☰
ఆదివారం, మార్చి 07, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

తాజా వార్తలు

Published : 22/01/2021 01:47 IST
నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: 9 మంది మృతి

పెద్ద అడిశర్లపల్లి: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో.. బొలేరో వాహనాన్ని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. ఆటో డ్రైవర్‌తో పాటు మరో ఎనిమిది మంది మృతిచెందారు. ప్రమాద స్థలిలో ఆరుగురు, హైదరాబాద్‌, దేవరకొండలో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మరో 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.  

 మృతులను చెన్నంపేట మండలంలోని సుద్దబావితండాకు చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కూలీలు వరినాట్ల కోసం రంగారెడ్డిగూడెం వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 21 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలాన్ని దేవరకొండ డీఎస్పీ ఆనంద్‌రెడ్డి పరిశీలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మృతిచెందిన వారి వివరాలు

1.ఆటో డ్రైవర్‌ మల్లేశ్‌
2. డ్రైవర్‌ తల్లి పెద్దమ్మ
3. డ్రైవర్‌ భార్య చంద్రకళ
4. గొడుగు లింగమ్మ
5. నోముల సైదమ్మ
6. అంజమ్మ
7. ఇద్దమ్మ
8. నోములు అలివేలు
9.కొట్టం పెద్దమ్మ

కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రోడ్డు ప్రమాదం పట్ల గవర్నర్‌ దిగ్భ్రాంతి..
రోడ్డు ప్రమాద ఘటన పట్ల గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. 

 

 

ఇవీ చదవండి..

‘సీరమ్‌’ అగ్నిప్రమాదంలో ఐదుగురి మృతి 

మద్యం మత్తులో నగ్నంగా చిందేసిన యువతి



Tags: Telangana Crime Newsతెలంగాణ క్రైమ్‌ న్యూస్‌Road Accidentరోడ్డు ప్రమాదంNalgondaనల్గొండ

మరిన్ని

  • మహమూద్‌ అలీ మనవడిపై ర్యాగింగ్‌ కేసు[13:08]
  • జంగారెడ్డిగూడెంలో ఘోర రోడ్డు ప్రమాదం[10:49]
  • నిర్బంధం.. ఆపై అత్యాచారం[07:46]
  • నా కుమారుడికి తండ్రి పేరేం చెప్పను..?[01:35]
  • డబ్బులేక, ఆస్పత్రి ముందే చిన్నారి మృతి[01:29]
  • విశాఖలో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మృతి [01:21]
  • తోడబుట్టిన వారినే తెగనరికాడు[10:27]
  • ఆ ఐదుగురిది ఆత్మహత్యా.. హత్యా?[09:30]
  • టీవీ కోసం బయల్దేరి.. ప్రాణాలు విడిచి[08:14]

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • పిచ్చి..పిచ్చి రాతలు రాయకండి: అషూరెడ్డి
  • ఆఫర్‌ కోసం చిరు, పవన్‌లకు కాల్‌ చేశా: కోట
  • ఆ సినిమా ఫ్లాప్‌..నితిన్‌కి ముందే తెలుసు
  • బుమ్రాతో పెళ్లిపై అనుపమ కుటుంబ సభ్యుల క్లారిటీ
  • నాలుగో అంతస్తు నుంచి పడి ముత్తూట్‌ ఛైర్మన్‌ మృతి
  • వాళ్లను కొట్టి.. వాళ్లింటికి
  • ఫొటోలో చూసినట్లు వరుడు లేడని పెళ్లికి నిరాకరణ
  • అంబానీ గ్యారేజ్‌లో చేరిన కొత్త కారిదే..!
  • రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ ట్వీట్‌
  • వారసత్వం వదిలి వెళ్లాలనే: యాష్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.