హైదరాబాద్: మాంచి కిక్ ఇచ్చే గేమ్ షోతో ఎంతో మంది నటీనటులు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. సాయికుమార్ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న గేమ్ షో ‘వావ్-3’. తమ కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న చంటి,వేణు,మనాలి,సౌమ్య తాజాగా ఈ గేమ్ షోలో పాల్గొన్నారు. అంతేకాకుండా వారు తమ పంచులతో ఎంతగానో అలరించనున్నారు. షో లో భాగంగా సాయికుమార్ ఎప్పటిలానే తన పంచులతో నవ్వులు పూయించారు.
షోలో భాగంగా చంటి, వేణు తాము ఎదుర్కొన్న కష్టాలను వెల్లడించారు. అలాగే ఇండస్ట్రీకి రాకముందు ‘మిరపకాయలు అమ్మేవాడిని’. ఓ రకంగా ఇండస్ట్రీకి రావాలన్న కోరిక పుట్టడానికి కారణం ఈ కూరగాయల మార్కెట్ స్ఫూర్తిదాయకం’ అంటూ వేణు తన జీవిత విశేషాలను చెప్పనున్నారు. ఎంతో జోష్ఫుల్గా సాగుతోన్న ‘వావ్-3’ ఎపిసోడ్లోని ఓ రౌండ్లో ‘మానవ శరీరంలో మరణించే వరకు ఎదుగుదల ఆగని అవయవాలు ఏవి?’, ‘ప్రపంచంలో చేతితో రాసి ప్రచురితమవుతున్న ఏకైక దినపత్రిక ఏది?’ అని సాయికుమార్ ప్రశ్నించగా.. దానికి సమాధానం చెప్పలేక సదరు నటీనటులు కంగారు పడ్డారు. అదే విధంగా ‘సీతను అపహరించి రావణుడు లంకలో ఏ వనంలో ఉంచాడు’ అని ఆయన ప్రశ్నించగా.. దానికి ఓ నటి సమాధానం చెప్పలేకపోవటంతో .. సరదాగా పంచులతో నవ్వుల వర్షం కురిపించనున్నారు. మంగళవారం (డిసెంబర్ 1) రాత్రి ప్రసారం కానున్న ‘వావ్-3’ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమోను చూసేయండి.