☰
శనివారం, ఫిబ్రవరి 27, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 22/01/2021 03:45 IST
బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో పార్టీ!

ముద్రగడ మద్దతు కోరిన బీసీ సంఘాల నేతలు

కిర్లంపూడి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీలు పెట్టే పార్టీకి మద్దతునిచ్చి అండగా నిలవాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను బీసీ సంఘాల నాయకులు కోరారు. రాష్ట్రంలో 52 శాతంగా ఉన్న బీసీలు, 35 శాతం పైబడి ఉన్న కాపులు కలిసి ముందుకు నడిస్తే రాష్ట్రంలో రాజ్యాధికారం సాధ్యమని ఈ సందర్భంగా ఆ సంఘాల నాయకులు పేర్కొన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశిన శంకర్రావు, 13 జిల్లాల బీసీ సంఘాల నాయకులు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో గురువారం ముద్రగడను కలిశారు. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆయన నివాసానికి చేరుకుని సాయంత్రం 6.30 వరకూ ఆయనతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ముద్రగడ స్పందిస్తూ.. పార్టీ పెట్టే యోచన ఉంటే ముందుగా అన్ని జిల్లాల్లోని బీసీ కులాలతో సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేసి వారి ఆలోచన ఎలా ఉంది..?  ఎంత వరకు కలిసి వస్తారు..? తదితర విషయాలను తెలుసుకోవాలని సూచించినట్లు సంఘం నాయకులు చెప్పారు. సమావేశం అనంతరం కేశిన శంకర్రావు విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో రాజకీయ మేధోమథన రాజకీయ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా 13 జిల్లాల బీసీ సంఘాల నాయకులతో ముద్రగడను కలిసినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల కలయిక రాష్ట్రంలో ప్రస్తుతం ఎంతో అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో మాతో కలిసి నడుస్తానని ముద్రగడ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కమ్మర క్రాంతి కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాదే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పార్టీ పెడతామని ప్రకటించారు. బీసీ 96 సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాళ్ల సత్యనారాయణ, జంగమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారుతి నాగలింగం, వివిధ జిల్లాల నుంచి వచ్చిన బీసీ సంఘాల నాయకులు గురసా రంగనాథ్‌, వర్తనపల్లి కాశీ, కాకు మల్లికార్జునరావు, మట్టపర్తి సూర్యచంద్ర, కొల్లికొండ సుబ్రమణ్యం, పెంటకోట శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

