☰
శనివారం, జనవరి 16, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 23/11/2020 08:02 IST
అమ్మానాన్నా... నన్ను క్షమించండి

అన్నకి సందేశం పంపి యువకుడి అదృశ్యం


మోహిత్‌కుమార్‌

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ‘నేను అనుకున్న లక్ష్యాన్ని చేరలేననే భయం నన్ను వెంటాడుతోంది... తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగుల్చుతున్నా..’అంటూ తన అన్నయ్య చరవాణికి మెసేజ్‌ పంపిన ఆ విద్యార్థి అదృశ్యమయ్యాడు. పాయకరావుపేట మండలం రత్నాయంపేట తీరప్రాంతంలో తన ద్విచక్రవాహనాన్ని వదిలేశాడు. దీంతో తల్లిదండ్రులతోపాటు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. కుటుంబ సభ్యులు, ఎస్‌ఐ దీనబంధు కథనం ప్రకారం...

తూర్పుగోదావరి జిల్లా తునిలోని గరువువీధికి చెందిన కె.మోహిత్‌కుమార్‌ (20) రాజమహేంద్రవరం సమీపంలోని రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ మెడికల్‌ కళాశాలలో ఫిజియోథెరపీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల నుంచి బైకుపై శనివారం రాత్రి తుని వచ్చాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. ఇంట్లో వారికి తెలియకుండా గ్రిల్స్‌లోంచి బ్యాగు, ఇతర వస్తువులు లోపల వేశాడు. ఆ తర్వాత ద్విచక్రవాహనం తీసుకుని బయటకు వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 సమయంలో అతని అన్నయ్య ఆదర్శకుమార్‌ చరవాణికి మోహిత్‌కుమార్‌ సంక్షిప్త సమాచారం పంపాడు. తల్లిదండ్రులు ఆశించిన స్థాయిలో తాను చదవలేకపోతున్నాని, ద్విచక్రవాహనం పాల్మన్‌పేట తీరప్రాంతంలో ఉంచానని అందులో పేర్కొన్నాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు తీరప్రాంతానికి చేరుకున్నారు. రత్నాయంపేట సముద్రపు ఒడ్డున ఉన్న జెట్టీ పక్కన బైకు గుర్తించారు. యువకుడి ఆచూకీ కానరాలేదు. ఆ ప్రాంతమంతా గాలించారు. ఈవిషయాన్ని ఆదర్శకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దీనబంధు చెప్పారు.

ఎవరితో కలవలేక పోతున్నా...

‘అమ్మ, నాన్న కష్టపడి చదివిస్తున్నారు.. బాగా చూసుకుంటున్నారు..అడిగినవన్నీ కొనిస్తున్నారు.. కానీ నేను ఎవరితోనూ కలవలేకపోతున్నా. నన్ను క్షమించండి. ఒంటరిగా ఇబ్బంది పడుతున్నాను. నా ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోలేను. నాకు ఇష్టమైన ప్రదేశంలో నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను’ అంటూ తన ఆవేదనను ఆ సంక్షిప్త సందేశంలో పొందుపర్చాడు. కొవిడ్‌ కారణంగా మోహిత్‌కుమార్‌ ఇన్నాళ్లు ఇంటి వద్దే ఉన్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో చదువుకోవడానికి వీలుగా ఉంటుందని నాగులచవితికి ముందు రోజు వసతిగృహంలో ఉండేందుకు వెళ్లాడు. శనివారం సాయంత్రం వరకు అందరితోనూ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత బైకుపై తుని వచ్చినట్లు తెలిసింది. యువకుడు ఏమయ్యాడనే దానిపై సందిగ్ధం నెలకొంది. పెంటకోట మెరైన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం సముద్రంలో గాలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:

మరిన్ని

  • వికారాబాద్‌లో తూటా కలకలం[15:08]
  • చెట్టును ఢీకొన్న కారు: ఒకరి మృతి[10:40]
  • సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ [09:59]
  • కడప యురేనియం పరిశ్రమలో అగ్ని ప్రమాదం[00:46]
  • దా‘రుణ’ యాప్‌ల కేసులో మరిన్ని ఆధారాలు[00:36]
  • హనుమాన్‌ జంక్షన్ వద్ద లారీ బీభత్సం[00:29]
  • ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్‌ బైకర్‌ మృతి[00:24]
  • ప్రేయసిని చంపి.. గోడలో దాచి..[14:08]
  • నగదు కోసం భార్యను హతమార్చాడు[09:26]
  • అఖిలప్రియ కేసులో దర్యాప్తు ముమ్మరం[00:50]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
  • ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
  • క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
  • కన్నీటి పర్యంతమైన మోదీ
  • రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే
  • పశ్చాత్తాపం లేదు.. అలానే ఆడతా: రోహిత్‌
  • సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 
  • చరిత్ర సృష్టించిన నయా యార్కర్‌ కింగ్‌
  • కంగారూను పట్టలేక..
  • ప్రధాని సూచన మేరకే ఆ నిర్ణయం: కేటీఆర్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.