☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 04/03/2021 16:35 IST
‘మళ్లీ నామినేషన్ల’ ఉత్తర్వుల నిలుపుదల

ఎస్‌ఈసీ ప్రయత్నాలు ప్రశంసనీయం
చట్టం చెబుతున్నందునే మధ్యంతర ఉత్తర్వులిస్తున్నాం: హైకోర్టు

ఈనాడు, అమరావతి: పురపాలక ఎన్నికల్లో 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్‌ దాఖలుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 1న ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. నామినేషన్ల అడ్డగింతలు, బలవంతపు ఉపసంహరణ విషయంలో ఫిర్యాదులు స్వీకరించాలని కలెక్టర్లకు గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ‘నామినేషన్ల దాఖలు దశ నుంచి ఫలితాల వెల్లడి వరకు వచ్చే ఫిర్యాదులను ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోవడానికి వీల్లేదని చట్టం, నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు, మోసం, వంచన చోటుచేసుకుంటే ప్రత్యామ్నాయ మార్గంగా ‘ఎన్నికల పిటిషన్‌’ వేసుకోవాలి. నామినేషన్‌ వేయడానికి అడ్డంకులు ఎదుర్కొన్న అభ్యర్థులు ట్రైబ్యునళ్లనే ఆశ్రయించాలి. ఈ నేపథ్యంలో మళ్లీ నామినేషన్‌ దాఖలుకు ఎస్‌ఈసీ ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని కోర్టు అభిప్రాయపడుతోంది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసించదగినవి అయినా చట్టం పిటిషనర్లకు అనుకూలంగా ఉంది. ఎస్‌ఈసీ చర్యలు సమాజం మంచి కోసమే అయినా చట్టం నిర్దేశిస్తున్నందు వల్ల న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఎస్‌ఈసీ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

వాలంటీర్లను ఎన్నికలకు దూరం పెట్టడంపై స్టే
వార్డు వాలంటీర్లను మున్సిపల్‌ ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ ఎస్‌ఈసీ ఫిబ్రవరి 28న ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలుపుదల చేసింది. న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఎస్‌ఈసీ ఉత్తర్వులపై గ్రామ, వార్డు వాలంటీర్‌ గ్రామ, వార్డు సచివాలయం శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.అజయ్‌జైన్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మంగళవారం విచారణ జరిపిన న్యాయమూర్తి బుధవారం నిర్ణయాన్ని వెల్లడించారు. ‘మొబైల్‌ ఫోన్లు ఉన్నా, లేకపోయినా ఆధునిక కాలంలో సమాచారం లభ్యమవుతోంది. ఫోన్‌ లేకపోయినా వాలంటీర్లు బెదిరించగలరని కోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడుతోంది. వృద్ధాప్య పింఛన్లే నేరుగా లబ్ధిదారులకు ఇస్తున్నారు. మిగిలిన పథకాల సొమ్మును ఖాతాలో జమచేస్తున్నారు. వాలంటీర్ల విధినిర్వహణకు అనుమతించాలని కోర్టు అభిప్రాయపడుతోంది. ప్రయోజనాలను నిలిపేస్తామంటూ ఓటర్లను బెదిరిస్తే ఎస్‌ఈసీ చర్యలు తీసుకోవచ్చు. ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేయవచ్చు. ఫలానా నిబంధనల ప్రకారం ఫిర్యాదు చేయవచ్చని ఎస్‌ఈసీ విస్తృత ప్రచారం కల్పించొచ్చు. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఫిబ్రవరి 28న ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇదే విషయంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.