  • బీసీ కుల గణనపై కేంద్రానికి సుప్రీం నోటీసులుబీసీ కులాల వారీగా జన గణన అంశంపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021 జనాభా లెక్కల్లో వెనుకబడిన తరగతుల్లో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని తెలంగాణకు చెందిన సామాజిక
  • గండేపల్లి సొసైటీలో రుణాల మంజూరుపై నివేదికివ్వండితూర్పుగోదావరి జిల్లా గండేపల్లి సొసైటీలో 61 మంది తొండంగి రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి, నకిలీ పాస్‌ పుస్తకాలు సృష్టించి రూ.11 కోట్ల రుణాల మంజూరుకు సంబంధించిన అంశంపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని
  • రవాణా బంద్‌తో నిలిచిన భారీ వాహనాలుదేశ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన రవాణా బంద్‌ కారణంగా భారీ లారీలు, రవాణా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. లారీలు, ట్యాక్సీలు, మినీ లారీ, టోకు వ్యాపారులు, ముఠా కార్మిక సంఘాలు బంద్‌లో
  • అవాస్తవాలను ప్రచారం చేస్తే క్రిమినల్‌ కేసులుకరోనా కారణంగా మార్చి 1 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. శుక్రవారం కడపలో
  • రూ.7 కోట్ల విరాళంతో కాణిపాకం ఆలయ పునర్నిర్మాణంచిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా రూపొందించిన బృహత్తర ప్రణాళిక(మాస్టర్‌ప్లాన్‌) అమలుకు పెద్దపీట వేస్తున్నామని, ఓ దాత ఇచ్చే రూ.7కోట్ల విరాళంతో
  • అమరావతిని చిన్న చూపు చూస్తే వదిలిపెట్టంరాజధాని అమరావతి భావితరాల ఆస్తి.. దాన్ని చిన్నచూపు చూస్తే వదిలిపెట్టబోమని సినీ నటుడు శివాజీ హెచ్చరించారు. రాజధాని రైతుల హక్కును హరించే అధికారం ప్రధాని మోదీ, సీఎం జగన్‌, ప్రతిపక్షనేత చంద్రబాబు
  • ఎస్‌ఈసీ ‘ఈ-వాచ్‌’ యాప్‌పై విచారణ వాయిదారాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) తీసుకొచ్చిన ‘ఈ-వాచ్‌’ యాప్‌పై ఏపీ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌(ఏపీటీఎస్‌) లేవనెత్తిన మరికొన్ని ప్రశ్నలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానం రావాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది(జీపీ)
  • పోలవరం స్పిల్‌వేపై బ్రిడ్జి నిర్మాణం పూర్తిపోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేపై బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తి చేసినట్లు మేఘా సంస్థ ఇంజినీర్లు శుక్రవారం ప్రకటించారు. స్పిల్‌వే మొత్తం పొడవు 1128 మీటర్లు కాగా..ఇటీవల గడ్డర్ల అమరిక పూర్తి చేశామన్నారు.
  • కాళేశ్వరంలో నేడు తిరుమలేశుడి చక్ర స్నానంతిరుమల తిరుపతి దేవస్థానం తలపెట్టిన మాఘమాస మహోత్సవంలో భాగంగా తొలిసారిగా తెలంగాణలో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో శనివారం మాఘ పూర్ణిమ పుణ్య స్నాన కార్యక్రమం జరగనుంది.
  • ఎన్నికల సన్నద్ధతపై నేటి నుంచి ప్రాంతీయ సమావేశాలుపుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధత, నిర్వహణ, తదితర అంశాలపై అధికారులతో చర్చించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం శనివారం నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో ప్రాంతీయ సమావేశాలు
  • శ్రీవారికి రూ.10 కోట్ల విరాళంతిరుమల శ్రీవారికి దిల్లీకి చెందిన పాస్కో ఆటోమొబైల్స్‌ అధినేత సంజయ్‌ పస్సి, శాలిని పస్సి దంపతులు రూ.10 కోట్లు విరాళంగా అందించారు. శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం...
  • క్రీడలతో మానసిక ఉల్లాసం: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిక్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు చక్కటి ఆరోగ్యం లభిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి అన్నారు. కృష్ణా జిల్లా మూలపాడు క్రికెట్‌ మైదానంలో రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణ భారత న్యాయవాదుల...
  • 5న రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయండివిశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయనున్నట్టు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక స్పష్టం చేసింది. ఆంధ్రుల పోరాటాలతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను అమ్మే
  • ఆర్జేడీపై సస్పెన్షన్‌ ఎత్తివేతస్త్రీ, శిశు సంక్షేమ శాఖలో ఏలూరు ప్రాంతీయ సంయుక్త సంచాలకులుగా పనిచేసిన టీవీ శ్రీనివాసుపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులనిచ్చింది. ఆయన్ను రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్‌ కార్యదర్శిగా
  • తిరుమల ఘాట్‌ రోడ్డు టోల్‌ ధరల పెంపుఅలిపిరి నుంచి తిరుమలకు వచ్చే వాహనాలకు వసూలు చేసే టోల్‌ రుసుములు పెరిగాయి. ఈ టోల్‌ రుసుములు పెంచాలంటూ గత ఏడాది ఫిబ్రవరి 29న తితిదే ధర్మకర్తల మండలి తీర్మానించింది.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
  • ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది! 
  • అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
  • గ్లామర్‌ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
  • వనస్థలిపురంలో కారు బీభత్సం
  • థ్యాంక్స్‌ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
  • తరగతి గదిలో ఉపాధ్యాయురాలిపై చాకుతో భర్త దాడి
  • టీమ్‌ఇండియా ఇలా చేయదు కదా..! 
  • దిగ్గజ పథంలో..
  • కిమ్‌ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు 
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.