☰
శనివారం, మార్చి 06, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Published : 22/01/2021 03:32 IST
‘కళా’పై కేసు.. భగ్గుమన్న తెదేపా

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఈనాడు, అమరావతి: తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కె.కళా వెంకటరావుపై పోలీసులు అక్రమంగా కేసుపెట్టి, అదుపులోకి తీసుకున్నారంటూ తెదేపా శ్రేణులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేశాయి. మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకాలు నిర్వహించి, వినతిపత్రాలు అందజేశారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయని తెదేపా ఒక ప్రకటనలో పేర్కొంది. ‘తెదేపా నాయకులు జగన్‌రెడ్డి ఉన్మాద పాలనపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీ నాయకత్వాన్ని అణచివేసేందుకు వైకాపా సాగిస్తున్న కుట్రలను బీసీలంతా ఏకమై తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేవాలయాలపై దాడుల్ని, దేవుళ్ల విగ్రహాల ధ్వంసాన్ని ఖండించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంపై మండిపడ్డారు’ అని ఆ ప్రకటనలో తెదేపా తెలిపింది. విశాఖపట్నంలో జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, మచిలీపట్నం బస్టాండ్‌ సెంటరులోని ఎన్టీఆర్‌ విగ్రహంవద్ద కొల్లు రవీంద్ర, మైలవరంలోని గాంధీ విగ్రహం వద్ద దేవినేని ఉమామహేశ్వరరావు, రాజమండ్రిలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి అప్పారావు, గన్నికృష్ణ తదితరులు, ఒంగోలులో దామచర్ల జనార్థన్‌, గిద్దలూరులో అశోక్‌రెడ్డి, గోపాలపురంలో ముప్పిడి వెంకటేశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో నిరసనలు జరిగినట్లు తెలిపింది.

శ్రీకాకుళం జిల్లాలో..

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: కళా వెంకటరావును పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకోవడంపై శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎంతో సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న ఆయనపై ఈ ప్రతీకార చర్యలేంటని ప్రశ్నిస్తూ జిల్లాకు చెందిన తెదేపా ముఖ్య నేతలు, కార్యకర్తలు గురువారం నిరసనలు చేశారు. పలుచోట్ల కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. రామతీర్థం ఘటనలో తప్పు చేసిన వారిని పట్టుకోలేని పోలీసులు ఆ తప్పును నిలదీసిన వారిపై కేసులు బనాయించడాన్ని తప్పుబట్టారు. పోలీసుల అదుపులో నుంచి విడుదలైన కళా వెంకటరావును కలవడానికి స్వగ్రామం నుంచి బయలుదేరిన ఇచ్ఛాపురం శాసనసభ్యులు బెందాళం అశోక్‌ను స్థానిక పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు.  ఇదే అణచివేత ధోరణిని కొనసాగిస్తే మరింత ఉద్యమిస్తామని తెదేపా నేతలు స్పష్టం చేశారు.

మరిన్ని

  • తృణమూల్‌తో పొత్తు లెఫ్ట్‌కు చేటుపశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను అడ్డుకునేందుకు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)తో లెఫ్ట్‌ పార్టీలు పొత్తు కుదుర్చుకోవాలంటూ
  • చంద్రబాబు నీటి పన్నును 33శాతం పెంచలేదా?దేశవ్యాప్తంగా చేపట్టిన సంస్కరణల్లో భాగంగానే ఆస్తి పన్ను పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ‘ఇతర రాష్ట్రాల్లోలా కాకుండా
  • బెదిరింపులతో నామినేషన్ల ఉపసంహరణ సాధ్యమేనా?దౌర్జన్యం చేయడం వల్లో, బెదిరించో, ఒత్తిడి తీసుకొచ్చో అభ్యర్థులతో నామినేషన్లను ఉపసంహరింపజేయడం సాధ్యమేనా? అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘అభ్యర్థులే వ్యక్తిగతంగా వెళ్లి
  • 10న వరంగల్‌ జిల్లా నాయకులతో షర్మిల భేటీవైఎస్‌ షర్మిల ఈ నెల పదో తేదీన తెలంగాణలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయకులు, అభిమానులతో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. గురువారం ఆ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో
  • విజయవాడ తెదేపా మేయర్‌ అభ్యర్థిగా కేశినేని శ్వేతవిజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్‌ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును ఖరారు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
  • కర్ణాటక సభలో చొక్కా విప్పిన ఎమ్మెల్యేకర్ణాటక విధానసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన కొద్దిసేపటికే ‘ఒకే దేశం.. ఒకే ఎన్నిక’ అంశంపై చర్చ సందర్భంగా భద్రావతి ఎమ్మెల్యే బి.కె.సంగమేశ్‌ (కాంగ్రెస్‌) తన వ్యక్తిగత అంశంపై
  • గుత్తేదార్లు, వ్యాపారులే వారి అభ్యర్థులుతెదేపా, వైకాపా అభ్యర్థుల్లో ఎక్కువ మంది గుత్తేదార్లు, వ్యాపారులే ఉన్నారని రాజ్యసభ సభ్యుడు, భాజపా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు విమర్శించారు.
  • విశాఖను దోచేస్తారు.. జాగ్రత్త!‘ఇప్పటికే ఒక్కసారి అవకాశం ఇమ్మంటే నమ్మి అధికారం కట్టబెట్టారు. రెండేళ్లలో ఒక్క అభివృద్ధి పనీ జరగలేదు. మళ్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపాను నమ్మి అధికారం ఇస్తే విశాఖ నగరాన్ని దోచేస్తారు.. జాగ్రత్త!’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు.
  • మే నాటికి మాదే పైచేయిమండలిలో బలాన్ని ఆసరాగా చేసుకుని, ఏవో సాంకేతిక కారణాలు చూపుతూ అభివృద్ధిని తెదేపా అడ్డుకుంటూ వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వచ్చే మే నెల నాటికి మండలిలో వైకాపాకు మెజారిటీ లభిస్తుందని, జగన్‌ చేసే అభివృద్ధి పనులకు ఉభయ సభల్లోనూ మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, మహ్మద్‌ ఇక్బాల్‌, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్‌, చల్లా భగీరథరెడ్డి, కళ్యాణ చక్రవర్తి నామినేషన్లు వేసిన అనంతరం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • రివ్యూ: పవర్‌ ప్లే
  • పంత్‌ ‘GOAT’ అవుతాడు: దాదా
  • బీమా చేస్తున్నారు.. ప్రాణం తీస్తున్నారు! 
  • అమెరికా నిర్ణయంతో టీకా ఉత్పత్తికి ఇబ్బందులు!
  • పంత్‌ నిర్దాక్షిణ్యం: శతకంకొట్టేశాడు
  • బైక్‌ ఎక్కిన కృతి.. పుస్తకం పట్టిన కాజోల్‌
  • నలుగురితో ప్రేమ.. లక్కీ డ్రా తీసి ఒకరితో పెళ్లి!
  • ఏంటీ ఇవన్నీ రీమేక్‌లా..!
  • పంత్‌.. ధోనీ పని చేసేస్తున్నాడు: రోహిత్‌
  • రివ్యూ: ఏ1 ఎక్స్‌ప్రెస్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.