☰
సోమవారం, ఏప్రిల్ 19, 2021
home
జాతీయం సినిమా ఐపీఎల్ క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • అన్నదాత
  • రిజల్ట్స్
E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 04/03/2021 12:23 IST
24 గంటలూ వ్యాక్సినేషన్‌

టీకా వేసే సమయ పరిమితి ఎత్తివేత
కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడి

ఈనాడు, దిల్లీ: కరోనా టీకా కోసం దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 60 ఏళ్లపైబడిన వృద్ధుల రద్దీ పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా టీకా వేసే సమయ పరిమితిని ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ప్రజలు 24 గంటల్లో ఎప్పుడైనా కొవిడ్‌ టీకా తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ తెలిపారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకే టీకా పంపిణీ సమయంపై ఉన్న ఆంక్షలను తొలగించినట్లు చెప్పారు. ఎక్కువ మందికి టీకా అందించడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు వారికి అనువైన సమయంలో 24×7 ఎప్పుడైనా టీకా తీసుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపపత్రులు ఏ సమయంలోనైనా టీకా పంపిణీ చేయవచ్చని తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజల ఆరోగ్యంతోపాటు, వారి సమయ విలువనూ బాగా అర్థం చేసుకుంటారు’’ అని ఈ  సందర్భంగా హర్షవర్ధన్‌ ట్విటర్‌ ద్వారా పేర్కొన్నారు.

టీకా వేయించుకున్న రాష్ట్రపతి
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ టీకా తొలి డోసు తీసుకున్నారు. బుధవారం దిల్లీలోని ఆర్మీ రిసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రిలో రాష్ట్రపతి టీకా వేయించుకున్నారు. రాష్ట్రపతి వెంట ఆయన కుమార్తె కూడా ఉన్నారు. ఆ చిత్రాలను రాష్ట్రపతి ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు. చరిత్రలో అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపడుతున్న వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి   రామ్‌నాథ్‌ కోవింద్‌ అభినందనలు  తెలిపారు. అర్హులైన పౌరులందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

కేరళ, గోవా సీఎంలు కూడా..
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌లు బుధవారం కొవిడ్‌ టీకా వేయించుకున్నారు. అదేవిధంగా కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు దిల్లీలో కొవిడ్‌-19 టీకా తొలి డోసు తీసుకున్నారు.


