసింది. అప్రమత్తమైన బాధిత మహిళ కూతురు చరవాణి సిగ్నల్స్‌ ఆధారంగా గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోల్కొండ పోలీసులు బంజారాహిల్స్‌ ఠాణాకు విషయాన్ని వివరించగా.. ఎస్సై వాసవి, ఎస్సై రాంబాబు తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకొన్నారు. 19వ అంతస్తుకు వెళ్లిన వారు తాళం వేసి ఉండటంతో ఉదయభానుకు ఫోన్‌ చేశారు. అతని ఫోన్‌ అందుబాటులో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. సికింద్రాబాద్‌లో ఉండే అతడి కుటుంబ సభ్యులు ఇంటి తాళం తీసుకొని రావడంతో మహిళను రక్షించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఉదయభానుపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడిపై గతంలోనూ కేసులున్నాయని వివరించారు.

Tags:

మరిన్ని

  • ప్రేమించిన వ్యక్తితో కూతురు వెళ్లిపోయిందని...[02:09]
  • Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌[01:39]
  • దంతెవాడ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు హతం[01:41]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • కరోనా వ్యాక్సిన్‌ ఎవరెవరు వేసుకోకూడదు?
  • భారత ఔషధ అవసరాలను అర్థం చేసుకున్నాం
  • Tiktok స్టార్‌ భార్గవ్‌ చిప్పాడ అరెస్ట్‌
  • సాహో శిల్పా సాహు.. 
  • Curfew: తెలంగాణలో రోడ్లు నిర్మానుష్యం
  • Walk test.. ఆక్సిజన్‌ స్థాయి తెలుసుకోండి!
  • పునర్నవి యోగా.. రకుల్‌ ట్రెక్కింగ్‌ కథలు
  • Lockdown ఆఖరి అస్త్రం కావాలి: మోదీ 
  • మహారాష్ట్రలో ఇక పూర్తిస్థాయి లాక్‌డౌన్‌?
  • కాశీలో అంత్యక్రియల నిర్వహణ కష్టమే..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.