☰
శనివారం, ఫిబ్రవరి 27, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 22/01/2021 17:00 IST
రేషన్‌ బండికి రైట్‌.. రైట్‌

మొబైల్‌ వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ఇంటి వద్దకే రేషన్‌ బియ్యం సరఫరా చేసే మొబైల్‌ వాహనాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురువారం విజయవాడలో ప్రారంభించారు. అనంతరం కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు 2,500 వాహనాలు ఏకకాలంలో బయల్దేరాయి. బియ్యం తీసుకెళ్లేందుకు తిరిగి ఉపయోగించగలిగే వీలున్న 10, 15 కిలోల సంచుల్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రదర్శించారు. తొలుత వేదిక వద్దకు వచ్చిన సీఎం.. మొబైల్‌ వాహనాలు, అందులోని ఏర్పాట్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రారంభం అనంతరం జగన్‌ వాహన డ్రైవర్లకు నమస్కరిస్తూ వేదికపైనే నిల్చున్నారు. పెద్ద ఎత్తున బారులు తీరిన వాహనాలు.. మహాత్మాగాంధీ రోడ్డు నుంచి బెంజిసర్కిల్‌ మీదుగా ప్రధాన రహదారి ఎక్కి తమ ప్రాంతాలకు సాగిపోయాయి. చివరి వాహనం రోడ్డెక్కడానికి సుమారు 35 నిమిషాలు పట్టింది. అంతసేపూ సీఎం చేతులు జోడించి నిల్చుని ఉన్నారు.

సైరన్‌ మోగించుకుంటూ..
రేషన్‌ బియ్యం పంపిణీ వాహనాలకు సైరన్లు బిగించారు. సీఎం ప్రారంభించిన అనంతరం వాటన్నింటి సైరన్లు ఒక్కసారిగా మోగించారు. అలా కార్యక్రమం ముగిసే వరకు శబ్ధం చేస్తూనే ఉన్నాయి. కార్యక్రమంలో మంత్రులు కొడాలి నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వెలంపల్లి శ్రీనివాసరావు, పౌర సరఫరాలశాఖ కమిషనరు కోన శశిధర్‌, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఈడీ
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ముంబయి) విక్రమాదిత్యసింగ్‌ కిచి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం ప్రారంభించిన రేషన్‌ బియ్యమందించే 9,260 వాణిజ్య వాహనాలకు తామే అవసరమైన రుణాలను అందజేసినట్లు తెలిపారు.


మరిన్ని

  • కాడె శిఖరంపై తెలుగు తేజాలుకరోనా కారణంగా నిలిచిపోయిన పర్వతారోహణం మళ్లీ ప్రారంభమైంది. తొమ్మిది మంది సభ్యుల పర్వతారోహకుల బృందం...
  • శెభాష్‌ ఐఐసీటీకొవిడ్‌ నిరోధక దేశీయ టీకా అభివృద్ధిలో హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) ....
  • 90 లక్షల మందికి కొవిడ్‌ టీకారాష్ట్రంలో కొత్తగా సుమారు 90 లక్షల మందికి మార్చి 1 నుంచి కొవిడ్‌ టీకా ఇవ్వనున్నారు. 60 ఏళ్లు దాటిన వారిలో...
  • డీఆర్‌డీఏ వ్యవస్థ రద్దుదేశవ్యాప్తంగా జిల్లా గ్రామీణ అభివృద్ధి సమాఖ్య (డీఆర్‌డీఏ)లను రాష్ట్రాల పంచాయతీరాజ్‌ సంస్థల్లో విలీనం చేయాలని...
  • అన్న క్యాంటీన్లను తెరుస్తాంపురపాలికల్లో తాము అధికారంలోకి వస్తే అన్న క్యాంటీన్లను తెరుస్తామని తెదేపా ప్రకటించింది. పురపాలక ఎన్నికల కోసం...
  • 5 అసెంబ్లీల ఎన్నికలు.. గెలుపు గుర్రాలేవో!సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరంలో ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా రాజకీయాలు వేడెక్కాయి. పేరుకు నాలుగు రాష్ట్రాలు ...
  • కదంతొక్కిన ‘ఉక్కు’ కార్మికులువిశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో భాగంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఇ...
  • తిరుపతి లోక్‌సభ స్థానంపైనే అందరి గురి..రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతుండగానే... తిరుపతి లోక్‌సభ స్థానం ఉపఎన్నిక వేడి కూడా మొదలైంది....
  • పుర ఎన్నికల్లో జోక్యం చేసుకోలేంపురపాలక ఎన్నికల విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. గతేడాది నిలిచిపోయిన మున్సిపల్‌ ఎన్నికలను అక్కడి నుంచే ...
  • వేల్చేరుకు సమున్నత గౌరవంప్రముఖ రచయిత, అనువాదకుడు, సాహితీవేత్త వేల్చేరు నారాయణరావు ‘ఆనరరీ ఫెలో ఆఫ్‌ సాహిత్య అకాడమీ’కి ఎంపికయ్యారు....
  • పంచ తంత్రందేశంలో వేసవి కాలం ప్రారంభానికి ముందే రాజకీయ వేడి రగులుకొంది. అసోం, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో...
  • హోదా తెమ్మంటే.. ఉక్కుకూ ఎసరుకొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లు ప్రత్యేక హోదా తెమ్మని అడిగితే.. విశాఖ ఉక్కునూ పోగొట్టే పరిస్థితిని ...
  • భూసేకరణ భారం తగ్గించే సూచనలివ్వండికొవిడ్‌-19 పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన కొన్ని అంశాల్లో 2030 నాటికి సుస్థిర అభివృద్ధి సాధించాలని ...
  • ఎత్తు తగ్గిద్దామా!పోలవరం ప్రాజెక్టు ముంపును తగ్గించడానికి ఎత్తు తగ్గించేందుకు ఉన్న అవకాశాలపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసినట్లు తెలిసింది. ప్రాజెక్టు ప్రయోజనాలు దెబ్బతినకుండా ఎంత ఎత్తు తగ్గిస్తే ఎంత ముంపును నివారించడానికి అవకాశముందన్న అంశంపై కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ తదితర సంస్థలను సంప్రదిస్తున్నట్లు సమాచారం. కనీస నీటిమట్టం 41.15 ఎత్తు మీటర్ల నుంచి 38.05 మీటర్లకు తగ్గించడం, దీనికి...

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • 40 రోజులు.. రూ.40 లక్షల అద్దె!
  • ఇలాంటి వారివల్లే కరోనా కేసులు పెరిగేది! 
  • అమ్మా.. నాన్న.. అన్న... అన్నీ ఆమె!
  • గ్లామర్‌ ఫొటోలతో ఫిదా చేస్తోన్న తారలు
  • వనస్థలిపురంలో కారు బీభత్సం
  • థ్యాంక్స్‌ చెప్పిన జెస్సీ.. ఉల్లి తరిగిన ఊర్వశి
  • తరగతి గదిలో ఉపాధ్యాయురాలిపై చాకుతో భర్త దాడి
  • టీమ్‌ఇండియా ఇలా చేయదు కదా..! 
  • కిమ్‌ ఆంక్షలు.. రష్యా దౌత్యవేత్తల తిప్పలు 
  • దిగ్గజ పథంలో..
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.