☰
మంగళవారం, మార్చి 02, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 22/01/2021 11:21 IST
పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు ఓకే

టీకా ప్రక్రియనూ కొనసాగించండి
రెంటినీ విజయవంతం చేయండి
ఎన్నికలపై 37 పేజీల తీర్పు ఇచ్చిన హైకోర్టు
షెడ్యూలును నిలుపుదల చేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల రద్దు
ఈనాడు - అమరావతి

ఎన్నికల షెడ్యూలు విడుదల చేయడం ద్వారా రాజ్యాంగం నిర్దేశించిన బాధ్యతను నెరవేర్చడంతో పాటు, రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ తన అధికారాన్ని వినియోగించారు. ఈ క్రమంలో ఆయన దురుద్దేశంతో వ్యవహరిస్తే.. ఆ విషయాన్ని తగిన సాక్ష్యాలతో కోర్టుకు వివరించాలి. కానీ ప్రభుత్వం అలా చెప్పలేకపోయింది.

- హైకోర్టు ధర్మాసనం

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన షెడ్యూలును సస్పెండ్‌ చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేసింది. ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఎన్నికలు, కరోనా టీకా ప్రక్రియ రెండూ ప్రజలకు ప్రాధాన్యం ఉన్న కార్యక్రమాలని.. ఈ రెండింటినీ సజావుగా నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల షెడ్యూలును నిలుపుదల చేస్తూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు.. ఎన్నికల సంఘానికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కులపై ప్రభావం చూపుతున్నాయని తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి, జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం గురువారం 37 పేజీల తీర్పు వెల్లడించింది.
అప్పీలుకు విచారణార్హత ఉంది
ఎస్‌ఈసీ దాఖలు చేసిన అప్పీలుకు విచారణార్హత లేదని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శ్రీరామ్‌ చేసిన వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు కూడా తీర్పేనని, అప్పీలుకు విచారణ అర్హత ఉందని స్పష్టం చేసింది. లోతైన విచారణ జరపకుండా, ఇరుపక్షాల హక్కులు, బాధ్యతల్ని పరిగణనలోకి తీసుకోకుండా సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు తుది ఆదేశాల్లా ఉన్నాయని ఎస్‌ఈసీ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు చేసిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పంచాయతీ ఎన్నికల కాలపరిమితి ముగియడంతో కమిషనర్‌ తన చట్టబద్ధమైన అధికారాన్ని వినియోగించారని తేల్చి చెప్పింది. అధికార పార్టీ సీనియర్‌ నాయకుడు ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు ఉంటాయని చెప్పిన విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఎన్నికల షెడ్యూలు ఇచ్చారంటూ ఏజీ చేసిన వాదనలను అంగీకరించలేమని తెలిపింది. కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించారని గుర్తుచేసింది. ఎన్నికల నిర్వహణను వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టు సమర్థించాయని తెలిపింది. టీకా కార్యక్రమం గురించి కమిషనర్‌ స్పష్టంగా చర్చించారని.. టీకా కార్యక్రమం విజయవంతం కావడంలో దిగువస్థాయి నాయకత్వం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారని గుర్తుచేసింది.
సంప్రదింపుల ప్రక్రియ జరిగింది
