☰
మంగళవారం, మార్చి 02, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • ఈ తరం
  • ఆహా
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

ప్రధానాంశాలు

Updated : 22/01/2021 17:05 IST
చివరికి గెలిచేది న్యాయమే

న్యాయమూర్తులు మారినా న్యాయం మారదు
ఎన్నికల గురించి రాష్ట్ర ప్రభుత్వమే మాట్లాడుతుందా?
అలాగైతే ఎన్నికల కమిషన్‌ ఎందుకు?
మండిపడ్డ చంద్రబాబు

ఈనాడు, అమరావతి: చట్టాలు కొంతమందికి చుట్టాలు కాదని.. న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిందేనన్న హైకోర్టు తీర్పుపై ఆయన స్పందిస్తూ.. ‘మేజిస్ట్రేట్‌ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సులు ఉంటాయి. కొన్నిసార్లు ఒక స్థాయిలో పొరపాట్లు జరిగినా పై స్థాయిలో వాటిని చక్కదిద్దుతారు. అంతిమంగా న్యాయం నిలబడుతుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో 25 శాతం ఏకగ్రీవమైన సందర్భాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. అప్పట్లో కరోనా ఉందని ఎన్నికలను వాయిదా వేస్తే కమిషనరునే మార్చేయాలనుకున్నారని, ఇప్పుడు కరోనా తగ్గాక ఎన్నికలు పెడతామంటే అడ్డుకోవాలని చూస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎన్నికల గురించి రాష్ట్ర ప్రభుత్వమే మాట్లాడితే ఎన్నికల కమిషన్‌ ఎందుకు? రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలూ తానే పెట్టుకుంటానని జగన్‌ అంటారేమో’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు గురువారం విలేకరులతో మాట్లాడారు.
డీజీపీ మోనార్క్‌ను అనుకుంటున్నారా?
డీజీపీ తానో మోనార్క్‌ను అనుకుంటున్నారని.. కోర్టు, ప్రజలు చీవాట్లు పెట్టినా లెక్కలేదని చంద్రబాబు మండిపడ్డారు. సజ్జల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టుకుని ఇష్టానుసారం చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. ‘రాష్ట్రంలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ అమలు చేస్తున్నారా? జగన్‌ పీనల్‌ కోడ్‌ అమలు చేస్తున్నారా? పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి మీ ఇంట్లో ఉన్నాడా? జగన్‌ ఇంట్లో ఉన్నాడా? అతనిపై రహస్య విచారణ ఎందుకు చేస్తున్నారో? ఎందుకు రాచమర్యాదలు చేస్తున్నారో చెప్పాలి’ అని డీజీపీని నిలదీశారు. కళా వెంకటరావు చేసిన తప్పేంటని, ఆయనను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించారు. ఒక ఎస్పీని బహిరంగసభలో తిట్టిన వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదన్నారు. ‘ముఖ్యమంత్రి, హోం మంత్రి, డీజీపీ ఒకే మతంవాళ్లు ఉంటే ఏం న్యాయం జరుగుతుందని సూటిగానే ప్రశ్నిస్తున్నా. వాళ్లంతా కలసి కుట్ర పన్నుతున్నారు. రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బలవంతపు మత మార్పిళ్లు జరుగుతున్నాయి. మీరు ఒక మతంపై కక్షగట్టినట్టు ప్రవర్తిస్తుంటే నేను అడిగితే తప్పా? తిరుపతిలో తెదేపా చేపట్టిన ధర్మపరిరక్షణ యాత్రకు అనుమతిచ్చి, మళ్లీ ఎందుకు రద్దు చేశారు’ అని మండిపడ్డారు.
‘రామతీర్థంలో రాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేసిన ఐదో రోజున అక్కడికి వెళ్లా. ప్రతిపక్ష నేత పర్యటనకు అనుమతిచ్చాక.. దానికి రెండు గంటల ముందుగా ఒక కరడుగట్టిన నేరస్థుడిని అక్కడికి పోలీసులు ఎలా అనుమతిస్తారు? రామతీర్థంలో రాముడి విగ్రహం తల తొలగించారని భక్తులు ఆందోళన చేస్తున్నారు. వాళ్లలో ఎవరైనా ఒకరిద్దరు కోపంతో ఏదో చేస్తే.. మాపై కేసులు పెడతారా? నేను అమరావతిలో పర్యటించినప్పుడు ఎవరో రాళ్లు, చెప్పులు విసిరితే వాళ్లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రైతులు అని డీజీపీ ప్రకటించారు. మరి ఇప్పుడు వైకాపా నేత వాహనంపై ఎవరో రాళ్లు విసిరితే మాపై ఎందుకు కేసులు పెడుతున్నారు?’ అని చంద్రబాబు నిలదీశారు.
మేం ఎవర్నైనా చంపేశామా?
‘69 ఏళ్ల కళా వెంకటరావును రాత్రి పూట అరెస్టు చేశారు. అచ్చెన్నాయుడిని, దేవినేని ఉమాను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పారు. మేం సంఘ వ్యతిరేక శక్తులమా? ఎవర్నైనా చంపేశామా? బూతులు మాట్లాడే ఒక రౌడీ మంత్రి.. ఉమాను ఇంటికొచ్చి కొడతాడంట. నన్నేదో చేస్తాడంట. 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నది మీతో దెబ్బలు తినడానికి కాదు. పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తి చాలా అశ్లీలంగా మాట్లాడాడు. అతనికి వీళ్లు వంత పాడుతున్నారు. అలాంటి వాళ్లను ఎంత మందిని పెట్టారో సీఎం చెప్పాలి’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘రాజధాని భూములపై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అని జగన్‌ హడావుడి చేశారు. ఇప్పుడేమైంది? దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులతో కేంద్రం పదిసార్లు చర్చించింది. 401 రోజులుగా ఆందోళన చేస్తున్న అమరావతి రైతులతో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు’ అని నిలదీశారు.