మరిన్ని

  • కరోనా ప్రళయ గర్జనదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉద్ధృతి విశృంఖలంగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.
  • రాయలసీమ ఎత్తిపోతల పర్యటనను రద్దు చేసుకోవాలిరాయలసీమ ఎత్తిపోతల పథకం సందర్శనకు కృష్ణా బోర్డు నియమించిన కమిటీ చేపట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ మరోసారి విన్నవించింది.
  • భిలాయిలో కల్లోలం... ఉద్దానంలో ఆందోళనఛత్తీస్‌గఢ్‌లో కరోనా రెండోదశ విలయతాండవం చేస్తోంది. రోజూ అక్కడ వేలలో కేసులు నమోదవుతున్నాయి.
  • ఆత్మకూరులో ఇళ్ల కూల్చివేతగుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో 16వ నెంబరు జాతీయ రహదారి సర్వీసు రోడ్డుకు ఇరువైపులా ఉన్న 105....
  • మూడో డోసుతో కొవిడ్‌కు మూడుతుందా?కొవిడ్‌-19పై సమర్థ పోరు కోసం టీకాకు సంబంధించిన మూడో బూస్టర్‌ డోసు ఆవశ్యకతపై మరింత డేటా అవసరమని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
  • 104కు ఫోన్‌ చేస్తే పడకలుకరోనా బాధితులకు పడకలు కావాలని 104 కాల్‌ సెంటర్‌కు ఫోను చేస్తే 3 గంటల్లో కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు.
  • అన్ని వార్డులూ కొవిడ్‌ చికిత్సలకేగుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలకు (జీజీహెచ్‌) కరోనా వైద్యసేవల కోసం వస్తున్న రోగులు రోజురోజుకూ పెరుగుతున్నారు.
  • వైరస్‌ ఉద్ధృతితో దిల్లీ విలవిలకొవిడ్‌ మహమ్మారి విజృంభణతో దేశ రాజధాని దిల్లీ విలవిలలాడుతోంది. 24 గంటల్లో 24 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.
  • టీకాల పంపిణీకి 5 సూత్రాలుప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమ వేగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం అయిదు చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ సూచించారు.
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటుప్రస్తుతం వైరస్‌లో వచ్చిన మార్పుల కారణంగా అది బలవంతంగా గడియ తీసి.. తలుపులు తెరుచుకొని ఇంట్లోకి చొరబడినట్లుగా మానవ కణజాలంలోకి ప్రవేశిస్తోందని ప్రముఖ
  • బడుల్లో భయంరాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి పాఠశాలలపైనా ప్రభావం చూపుతోంది. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్‌ బారినపడుతున్నారు. దీంతో కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడులకు పంపించేందుకు నిరాకరిస్తున్నారు. పాఠశాలల్లో హాజరు క్రమంగా తగ్గిపోతోంది. వందల మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు గంటల తరబడి ఒకేచోట ఉండడం, మాస్కులు సరిగా ధరించక పోవడంతో కేసులు పెరుగుతున్నాయి. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు ఉపాధ్యాయులు కొవిడ్‌తో మరణించారు. కృష్ణా జిల్లాలోని బడుల్లో ఎవరికైనా కరోనా వస్తే ఐదు రోజులు సెలవులు ఇచ్చి, మామూలుగా పునఃప్రారంభిస్తున్నారు.
  • జగనన్న విద్యాదీవెన తొలివిడత నేడుజగనన్న విద్యాదీవెన కింద ప్రస్తుత విద్యా సంవత్సరం(2020-21)లో తొలి త్రైమాసికం బోధనా రుసుముల్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేయనుంది.
  • రాష్ట్రంలో 6,582ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రమవుతోంది. 24 గంటల వ్యవధిలో పరీక్షించిన వారిలో 18.23 శాతం మందికి కొవిడ్‌ ఉన్నట్లు నిర్ధారణైంది.
  • ఏబీపై మళ్లీ క్రమశిక్షణ చర్యలు!ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న నిఘా విభాగం మాజీ అధిపతి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది.
  • జేఈఈ - మెయిన్స్‌ వాయిదాఇంజినీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈనెల 27 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన జేఈఈ- మెయిన్స్‌ పరీక్ష వాయిదా పడింది.
  • పాలు అందక అంగన్‌వాడీలాపాలు.. సకల పోషకాల గనులు. చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు సరైన పోషక పదార్థాలు అందాలని... తద్వారా రక్తహీనత, ఎదుగుదల లోపం, ప్రసవంలో....
  • కాల్సైట్‌ ఖనిజానికి మళ్లీ టెండర్లువిశాఖ ఏజెన్సీ ప్రాంతంలోని కాల్సైట్‌ ఖనిజం తవ్వకాలకు మళ్లీ టెండర్లు పిలవాలని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) నిర్ణయించింది.
  • జగన్‌ కుటుంబసభ్యుల అరెస్టుకు ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర ఒత్తిడివైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటనలో.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబసభ్యులు, బంధువులను అరెస్టు చేయాలని....
  • లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడితే 100 రోజుల్లో చర్యలులంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ కేసుల్లో ప్రభుత్వోద్యోగులపై 100 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
  • ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలుకరోనా ఉద్ధృతితో ఆసుపత్రుల్లో మెడికల్‌ ఆక్సిజన్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోని ప్రజారోగ్య కేంద్రాల్లో 162 ప్రెజర్‌ స్వింగ్‌ అడ్సార్పషన్‌ (పీఎస్‌ఏ)....
  • మరో స్వాతంత్య్ర పోరాటంబ్రిటిష్‌ వారిపై జరిగింది తొలి స్వాతంత్య్ర సంగ్రామమైతే.. ఇప్పుడు భాజపా ప్రభుత్వం మీద రెండో స్వాతంత్య్ర సమరం మొదలుపెట్టాలని జాతీయ రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • Horoscope: ఈ రోజు రాశి ఫలం
  • ఆశ్రయమిచ్చి అక్క, చెల్లెలిని వేధించి..
  • కళ్లలోంచీ వైరస్‌ చొరబాటు
  • విలియమ్సన్‌కు ఏమైంది?
  • మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడి మృతి..
  • కృత్రిమ కాలితో.. లైసెన్సు లేకుండా డ్రైవింగ్‌
  • India Corona: 3లక్షలకు చేరువగా కొత్త కేసులు
  • Weight Loss: చాలామంది చేస్తున్న తప్పులివే!
  • దిల్లీలో ఆరు రోజుల లాక్‌డౌన్‌..
  • హనుమంతుడు మనవాడే!
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.