☰
శనివారం, ఫిబ్రవరి 27, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 22/01/2021 03:36 IST
భాజపా నేతల గృహ నిర్బంధం

డీజీపీ కార్యాలయానికి రాకుండా అరెస్టులు
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?
సోము వీర్రాజు ఆగ్రహం
రథయాత్రను నిర్వహించి  తీరుతామని స్పష్టీకరణ

ఈనాడు- అమరావతి, న్యూస్‌టుడే- తాడేపల్లి, మంగళగిరి రూరల్‌: రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన విధ్వంసాల కేసుల్లో భాజపా కార్యకర్తల ప్రమేయం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన్ను కలిసి మాట్లాడదామని ప్రయత్నించిన భాజపా నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. గుంటూరు-విజయవాడ మార్గంలో ప్రత్యేక నిఘా పెట్టారు. తెల్లవారుజాము నుంచే నేతలను గృహ నిర్బంధం చేశారు. తాడేపల్లిలో సోము వీర్రాజును, గుంటూరులో కన్నా లక్ష్మీనారాయణను ఇంట్లో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. సోము వీర్రాజును గృహ నిర్బంధం చేయడంతో పార్టీ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, సీఎం రమేష్‌ ఆయన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు విజయవాడ విమానాశ్రయంలో ఎంపీ సీఎం రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని భాజపా రాష్ట్ర కార్యాలయానికి తరలించారు. పార్టీ నాయకులు పాతూరి నాగభూషణం, సాధినేని యామిని తదితరులను పోలీసులు స్టేషన్‌కు తరలించి తర్వాత విడిచిపెట్టారు. విజయవాడ నుంచి ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు పలువురు కార్యకర్తలు పోలీసుల కళ్లు గప్పి డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. పోలీసులు మాధవ్‌ను కార్యాలయం వెలుపలే అరెస్టు చేసి మంగళగిరి స్టేషన్‌కు తరలించారు. రాత్రి 9 గంటల తర్వాత సోము వీర్రాజు తదితరులు వెళ్లి పట్టుబట్టడంతో ఆయన్ను విడుదల చేశారు. తమను డీజీపీ కార్యాలయం వద్దకు ఎందుకు వెళ్లనీయడం లేదని పోలీసులపై సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. ‘డీజీపీతో మాట్లాడటానికి ఆయన కార్యాలయానికి వెళ్లాలని నిర్ణయించాం. ధర్నా, ఆందోళనలకు పిలుపునివ్వలేదు. అయినా పోలీసులు మా ఇళ్లవద్దకు చేరుకుని అడ్డుకోవడమేంటి?’ అని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉంది ప్రజాస్వామ్యమా? లేక ఎమర్జెన్సీనా? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. ‘రాజమండ్రి, శ్రీకాకుళం ఘటనల్లో మా కార్యకర్తల ప్రమేయం లేదు. ఆ ప్రకటనపై డీజీపీ వివరణ ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఫిబ్రవరి 4న యాత్రను నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ అండదండలతోనే రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసాలు చోటు చేసుకుంటున్నాయని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

పార్లమెంటులో చర్చిస్తాం: సీఎం రమేశ్‌
ఏపీలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని భాజపా నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ ఆరోపించారు. రాష్ట్రంలో దేవుళ్ల విగ్రహాల ధ్వంసం ఘటనల్లో భాజపా కార్యకర్తల ప్రమేయం ఉందన్న డీజీపీ ప్రకటనపై పార్లమెంటులో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్‌ మోషన్‌) ప్రవేశపెడతామని తెలిపారు.

మరిన్ని

  • పవన్‌ను చూసి రెచ్చిపోతున్నారుజనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను చూసుకుని రెచ్చిపోతున్నారంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం మత్స్యపురిలో గురువారం రాత్రి జనసేన, వైకాపా వర్గాల ఘర్షణతో
  • రాష్ట్రంలో భయానక పరిస్థితులు: సోము వీర్రాజురాష్ట్రంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ ఏకగ్రీవంగా గెలుపొందాలని అనేక రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తోందని ఆరోపించారు. కనీసం నామినేషన్లు వేయనీయకుండా
  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 30 మందిఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో మిగిలారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ తెలిపారు. తూర్పు-పశ్చిమగోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గంలో
  • చంద్రబాబు నాయకత్వంపై తెలుగు తమ్ముళ్లకు నమ్మకం లేదా?‘తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో ప్రసంగిస్తుండగా కింద నుంచి ఆ పార్టీ కార్యకర్తలు జూనియర్‌ ఎన్‌టీఆర్‌ని తీసుకురావాలంటూ నినాదాలు చేశారంటే..ఆయన నాయకత్వంపై తెలుగు తమ్ముళ్లకు 
  • భీమవరం ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ‘వైకాపాకు చెందిన భీమవరం ఎమ్మెల్యే ఒక ఆకు రౌడీ. సహకార బ్యాంకును దోచేసిన వ్యక్తి. చిరువ్యాపారులు, ఉపాధ్యాయులు, మధ్య తరగతి ప్రజల కష్టార్జితాన్ని బ్యాంకులో దాచుకుంటే వాటిని మింగేసిన వ్యక్తి. బెదిరించటం, దుర్భాషలాడటం, సభ్యసమాజం తలదించుకునేలా పరుష పదజాలం వాడటం, వ్యక్తిగతంగా నన్ను దూషించటం ఆయనకు రివాజుగా మారింది
  • పంచాయతీల విలీనం.. పురపోరుకు దూరంపురపాలక, నగరపాలక సంస్థల్లో సమీప పంచాయతీలు, గ్రామాలను విలీనం చేయడంపై కోర్టుల్లో కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలోని 33 చోట్ల పుర ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాలేదు. వీటిలో మూడు నగరపాలక సంస్థలు, మరో 30 పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు ఉన్నాయి.
  • పంచాయతీలకంటే భారీ విజయం తథ్యంకుప్పంతో సహా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పునాదులు కదిలిపోయాయని వైకాపా రాయలసీమ జిల్లాల బాధ్యుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కడప నగర శివార్లోని ఓ ప్రైవేటు సమావేశ మందిరంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
  • ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది! 
  • అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
  • గ్లామర్‌ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
  • వనస్థలిపురంలో కారు బీభత్సం
  • థ్యాంక్స్‌ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
  • తరగతి గదిలో ఉపాధ్యాయురాలిపై చాకుతో భర్త దాడి
  • టీమ్‌ఇండియా ఇలా చేయదు కదా..! 
  • దిగ్గజ పథంలో..
  • కిమ్‌ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు 
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.