‘ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను పరిశీలిస్తే.. టీకా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశాన్నీ కమిషనర్‌ పరిగణనలోకి తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. ప్రభుత్వ అభిప్రాయాలతో కమిషనర్‌ అంగీకరించి ఉండకపోవచ్చు. సంప్రదింపుల ప్రక్రియ మాత్రం జరిగింది. సింగిల్‌ జడ్జి పేర్కొన్నట్లు సంప్రదింపుల ప్రక్రియ జరగలేదని చెప్పలేం. ప్రభుత్వం సమర్పించిన ఏ వివరాల్ని పరిగణనలోకి తీసుకోవడంలో కమిషనర్‌ విఫలమయ్యారో సింగిల్‌ జడ్జి కారణాల్ని పేర్కొనలేదు. ఎన్నికలు నిర్వహించాలన్న ఎస్‌ఈసీ నిర్ణయం టీకా ప్రక్రియకు ఎలా అవరోధం కలిగిస్తుందో కూడా సింగిల్‌ జడ్జి వెల్లడించలేదు. ప్రభుత్వం సమర్పించిన అన్ని వివరాలూ పరిశీలించాకే ఎన్నికలు, టీకా ప్రక్రియ రెండు సమన్వయంతో నిర్వహించొచ్చని ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకుంది’ అని ధర్మాసనం పేర్కొంది.
ఎన్నికలు నిలిచిపోకుండా న్యాయస్థానం రక్షణగా ఉండాలి
‘సుప్రీంకోర్టు తీర్పులను పరిశీలిస్తే.. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోకుండా, జాప్యం జరగకుండా, అడ్డంకులు కలగకుండా న్యాయస్థానం రక్షణగా నిలవాలి. భారత ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలే.. రాష్ట్ర ఎన్నికల సంఘాలకూ ఉంటాయని ‘కిషన్‌సింగ్‌ తోమర్‌’ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్‌ఈసీ స్వతంత్రంగా విధులు నిర్వర్తించొచ్చని పేర్కొంది. ఎన్నికల నిర్వహణ అధికారం పూర్తిగా ఎన్నికల సంఘానికి ఉంటుందని విస్పష్టంగా తెలిపింది. అంతేకాక అధికరణ 243(కె)(3) ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్వతంత్ర హోదా ఉంటుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఎన్నికల షెడ్యూలు విషయంలో ఎస్‌ఈసీ ఈనెల 8న ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి సస్పెండ్‌ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నాం. ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం. ఎన్నికలు, టీకా కార్యక్రమాల్ని సజావుగా విజయవంతం చేయాలని ఆదేశిస్తున్నాం’ అని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ‘గతేడాది మార్చిలో స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ ఇచ్చింది. కరోనా కారణంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ ఎన్నికలను నిలిపేస్తూ ఎస్‌ఈసీ 2020 మార్చి 15న ఉత్తర్వులిచ్చింది. కరోనా కారణంగా ప్రజారోగ్యానికి హానికరమనే అభిప్రాయంతో ఎన్నికలను వాయిదా వేసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎస్‌ఈసీ నిర్ణయంలో జోక్యానికి సుప్రీం నిరాకరించింది. తర్వాత ఎన్నికలు నోటిఫై చేసేముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాలని ఎస్‌ఈసీని ఆదేశించింది’ అని ధర్మాసనం గుర్తుచేసింది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జనవరి 8న సంప్రదింపులు జరిపిన తర్వాతే ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూలును విడుదల చేశారని తెలిపింది.
టీకా ప్రక్రియ ముగిసేవరకూ ఎన్నికలు ఆపడం సరికాదు
‘ఎన్నికల షెడ్యూలు ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి సస్పెండ్‌ చేయడం నిబంధనలకు విరుద్ధం. ప్రభుత్వం సమర్పించిన వివరాలన్నింటినీ చూశాకే ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూలు జారీచేసిన విషయాన్ని సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకోలేదు. టీకా కార్యక్రమం ముగిసేవరకూ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికలను నిలువరించడం సరికాదు’ అని న్యాయమూర్తులు అన్నారు.


