☰
ఆదివారం, మార్చి 07, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 22/01/2021 07:57 IST
ఆటో ప్రయాణికుల ముసుగులో చోరీలు

ముగ్గురు ముఠా అరెస్టు


నిందితుల వివరాలు తెలుపుతున్న డీఎస్పీ ప్రశాంతి

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ఆటోల్లో ప్రయాణికుల ముసుగులో చోరీలు చేసే ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ వలయ విభాగ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను తెలిపారు. మేడికొండూరుకు చెందిన పి.సదాశివరావు గత డిసెంబర్‌ 30న తన బంగారు వస్తువులు పాలడుగులోని బ్యాంకులో తనఖా పెట్టడానికి బయలుదేరారు. మేడికొండూరు సెంటర్‌లో ఆటో ఎక్కాడు. అప్పటికే అందులో కొందరు ప్రయాణికుల వలే ఉన్నారు. ఆటో కొంతదూరం వెళ్లగానే ఆటోడ్రైవర్‌ తాము పాలడుగు వైపు వెళ్లడంలేదని దింపేసి వెళ్లిపోయారు. ఆటో దిగిన సదాశివరావు తన జేబులో చూడగా బంగారపు వస్తువులు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ పర్యవేక్షణలో మేడికొండూరు పోలీసులు, నేరవిభాగ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిఘానేత్రాల్లో లభించిన ఆధారాలతో విచారిస్తే పాతనేరస్థుల పనిగా తేలింది. గుంటూరు నగరంపాలెంకు చెందిన దర్శనపు చరణ్‌, ఫిరంగిపురంనకు చెందిన ప్రస్తుతం పాతగుంటూరులో ఉంటున్న పసుపులేటి మేరి, గుంటూరు అంకిరెడ్డిపాలెంకు చెందిన మల్లెల శౌరమ్మలు నిందితులుగా తేలడంతో వారిని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద బంగారపు వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను నవంబర్‌లో లాలాపేట పోలీసులు అరెస్టు చేయగా బెయిల్‌పై వచ్చి మళ్లీ నేరాలకు పాల్పడ్డారని చెప్పారు. సీఐ ఆనందరావు, ఎస్‌ఐలు నరహరి, కోటేశ్వరరావు, సిబ్బంది నజీర్‌, శ్రీలక్ష్మి, ప్రశాంత్‌రెడ్డి, కృష్ణా, జాన్‌సైదా, శ్రీకాంత్‌లను డీఎస్పీ అభినందించారు.

Tags:

మరిన్ని

  • కాణిపాకం వెళ్తూ ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల మృతి[17:10]
  • మహమూద్‌ అలీ మనవడిపై ర్యాగింగ్‌ కేసు[13:08]
  • జంగారెడ్డిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం[10:49]
  • నిర్బంధం.. ఆపై అత్యాచారం[07:46]
  • నా కుమారుడికి తండ్రి పేరేం చెప్పను..?[01:35]
  • డబ్బులేక, ఆస్పత్రి ముందే చిన్నారి మృతి[01:29]
  • విశాఖలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి [01:21]
  • తోడబుట్టిన వారినే తెగనరికాడు[10:27]
  • ఆ ఐదుగురిది ఆత్మహత్యా.. హత్యా?[09:30]
  • టీవీ కోసం బయల్దేరి.. ప్రాణాలు విడిచి[08:14]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
  • ఆఫర్‌ కోసం చిరు, పవన్‌లకు కాల్‌ చేశా: కోట
  • ఆ సినిమా ఫ్లాప్‌..నితిన్‌కి ముందే తెలుసు
  • బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
  • రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ ట్వీట్‌
  • నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్‌ ఛైర్మన్‌ మృతి
  • వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
  • ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
  • అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
  • వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.