కరోనా తగ్గినా ఎన్నికలను అడ్డుకుంటున్నారు

ఈనాడు డిజిటల్‌- ఏలూరు, న్యూస్‌టుడే- ఆచంట, పోడూరు: కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నించిన ప్రభుత్వం.. ప్రస్తుతం కరోనా లేకున్నా ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాలలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘కరోనా ఉన్నప్పుడు హైదరాబాద్‌, అమెరికాలలో ఎన్నికలు జరిగాయి.. ప్రస్తుతం నియంత్రణలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు అడ్డుపడాలని ప్రయత్నిస్తోంది. పంచాయతీ ఎన్నికలు జరిగితేనే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. రాముడి విగ్రహం తల తొలగిస్తే ప్రశ్నించకుండా ఇంట్లో కూర్చోవాలా? తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ధర్మ పరిరక్షణ యాత్ర చేపట్టి ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేస్తాం. ఇతర మతాలపై దాడులు చేస్తున్న వారిని విమర్శిస్తే క్రైస్తవులు ఎందుకు బాధపడతారు? నిజమైన క్రైస్తవులు ఎవరూ బాధపడరు. కావాలనే ప్రభుత్వం మతవిద్వేషాలు రెచ్చగొడుతోంది’ అని ధ్వజమెత్తారు.