మరిన్ని

  • కరోనా ప్రళయ గర్జనదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి విశృంఖలంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.
  • రాయలసీమ ఎత్తిపోతల పర్యటనను రద్దు చేసుకోవాలిరాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు కృష్ణా బోర్డు నియమించిన కమిటీ చేపట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మరోసారి విన్నవించింది.
  • భిలాయిలో కల్లోలం... ఉద్దానంలో ఆందోళనఛత్తీస్‌గఢ్‌లో కరోనా రెండోదశ విలయతాండవం చేస్తోంది. రోజూ అక్కడ వేలలో కేసులు నమోదవుతున్నాయి.
  • ఆత్మకూరులో ఇళ్ల కూల్చివేతగుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 16వ నెంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్డుకు ఇరువైపులా ఉన్న 105....
  • మూడో డోసుతో కొవిడ్‌కు మూడుతుందా?కొవిడ్‌-19పై సమర్థ పోరు కోసం టీకాకు సంబంధించిన మూడో బూస్టర్‌ డోసు ఆవశ్యకతపై మరింత డేటా అవసరమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
  • 104కు ఫోన్‌ చేస్తే పడకలుకరోనా బాధితులకు పడకలు కావాలని 104 కాల్‌ సెంటర్‌కు ఫోను చేస్తే 3 గంటల్లో కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.
  • అన్ని వార్డులూ కొవిడ్‌ చికిత్సలకేగుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు (జీజీహెచ్‌) కరోనా వైద్యసేవల కోసం వస్తున్న రోగులు రోజురోజుకూ పెరుగుతున్నారు.
  • వైరస్‌ ఉద్ధృతితో దిల్లీ విలవిలకొవిడ్‌ మహమ్మారి విజృంభణతో దేశ రాజధాని దిల్లీ విలవిలలాడుతోంది. 24 గంటల్లో 24 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
  • టీకాల పంపిణీకి 5 సూత్రాలుప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమ వేగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం అయిదు చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సూచించారు.
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటుప్రస్తుతం వైరస్‌లో వచ్చిన మార్పుల కారణంగా అది బలవంతంగా గడియ తీసి.. తలుపులు తెరుచుకొని ఇంట్లోకి చొరబడినట్లుగా మానవ కణజాలంలోకి ప్రవేశిస్తోందని ప్రముఖ
  • బడుల్లో భయంరాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి పాఠశాలలపైనా ప్రభావం చూపుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్‌ బారినపడుతున్నారు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడులకు పంపించేందుకు నిరాకరిస్తున్నారు. పాఠశాలల్లో హాజరు క్రమంగా తగ్గిపోతోంది. వందల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు గంటల తరబడి ఒకేచోట ఉండడం, మాస్కులు సరిగా ధరించక పోవడంతో కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు ఉపాధ్యాయులు కొవిడ్‌తో మరణించారు. కృష్ణా జిల్లాలోని బడుల్లో ఎవరికైనా కరోనా వస్తే ఐదు రోజులు సెలవులు ఇచ్చి, మామూలుగా పునఃప్రారంభిస్తున్నారు.
  • జగనన్న విద్యాదీవెన తొలివిడత నేడుజగనన్న విద్యాదీవెన కింద ప్రస్తుత విద్యా సంవత్సరం(2020-21)లో తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది.
  • రాష్ట్రంలో 6,582ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రమవుతోంది. 24 గంటల వ్యవధిలో పరీక్షించిన వారిలో 18.23 శాతం మందికి కొవిడ్‌ ఉన్నట్లు నిర్ధారణైంది.
  • ఏబీపై మళ్లీ క్రమశిక్షణ చర్యలు!ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.
  • జేఈఈ - మెయిన్స్‌ వాయిదాఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన జేఈఈ- మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది.
  • పాలు అందక అంగన్‌వాడీలాపాలు.. సకల పోషకాల గనులు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సరైన పోషక పదార్థాలు అందాలని... తద్వారా రక్తహీనత, ఎదుగుదల లోపం, ప్రసవంలో....
  • కాల్సైట్‌ ఖనిజానికి మళ్లీ టెండర్లువిశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని కాల్సైట్‌ ఖనిజం తవ్వకాలకు మళ్లీ టెండర్లు పిలవాలని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్ణయించింది.
  • జగన్‌ కుటుంబసభ్యుల అరెస్టుకు ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఒత్తిడివైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటనలో.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులు, బంధువులను అరెస్టు చేయాలని....
  • లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడితే 100 రోజుల్లో చర్యలులంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కేసుల్లో ప్రభుత్వోద్యోగులపై 100 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
  • ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలుకరోనా ఉద్ధృతితో ఆసుపత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రజారోగ్య కేంద్రాల్లో 162 ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్పషన్‌ (పీఎస్‌ఏ)....
  • మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్‌ వారిపై జరిగింది తొలి స్వాతంత్య్ర సంగ్రామమైతే.. ఇప్పుడు భాజపా ప్రభుత్వం మీద రెండో స్వాతంత్య్ర సమరం మొదలుపెట్టాలని జాతీయ రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • కరోనాపై ‘ప్యాకేజీ’గా పోరాడకపోతే ఇంతే..!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.