☰
శుక్రవారం, జనవరి 22, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Updated : 26/11/2020 06:51 IST
నిద్రిస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి అఘాయిత్యం

కాకినాడలో దారుణం
సకాలంలో వైద్యం అందించలేదని బంధువుల ఆరోపణ

కాకినాడ (మసీదు సెంటర్‌), న్యూస్‌టుడే: ఇంట్లో నిద్రిస్తున్న ఐదేళ్ల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి అపహరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో బుధవారం ఈ దారుణ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన బాలిక తల్లి ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌ వెళ్లగా అమ్మమ్మ, తాతయ్య, తండ్రితో కలిసి ఉంటోంది. చిన్నారి తన అమ్మమ్మ వద్ద నిద్రిస్తుండగా కామాంధుడు అర్ధరాత్రి సమయంలో ఎత్తుకెళ్లాడు. అరవకుండా ఉండేందుకు దారి పొడవునా కొడుతూ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. దుస్తుల్లేకుండా శరీరమంతా తీవ్రగాయాలతో ఉన్న బాలికను సమీపంలో పడేయగా.. వేకువజామున 4.30 గంటల సమయంలో అటుగా వెళ్తున్న వ్యక్తి గుర్తించాడు. అప్పటికే బాలిక కనిపించడం లేదని వెతుకుతున్న ఆమె అమ్మమ్మకు చిన్నారిని అప్పగించాడు. కుటుంబసభ్యులు చిన్నారిని వెంటనే కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి బాలికను పరామర్శించారు. నిందితుడిని వీలైనంత త్వరగా అరెస్టు చేస్తామని, అందుకు మూడు బృందాలు ఏర్పాటుచేశామని తెలిపారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకొస్తే మెడికో లీగల్‌ కేసు (ఎంఎల్‌సీ) తీసుకురావాలని వైద్యం ఆలస్యం చేశారని..ఉదయం 10 గంటలకు సీఐ రామ్మోహన్‌ చొరవతో చికిత్స ప్రారంభించారని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ రాఘవేంద్రరావును వివరణ కోరగా..ఆ సమయంలో పిల్లల వైద్యుడు, మత్తు డాక్టర్‌ వేరే శస్త్రచికిత్సలో ఉండటంతో కొంత జాప్యం జరిగిందనీ.. వెంటనే వైద్యసేవలు అందించామని తెలిపారు.

Tags:

మరిన్ని

  • బాగ్దాద్‌లో ఆత్మాహుతి దాడులు: 28 మంది మృతి[01:53]
  • అఖిల బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా[01:50]
  • నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి[01:47]
  • ‘సీరమ్‌’ అగ్నిప్రమాదంలో ఐదుగురి మృతి  [01:41]
  • శివమొగ్గలో భారీ పేలుడు: పలువురు మృతి?[01:30]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ట్రంప్‌ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
  • రాధికా ఆంటీ.. నా సీక్రెట్స్‌ బయటపెట్టేస్తుంది..!
  • సిడ్నీ టెస్టు కాగానే ద్రవిడ్‌ సందేశం పంపించారు
  • నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి
  • ట్రంప్‌కు టిమ్‌ కుక్‌ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా..?
  • మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి​​​​​​​
  • స్వాగతం అదిరేలా..
  • ఎవరూ దొరక్కపోతే స్మిత్‌కే సారథ్యం!
  • డీఎం సాబ్‌.. నేను తేజస్వి మాట్లాడుతున్నా.. 
  • ఆర్సీబీ నిర్ణయంపై పార్థివ్‌ పటేల్‌ జోక్..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.