మరిన్ని

  • విమానాశ్రయంలో చంద్రబాబు నిరసన సరికాదురేణిగుంట విమానాశ్రయంలో తెదేపా అధినేత చంద్రబాబు ఆందోళన చేపట్టడం సరికాదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నడూలేని తరహాలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే... ఆయన నిరసన తెలపడం అన్యాయమన్నారు.
  • ఏప్రిల్‌కు 10 పాఠాల పూర్తిరాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ చివరి నాటికి పాఠాలను పూర్తి చేసి.. మే నుంచి పునశ్చరణ తరగతులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. నవంబరు 2 నుంచి పాఠశాలల్లో పూర్తి స్థాయి తరగతులు కొనసాగుతున్నాయి.
  • జనం నెత్తిన మళ్లీ గ్యాస్‌బండవంట గ్యాస్‌ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సోమవారం నుంచి గృహావసరాలకు వినియోగించే సిలిండరు ధర రూ.25, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండరు ధర రూ.96 పెంచారు. దీంతో విజయవాడలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండరు
  • ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారు‘ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబుకు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా, తిరుపతి విమానాశ్రయంలో ఆయన్ను పోలీసులు నిర్బంధించడం ఏమిటి’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్‌ పిరికితనంతో.. ప్రతిపక్షనేత చంద్రబాబును ప్రజల్లో తిరగకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారన్నారు
  • నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణపుర, నగరపాలక, నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నుంచి నామినేషన్ల ఉపసంహరణకు పురపాలకశాఖ ఏర్పాట్లు చేసింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అనుమతిస్తారు. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలతో బ్యాలెట్‌ పత్రాలు ముద్రించనున్నారు
  • 14 డివిజన్లు, వార్డుల్లో మళ్లీ నామినేషన్లుపుర ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులు బెదిరించి, భయపెట్టి అడ్డుకున్నారని, వేసిన చోట మళ్లీ వెనక్కి తీసుకునెలా ఒత్తిడి తెచ్చారని పలువురు చేసిన ఫిర్యాదులపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కడప, చిత్తూరు జిల్లాల్లో
  • కట్టారు..కూలగొట్టారు!విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువైన ఆలయం దశాబ్దాల కిందట ఎలా ఉందో... ఇప్పుడూ అచ్చం అలాగే ఉంది. కొండపై ప్రధాన ఆలయం, ఉప ఆలయాలు, మల్లేశ్వరస్వామి గుడి తప్ప చెప్పుకోదగ్గవి ఇంకేమీ లేవు. కొండపై గత పదిహేనేళ్లలో రూ.కోట్లు వెచ్చించి అనేక భవనాలు నిర్మించారు. కానీ... కట్టిన వాటిని కట్టినట్లే దాదాపు అన్నీ కూల్చేశారు.
  • కొవిడ్‌ నిబంధనలను పాటించాల్సిందేఎన్నికల ప్రచారంలో కొవిడ్‌ నిబంధనలను విధిగా పాటించాలని రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ సూచించారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో సోమవారం వివిధ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు
  • ప్రధానికి టీకాసాధారణ ప్రజానీకానికి కరోనా టీకాలు ఇచ్చే కార్యక్రమం సోమవారం దేశవ్యాప్తంగా ప్రారంభమయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వంటి ప్రముఖులు పాల్గొని ఈ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 60 ఏళ్లు పైబడ్డవారికి, వివిధ వ్యాధులు ఉన్న 45-59 ఏళ్లవారిని అర్హులుగా గుర్తించి టీకాలు ఇవ్వడం ప్రారంభించారు.
  • ఉభయతారకంగా నదుల అనుసంధానంనదుల అనుసంధానంలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దీనిపై కేంద్రానికి పంపే ప్రతిపాదనలన్నీ ఉభయతారకంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సోమవారం అధికారులతో సమీక్షించారు. నదుల అనుసంధానంపై ఇటీవల దిల్లీలో జరిగిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ అంశం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది
  • చంద్రబాబు నిర్బంధంతిరుపతిలో అనేక సమావేశాలు నిర్వహించారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ 55 వేల మంది వరకు వస్తున్నారు. ఇప్పుడు నాకు నోటీసు ఎందుకిచ్చారు? నేను రావడానికి అనుమతి కావాలా? ఇది దౌర్జన్యం కాదా? జిల్లా కలెక్టర్‌ను కలిసేందుకు నాకు హక్కు లేదా? నేను హత్య చేసేందుకు వెళ్తున్నానా? మీరు అనుమతి నిరాకరించారు కాబట్టి ఇక్కడే కూర్చుని నిరసన తెలియజేస్తా

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • బాబు గీసిన బొమ్మ.. ఎంజాయ్‌ చేస్తోన్న అనుపమ
  • మార్చి 4 నుంచి రష్మిక మకాం అక్కడే!
  • జయసుధను ఇలా చూశారా..?
  • సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
  • ఇంతకీ నీ అసలు వయసెంత అఫ్రిది?
  • బీమాసురులు
  • అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్‌
  • నటి హిమజకు పవన్‌ లేఖ
  • గృహ రుణాలపై ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌
  • ఇంగ్లాండ్‌ కోచ్‌ ఫిర్యాదు చేయొద్దు: పీటర్సన్‌
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.