మరిన్ని

  • విమానాశ్రయంలో చంద్రబాబు నిరసన సరికాదురేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన చేపట్టడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నడూలేని తరహాలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే... ఆయన నిరసన తెలపడం అన్యాయమన్నారు.
  • ఏప్రిల్‌కు 10 పాఠాల పూర్తిరాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ చివరి నాటికి పాఠాలను పూర్తి చేసి.. మే నుంచి పునశ్చరణ తరగతులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. నవంబరు 2 నుంచి పాఠశాలల్లో పూర్తి స్థాయి తరగతులు కొనసాగుతున్నాయి.
  • జనం నెత్తిన మళ్లీ గ్యాస్‌బండవంట గ్యాస్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం నుంచి గృహావసరాలకు వినియోగించే సిలిండరు ధర రూ.25, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరు ధర రూ.96 పెంచారు. దీంతో విజయవాడలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండరు
  • ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు‘ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా, తిరుపతి విమానాశ్రయంలో ఆయన్ను పోలీసులు నిర్బంధించడం ఏమిటి’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్‌ పిరికితనంతో.. ప్రతిపక్షనేత చంద్రబాబును ప్రజల్లో తిరగకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు
  • నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణపుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నుంచి నామినేషన్ల ఉపసంహరణకు పురపాలకశాఖ ఏర్పాట్లు చేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అనుమతిస్తారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలతో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించనున్నారు
  • 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్లుపుర ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులు బెదిరించి, భయపెట్టి అడ్డుకున్నారని, వేసిన చోట మళ్లీ వెనక్కి తీసుకునెలా ఒత్తిడి తెచ్చారని పలువురు చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కడప, చిత్తూరు జిల్లాల్లో
  • కట్టారు..కూలగొట్టారు!విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువైన ఆలయం దశాబ్దాల కిందట ఎలా ఉందో... ఇప్పుడూ అచ్చం అలాగే ఉంది. కొండపై ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, మల్లేశ్వరస్వామి గుడి తప్ప చెప్పుకోదగ్గవి ఇంకేమీ లేవు. కొండపై గత పదిహేనేళ్లలో రూ.కోట్లు వెచ్చించి అనేక భవనాలు నిర్మించారు. కానీ... కట్టిన వాటిని కట్టినట్లే దాదాపు అన్నీ కూల్చేశారు.
  • కొవిడ్‌ నిబంధనలను పాటించాల్సిందేఎన్నికల ప్రచారంలో కొవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ సూచించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సోమవారం వివిధ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు
  • ప్రధానికి టీకాసాధారణ ప్రజానీకానికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులు పాల్గొని ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 60 ఏళ్లు పైబడ్డవారికి, వివిధ వ్యాధులు ఉన్న 45-59 ఏళ్లవారిని అర్హులుగా గుర్తించి టీకాలు ఇవ్వడం ప్రారంభించారు.
  • ఉభయతారకంగా నదుల అనుసంధానంనదుల అనుసంధానంలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దీనిపై కేంద్రానికి పంపే ప్రతిపాదనలన్నీ ఉభయతారకంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం అధికారులతో సమీక్షించారు. నదుల అనుసంధానంపై ఇటీవల దిల్లీలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది
  • చంద్రబాబు నిర్బంధంతిరుపతిలో అనేక సమావేశాలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ 55 వేల మంది వరకు వస్తున్నారు. ఇప్పుడు నాకు నోటీసు ఎందుకిచ్చారు? నేను రావడానికి అనుమతి కావాలా? ఇది దౌర్జన్యం కాదా? జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు నాకు హక్కు లేదా? నేను హత్య చేసేందుకు వెళ్తున్నానా? మీరు అనుమతి నిరాకరించారు కాబట్టి ఇక్కడే కూర్చుని నిరసన తెలియజేస్తా

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • బాబు గీసిన బొమ్మ.. ఎంజాయ్‌ చేస్తోన్న అనుపమ
  • మార్చి 4 నుంచి రష్మిక మకాం అక్కడే!
  • జయసుధను ఇలా చూశారా..?
  • సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
  • ఇంతకీ నీ అసలు వయసెంత అఫ్రిది?
  • బీమాసురులు
  • నటి హిమజకు పవన్‌ లేఖ
  • కాళ్లు చేతులు కట్టి..తుప్పల్లో పడేశారు
  • అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్‌
  • గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.